Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పై 11వ చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ
posted on: Sep 9, 2014 9:41PM
(3).jpg)
జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే పది చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఈ రోజు తాజాగా మరో చార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. షరా మామూలుగానే ఇది కూడా క్విడ్ ప్రో కేసే, ఇందులో కూడా జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరూ పద్మ, ద్వితీయ స్థానాలలో నిందితులుగా పేర్కొనబడ్డారు. ఈ కేసులో శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన ఇందూ హౌసింగ్ ప్రాజెక్టు సంస్థకు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేత ఉదారంగా అనేక హౌసింగ్ ప్రాజెక్టులు మంజూరు చేయించగా, ఇందూ సంస్థ ఆ ఋణం ఉంచుకోకుండా ఇందూ సంస్థ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలలో భారీ పెట్టుబడులు పెట్టిందని సీబీఐ చార్జ్ షీటులో ఆరోపించింది. క్లుప్తంగా ఇదీ కేసు.
చార్జ్ షీట్ దాఖలు చేయడం వరకే సీబీఐ పని. ఆ తరువాత మళ్ళీ అది ఎప్పుడు విచారణకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మార్చ్ 2002లో సీబీఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీటుకే ఇంతవరకు మోక్షం రాలేదు. కనుక ఈ 11వ చార్జ్ షీటు ఎప్పుడు విచారణకు వస్తుందో, దానిపై వాదనలు ఎప్పుడు పూర్తవుతాయో, కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుందో చెప్పడం ఎవరితరమూ కాదనే చెప్పవచ్చును.


.jpg)
.jpg)


