Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచి ముహూర్థం ఒకటే సరిపోతుందా?
posted on: Sep 3, 2014 3:46PM
.jpg)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశంపై నిన్న శాసనసభలో ప్రకటన చేయవలసిఉంది. కానీ, రేపు దశమి మంచిరోజు కనుక రేపే ప్రకటన చేయాలని నిర్ణయించుకొన్నారు. అందుకు సిద్దాంతులు మధ్యాహ్నం 12.57 నిమిషాలకి ముహూర్తం కూడా ఖరారు చేసారు. రాజధానిపై ప్రకటనకు మంచి ముహూర్తం చూసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న రాయలసీమవాసుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వారికి ముందుగా నచ్చజెప్పి ప్రకటన చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పనిమొదలవుతుంది కనుక మొదలుపెట్టిన వేళా విశేషం అని తృప్తి పడటానికి అవకాశం ఉండేది. కానీ మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసిన తరువాత రేపటి నుండి రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు, నిరసనలు మొదలయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా!


.jpg)
.jpg)


