Top Stories

నిలువెత్తు నిఘంటువు చందరబాబు.. కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. . చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం   ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది. ఆ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లేన ఎందరో తెలుగు విద్యార్థులకు చంద్రబాబు అండగా నిలిచారనీ, వారి ఫీజులు చెల్లించి ఆదుకున్నారనీ చెప్పారు. అయితే చంద్రబాబు చేసిన ఈ సహాయం గురించి ఒకరిద్దరు వినా మరెవరికీ తెలియదన్నారు.  చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడే కాదనీ, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి అన్న పెమ్మసాని, అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వచ్చి, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిస్తే చంద్రబాబు వెంటనే స్పందించేవారని తెలిపారు.ఆయన సేవా దృక్పథానికి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.  చంద్రబాబును 'నిలువెత్తు నిఘంటువు'గా అభివర్ణించిన పెమ్మసాని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే సమయంలో ఆ స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అమరావతి వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టాలనే సంకల్పం, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలని కొనియాడారు. అమరావతి  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెడల్పు విషయంలో చంద్రబాబు దూరదృష్టిని పెమ్మసాని ప్రస్తావిస్తూ..  కేంద్రం 70 మీటర్ల వెడల్పుకు అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ తో అర్ధరాత్రి ఒంటిగంటకు సమావేశమై చర్చించి, ఒప్పించారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత, పట్టుదల తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పెమ్మసాని చెప్పారు. 
నిలువెత్తు నిఘంటువు చందరబాబు.. కేంద్ర మంత్రి పెమ్మసాని Publish Date: Apr 21, 2025 7:04AM

చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలు.. తెలుగు తమ్ముళ్లలో జోష్!

 తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.   చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందింది అని కొనియాడారు.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు  తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో నటించిన సినిమాలో ‘చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు ప్రశంసలు కురిపిస్తుంటే.. తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థే పొగడ్తల వర్షం కురిపిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ సంబరపడిపోతున్నారు.   తెలంగాణలో తమ రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడినీ విమర్శించి రాజకీలబ్ధి పొందింది బీఆర్ఎస్. తెలంగాణ సెంటిమెంట్ పండించడం కోసం అప్పుడూ, ఇప్పుడూ కూడా చంద్రబాబును తెలంగాణకు విలన్ గా చూపించేందుకు నానా తంటాలూ పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2019 ఎన్నికలలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఎగతాళి చేసిన కేసీఆర్, జగన్ హయాంలో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అలాంటి ఆ ఇద్దరూ  చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అభినందనలతో ముంచెత్తారు. ఊరికే శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా చంద్రబాబును పొగడ్తలతో  ముంచెత్తారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా లేదా రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇదే చంద్రబాబును ఇదే కేసీఆర్, కేటీఆర్ ఇష్టారీతిగా విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు చంద్రబాబును లేదా ఆంధ్రా పాలకులను కేసీఆర్, కేటీఆర్ ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి వారిద్దరూ ఇప్పుడు సీబీఎన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్, కేసీఆర్ లను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 
చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలు.. తెలుగు తమ్ముళ్లలో జోష్! Publish Date: Apr 21, 2025 6:48AM

గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండు రోజుల పర్యటన.. ఎలా సాగుతోందంటే?

