ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం (ఫిబ్రవరి 20)న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు జరగాల్సిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే అనూహ్యంగా కేబినెట్ భేటీ వాయిదా పడటంతో ఇందుకు కారణమేంటా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ భేటీకి అధ్యక్షత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా కేబినెట్ భేటీ వాయిదా పడింది. గురువారం (ఫిబ్రవరి 20) న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. దీంతో అనివార్యంగా ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది.  
Publish Date: Feb 19, 2025 2:32PM

బీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఎందుకంటే?

బీఆర్ఎస్ శ్రేణులలో చాలా రోజుల తరువాత కొత్త ఉత్తేజం, ఉత్సాహం కనిపించింది. ఇందుకు కారణం సుదీర్ఘ కాలం ఫామ్ హౌస్ కే పరమితమైన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కార్యాలయం తెలంగణ భవన్ కు రావడమే. బుధవారం (ఫిబ్రవరి 19)మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండటానికి కారణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు తదితర అంశాలపై ఆయన క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోగానే స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. సీఎం, సీఎం అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ వారిని మందలించారు. ఒర్లకండిరా బాబూ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన  జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు హాజరయ్యారు.  
Publish Date: Feb 19, 2025 2:21PM

ఎన్నికల కోడ్ కు అంబటి కొత్త భాష్యం.. అజ్ణానమా? అతి తెలివా?

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తన అమోఖమైన వాదనా పటిమతో జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను సమర్ధించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్నికల నియమావళికి సైతం కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేసే పార్టీలూ, అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని సెలవిచ్చారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఎన్నికలలో పోటీలో లేని వైసీపీకి ఆ కోడ్ వర్తించదని అంబటి రాంబాబు వాదిస్తున్నారు.  వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కృష్ణా గుంటూరు గ్రడ్యుయూట్ కాన్సిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది.  ఆ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు అనుమతి నిరాకరించింది. అయినా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వేలాది మందితో ప్రదర్శనగా మిర్చియార్డ్ కు వెళ్లి హల్ చల్ చేశారు. రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేశారు. అలా నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరులో పర్యటించడానికి ఎన్నికల కోడ్ కు సంబంధం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఎక్కడైనా సరే ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకే వర్తిస్తుందనీ, పోటీకి దూరంగా ఉన్న పార్టీలకు కాదనీ భాష్యం చెప్పి తన అజ్ణానాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీ పోటీలో లేదు కనుక ఆ పార్టీకీ, ఆ పార్టీ వ్యక్తులకు అది వర్తించకుండా మినహాయింపు లేదు. సభలూ, సమావేశాలు నిర్వహించకూడదు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదు. ఈ విషయం కూడా తెలియకుండానే అంబటి రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.   
Publish Date: Feb 19, 2025 1:45PM

చట్టాలపై జగన్ కు ఖాతరీ లేదు.. ఇదిగో మరో రుజువు!

చట్టాల పట్లా, నిబంధనల పట్లా, రాజ్యాంగం పట్ల  తనకు ఖాతరీ లేదని జగన్ మరోసారి రుజువుచేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరులో మిర్చియార్డు పర్యటనకు జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. పోలీసు శాఖ కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. అయినా జగన్ లెక్క చేయలేదు. వేలాది మందిని వెంటేసుకుని మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. వాస్తవానికి అనుమతి లేదు అని చెప్పిన పోలీసులు జగన్ భారీ ప్రదర్శనగా మిర్చియార్డుకు వెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు. అనుమతి లేని ప్రదర్శన చేసినందుకు ఎన్నికల సంఘం ఎలాగా కేసు పెడుతుంది అప్పుడు చూసుకుందాం అని వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఎంత నేరమో తెలియదనుకోలేం.    అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చియార్డులో మిర్చి రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు.  అదే సమయంలో రైతుల కష్టాలను గాలికొదిలేసి.. చంద్రబాబు తన దృష్టినంతా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనే కేంద్రీకరించారని విమర్శించారు.  దీంతో ఇప్పడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతి రైతులను ఎంత క్షోభపెట్టారో గుర్తు చేస్తూ నెటిజనులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై అప్పట్లో అడుగడుగునా దాడులు చేయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముందు వాటికి బదులిచ్చి ఆ తరువాత మిర్చిరైతుల గురించి మాట్లాడమని నిలదీస్తున్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఒిక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ పోరాడడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అందుకోసం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడాన్నీ, చట్టాలను ధిక్కరించడాన్ని ఎవరూ సమర్ధించరు. అలా చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మిన్నకుండటం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   
Publish Date: Feb 19, 2025 1:12PM

ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది ఉండవల్లీ!