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో  దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో అధ్య‌యనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.  ఆదివారం (ఏప్రిల్ 20)) అహ్మదాబాద్ చేరుకున్న నారాయణ బృందం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏక్తానాగర్ చేరుకుంది.  అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఉపయోగంచిన సాంకేతికత, పరికరాలు తదితర అంశాలను పరిశీలించింది.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన భారీ విగ్రహాల కోసం మంత్రి నారాయణ బృందం పటేల్ విగ్రహాన్ని పరిశీలించింది. ఈ బృందంలో ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు,  సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు తదితరులు ఉన్నారు. ఈ బృందం ఇప్పటికే  ముంబ‌యి, ఢిల్లీలో ప‌ర్య‌టించిన సంగతి విదితమే. ఇప్పుడు గుజరాత్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం .ఏక్తాన‌గ‌ర్ లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన స‌ర్ధార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ విగ్ర‌హాన్ని ప‌రిశీలించారు.అనంతరం  స్థానిక అధికారుల‌తో పాటు ప‌టేల్ విగ్ర‌హ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ప్ర‌తినిధులు మంత్రి నారాయణ బృందానికి పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా విగ్రహ నిర్మాణం చేసిన విధానం. అందుకోసం ఉపయోగించిన సాంకేతికత, సామగ్రి తదితర అంశాలను వివరించారు.  అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ విగ్ర‌హం తో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌ముఖుల భారీ విగ్ర‌హాలు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విగ్రహాల నిర్మాణం కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని పరిశీలించిన నారా యణ బృందం   దానికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలనూ పరిశీలించింది. అనంతరం    అహ్మ‌దాబాద్ గాంధీన‌గ‌ర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్( గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్), సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సెప్ట్ ) యూనివర్శిటీనీ సందర్శించింది.  అలాగే స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను కూడా మంత్రి నారాయణ బృందం సంద‌ర్శించింది.   స‌బ‌ర్మ‌తి న‌దీ తీర ప్రాంతం అభివృద్ది కోసం గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స‌బ‌ర్మ‌తి రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ను కూడా ఏర్పాటుచేసింది.  . అమ‌రావ‌తి కూడా కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తుండ‌టంతో, స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను ఏవిధంగా అభివృద్ది చేసార‌నే దానిపై అధ్య‌య‌నం చేసింది మంత్రి నారాయణ బృందం. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సోమ‌వారం(ఏప్రిల్ 21)న మంత్రి నారాయణ బృందం  స్పోర్ట్స్ సిటీని సందర్శనలో భాగంగా  న‌రేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను మంత్రి బృందం సంద‌ర్శించ‌నుంది. అమరావతిలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండు రోజుల  పర్యటన.. ఎలా సాగుతోందంటే? Publish Date: Apr 21, 2025 6:11AM

రేపటి నుంచి వైన్స్ బంద్ ఎందుకంటే?

  ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ ఎఫెండ్‌ను మజ్లిస్ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్‌తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.  25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.  
రేపటి నుంచి వైన్స్ బంద్ ఎందుకంటే? Publish Date: Apr 20, 2025 5:51PM

చంద్రబాబు శాసనసభ ప్రసంగాలపై పుస్తకావిష్కరణ

    సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా  అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్‌ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్‌, సీనియర్‌ పాత్రికేయులు, రచయిత విక్రమ్‌ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.   ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దాని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్  అన్నారు. చంద్రబాబు ఆనాడు చేసిన కృషితో ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని ఆయన తెలిపారు. హైదరాబాదును సంపద ఉపాధి కేంద్రంగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని కూడా అలాగే నిర్మించ తలపెట్టారని వ్యాఖ్యానించారు.  చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదని అన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చిన్న కుర్రాడు చెప్పినా.. శ్రద్ధగా వింటూ టైమ్‌ మర్చిపోయి, నిత్య విద్యార్థిగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నేర్చుకుంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆయన సమయపాలనతో ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినా.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఆయన ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు. . ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 చంద్రబాబు  శాసనసభ ప్రసంగాలపై  పుస్తకావిష్కరణ Publish Date: Apr 20, 2025 5:01PM

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షలు వితరణ

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్‌ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుకి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. చంద్రబాబుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు.  
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షలు వితరణ Publish Date: Apr 20, 2025 4:00PM

తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు : కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారంద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఔట‌ర్ లోప‌ల కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌కు ప్ర‌జ‌లు మోస‌పోలేదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వ‌లేదు. గోషామ‌హ‌ల్ కూడాపోయేది కాదు.. ఆగ‌మాగం వ‌ల్లే పోయింది. ప్ర‌జ‌లు ఎప్పుడైనా మంచి ప‌నుల‌ను ఆద‌రిస్తారు అని కేటీఆర్ అన్నారు. ఇవాళ చంద్ర‌బాబు జ‌న్మ‌న‌దినం.. హృద‌య‌పూర్వ‌కంగా శుభాకాంక్ష‌లు.  ఆయ‌న ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. సంస్కార‌వంత‌మైన ప్ర‌భుత్వం గ‌త ప్ర‌భుత్వాల‌ను గౌర‌విస్తూ ప్ర‌వ‌ర్తిస్త‌ది అని కేటీఆర్ తెలిపారు.మేం ప‌దేండ్ల ఉన్నాం.. ఆన‌వాళ్లు చెరిపేస్తాం అన‌లేదు. అది అనాగ‌రిక చ‌ర్య‌. కాక‌తీయుల ఆన‌వాళ్ల‌ను కుతుబ్‌షాహీలు, అస‌ఫ్‌జాహీలు కూడా చెరిపేయ‌లేదు. కానీ రేవంత్ సర్కార్ కిరాత‌క ప‌నులు చేస్తుంది. మంచి ప‌నులు చేయ‌రు. చేసిన మంచి ప‌నుల‌ను ఆపుతారు. అభివృద్ధికి అంద‌రం స‌హ‌క‌రిస్తాం. కానీ16 నెల‌ల్లో విధ్వంసం జ‌రిగింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు.. 500 రోజుల త‌ర్వాత కూడా ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదు. ఒక్క‌టే ఒక్క‌టి ఫ్రీ బ‌స్సు అమ‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని చిత్ర‌విచిత్రాలు ఆర్టీసీ ఉచిత బ‌స్సుల్లో చూస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. తులం బంగారం కోసం ఆడ‌బిడ్డ‌లు ఆశ‌ప‌డ్డారు. రైతుబంధు రూ. 15 వేలు అని చెప్పేస‌రికి రైతులు కూడా ఆశ‌ప‌డ్డారు. రూ. 2 ల‌క్ష‌ల రుణాల వ‌ర‌కు మాపీ చేస్తామ‌ని చెప్పేస‌రికి ఆశ‌ప‌డ్డారు. రూ. 4 వేల పెన్ష‌న్ ఇంటికి ఇద్ద‌రికి ఇస్తామ‌ని చెప్పేస‌రికి ఆశ‌ప‌డ్డారు. తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు నింపుతాన‌ని రాహుల్ గాంధీ అశోక్ న‌గ‌ర్‌లో ఫోజులు కొట్టి చెప్పేస‌రికి.. మ‌నం ఇచ్చిన 1 ల‌క్షా 60 వేల ఉద్యోగాలు మ‌రిచిపోయారు. పిల్ల‌లు కూడా కొంత టెంప్ట్ అయ్యారు. 420 వాగ్దానాలు చేసి మోసం చేశారు కాంగ్రెసోళ్లు. డిక్ల‌రేష‌న్ల పేరిట మోసం చేశారు. 
తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు : కేటీఆర్ Publish Date: Apr 20, 2025 3:28PM

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్

  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్  తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో  కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, అశోక్‌బాబు, వీవీవీ చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎ.వి.రమణ హాజరయ్యారు. విజనరీ లీడర్‌ చంద్రన్న పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నేతలు తిలకించారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమల అలిపిరి మార్గంలో పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా కొబ్బరికాయాలు కొట్టి పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, టీడీపీ నేత అరవింద్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని.. ఆయన విజయాలకు పొంగిపోలేదని.. అపజయాలకు కుంకుంగిపోలేదని అన్నారు. అధికారం ప్రజలకు సేవ చేసేందుకేననని నమ్మిన నేత చంద్రబాబు అని,‘చంద్రబాబు P4’ కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణలో, అంకిత భావంలో, భవిష్యత్తు కార్యాచరణలో, సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకే సీబీఎన్  ఆదర్శమని అన్నారు. సీబీఎన్ నాయుడు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని.. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని పల్లా శ్రీనివాసరావు కొనియాడారు.  
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్ Publish Date: Apr 20, 2025 1:26PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్

  నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే 3,038 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌న్నారు. వీటిలో డ్రైవర్-2,000, శ్రామిక్స్-743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్-15, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11, మెడికల్ ఆఫీసర్ (జనరల్)-07, మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)-07, అకౌంట్స్ ఆఫీసర్-06 పోస్టులు ఉన్నాయ‌ని మంత్రి పొన్నం పేర్కొన్నారు  తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.  
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ Publish Date: Apr 20, 2025 12:58PM

డ్రగ్స్‌ నిర్శూలనకు చేయిచేయి కలుపుదాం : చిరంజీవి

  డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీవర్క్స్‌ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ వర్చువల్‌ సందేశం పంపారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామన్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.  డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రేడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పబ్‌లు, క్లబ్బుల్లో స్నిఫర్ డాగ్స్‌తో నార్కొటిక్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్‌ను అరికట్టేందుకు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రహారీ క్లబ్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  
డ్రగ్స్‌ నిర్శూలనకు చేయిచేయి కలుపుదాం : చిరంజీవి Publish Date: Apr 20, 2025 12:30PM

నాన్నగారికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌

ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ 75వ పుట్టిన రోజు సందర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.  ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ ఆస‌క్తిక‌ర వీడియోను కూడా జోడించారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ‘పుట్టినరోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.‘‘మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో మీరు నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతిరోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’’ అని భువనేశ్వరి రాసుకొచ్చారు. కాగా, చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  
నాన్నగారికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌ Publish Date: Apr 20, 2025 12:03PM

నా ప్రియ మిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్బంగా ఈ సందర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు చంద్రబాబుకు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమాల వేదికగా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్వట్టీర్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా  బ‌ర్త్ డే విషెస్  తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్  చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  చంద్ర‌బాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సీబీఎన్‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అటు కేంద్ర‌మంత్రులు, మంత్రులు ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.      
నా ప్రియ మిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోదీ Publish Date: Apr 20, 2025 11:51AM

సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.  ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.  అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు .బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.  అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు .  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు. . ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.
సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం! Publish Date: Apr 20, 2025 9:10AM

నిమ్స్ లో ఫైర్ యాక్సిడెంట్

పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో శనివారం (ఏప్రిల్ 19)ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమ్స్ ఐదో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్ర భయాందోనలకు గురయ్యారు.   మంటలు వేగంగా వ్యాపించడంతో వార్డులలో నుంచి బ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.   ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు. ఈ సంఘటనపై స్పందించిన నిమ్స్ యాజమాన్యం నిమ్స్ ఆస్పత్రి ఐదో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదనీ, ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదనీ పేర్కొంది. అగ్నిప్రమాదం ఐదో అంతస్తులో ఆడిటోరియం వద్ద జరిగిందనీ, అక్కడ పేషెంట్లు ఎవరూ ఉండరనీ పేర్కొంది. పొగలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అప్రాంతం నుంచి అందరినీ తరలించేశారనీ వివరించింది. కాగా నిమ్స్ లో అగ్నిప్రమాదం సమాచారం తెలియగానే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫోన్ లో నిమ్స్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 
నిమ్స్ లో ఫైర్ యాక్సిడెంట్ Publish Date: Apr 20, 2025 8:37AM