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మరపిస్తారు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లికి చీమకూడా కుట్టలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన హేతురహిత వ్యాఖ్యానాలతో జగన్ తరఫున మాట్లాడే వారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ నవ్వుల పాలైన సందర్భా లెన్నో ఉన్నాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి.  రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న ఆయన బుద్ధిగా రాజకీయాలు మాట్లాడకుండా తన పని తాను చూసుకోకుండా తగుదునమ్మా అంటూ జగన్ కోసం వాస్తవాలను వక్రీకరించిన వైనంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఆ తరువాత ఎన్నడూ రాజకీయాలపై మాట్లాడలేదు. విశ్లేషణలు చేయలేదు. కానీ ఉండవల్లి మాత్రం అందుకు భిన్నంగా జగన్ కోసం వంకర రాజకీయాలు చేస్తూనే వస్తు న్నారు. గత ఏడాది ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత   ఉండవల్లి మరింత చురుకుగా జగన్ కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ సన్యాసానికి గుడ్ బై చెప్పి జగన్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకుని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే  నేరుగా జగన్ పార్టీలో చేరి తాను చేసేదేం లేదని గ్రహించిన ఉండవల్లి రాజకీయ సన్యాసాన్ని కంటిన్యూ చేస్తానంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి జగన్ కు తన పరోక్ష మద్దతు కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో జగన్ కు ప్రయోజనం చేకూర్చడం కోసం ఇతర పార్టీల మధ్య సఖ్యతకు బీటలు వారే వ్యాఖ్యలకు తెరలేపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉండవల్లి కూటమి పార్టీల్లో విభేదాలున్నాయన్న అనుమానాలు జనబాహుల్యంలో కలిగించేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో తన వంతు ప్రయత్నం చేశారు. జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఆశాజ్యోతిగా పవన్ కల్యాణ్ను అభివర్ణిస్తూ మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందర్నీ మెప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా పేర్కొంటూ ఉండవల్లి తనకు మాత్రమే సాధ్యమైన లౌక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు కంటే పవన్ కల్యాణే మంచి నాయకుడని   చెప్పడం ద్వారా తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ సృష్టించి తద్వారా జగన్ కు ఏదో మేరకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారు.  పవన్ కల్యాణ్ వల్ల మాత్రమే రాష్ట్ర‌ విభజన సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని ప్రజలు నమ్ముతున్నారనీ , విభ‌జ‌న హామీల సాధ‌న‌ కోసైం ఏం చేయాలో తాను పవన్ కు లేఖ రాశాననీ పేర్కొన్నారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆయన కొత్తగా మొదలు పెట్టిన పవన్ భజన వల్ల జగన్ కు ఇసుమంతైనా ప్రయోజనం చేకూరదని అంటున్నారు. జగన్, వైసీపీ పవన్ ను టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఉండవల్లి స్పందింలేదని గుర్తు చేస్తున్నారు. 
Publish Date: Feb 19, 2025 11:48AM

తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం.. వనపర్తి జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత 

ఎపిలో బర్డ్ ఫ్లూ సోకి  కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా తెలంగాణలో కూడా బర్డ్ ప్లూ విస్తరించినట్లు వార్తలందుతున్నాయి. వనపర్తి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతుంటే వెటర్నరీ అధికారులు  మాత్రం ఇంత వరకు ధృవీకరించలేదు. చనిపోయిన కోళ్లను జెసీబీ మిషన్లతో గొయ్యి తవ్వి పూడ్చేస్తున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన రైతు శివకేశవరెడ్డి వెటర్నరీ అధికారులకు ముందుగానే సమాచారమిచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదు. దీంతో  ఆయనకు చెందిన నాలుగు వేళ్ల కోళ్లు మృత్యువాత పడ్డాయి
Publish Date: Feb 19, 2025 11:34AM