నిరంతర శ్రామికుడు.. అభివృద్ధికాముకుడు.. చంద్రబాబు

14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి  45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం.. 52 రోజులు జైల్లో పెట్టినా తొణకని.. బెణకని ధీశాలి.. జాతీయ రాజకీయాల్లోనూ ఆయనది కీలక పాత్ర .. అమరావతి రూపశిల్పి.. నవ్యాంధ్రకు సీఈఓ.. అంతర్జాతీయ స్థాయిలోనూ అపార గౌరవం  నాలుగోసారి ముఖ్యమంత్రిగా పాలనతో తనదైన మార్క్ .. ఇలా ముఖ్యమంత్రి నారా  చంద్రబాబునాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడిలోకి అడుగుపెడుతున్న ఆ యంగ్ టర్క్‌కి తెలుగు జాతి యావత్తు మనస్ఫూర్తిగా బర్త్‌డే విషెస్ చెపుతోందిప్పుడు. నిరంతర శ్రామికుడు, అభివృద్ధి కాముకుడు, అలుపెరగని నాయకుడు, పడిన ప్రతిసారీ ఉవ్వెత్తున ఎగిసే కెరటం.. ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.  1950 ఏప్రిల్ 20 ఆయ జన్మదినం. అంటే 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. గత  ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి,  నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దార్శనికుడాయన. కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న నేత చంద్రబాబు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి, జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి, చంద్రబాబు అద్భుత విజయం సాధిస్తారని, మిత్రపక్షాలతో కలసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయడమే ఆయన స్టైల్.  1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు... ఆయన 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో,  సెప్టెంబరు 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు సార్లు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన,  ఇప్పుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ రికార్డే. ఆయన సాధించిన విజయాల్ని తరచి చూస్తే... వాటి వెనుక ఎన్నో త్యాగాలు, అవిరళ కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచీ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకున్నారు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు.  1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి, చిన్ననీటి పారుదల వంటి శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించాక... తొలి ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌ తరఫున చంద్రగిరిలోనే పోటీచేసి ఓడిపోయారు. అనంతరం  టీడీపీలో చేరి తన రాజకీయ దక్షత, సునిశిత మేధతో ఎన్టీఆర్‌కు కుడి భుజంగా మారారు. ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచీ అప్రతిహతంగా గెలుస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కిందపడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పోరాటం ప్రారంభించి మళ్లీ గెలిచి చూపించారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు... గడచిన ఐదేళ్లూ ఒకెత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన నాయకులతో కలసి పనిచేశారు. మహామహా రాజకీయ దురంధరులను  ఢీకొట్టారు. రాజకీయ పోరాటాలు, గెలుపోటములు ఆయనకు కొత్త కాదు. ఏ మాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్‌ వంటి నాయకుడి ఐదేళ్ల పాలనలో.. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు, కక్షసాధింపులు ఎదుర్కొన్నారు. టీడీపీ  నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జగన్‌ ఐదేళ్లూ విశ్వప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు,  కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయించారు. భౌతిక దాడులు, హింసాకాండ యథేచ్ఛగా సాగాయి.  జోగి రమేష్‌ మందీ   మార్బలాన్ని వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపైకే దండయాత్రకు వచ్చారు. డీజీపీ కార్యాల యానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి తెగబడి, విధ్వంసం సృష్టిస్తే అప్పటి ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు వయసు, రాజకీయ అనుభవానికి కనీస గౌరవం ఇవ్వకుండా... వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే... జగన్‌ తనదైన స్టైల్లో నవ్వుతూ ప్రోత్సహించినా ఆయన సహించారు. చివరకు అసెంబ్లీలో తన భార్య వ్యక్తిత్వాన్నే కించపరిచేలా వ్యాఖ్యలు చేసేసరికి... సహించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చేశారు. ఆయనపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి    52 రోజులు జైల్లో పెట్టినా మౌనంగా భరించారు. ఇన్ని అవమానాలు, దాడులు ఎదురైనా చెక్కుచెదరని స్థైర్యంతో పోరాడి గత ఎన్నికల్లో వైసీపీ మూకల్ని మట్టి కరిపించారు. పార్టీ చరిత్రలోనే అనన్య సామాన్యమైన  విజయాన్ని నమోదుచేసి, మరో 40 ఏళ్లకు సరిపడా జవసత్వాల్ని  పార్టీకి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయ గాథలు తెలుసుకోవడానికి దేశ, విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్‌ పార్లమెంటులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చాలా త్వరగా వచ్చింది. భారీ వర్షాలు, తుపానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరినీ చూడలేదు. 1996లో కోనసీమను భారీ తుపాను అతలాకుతలం చేసినప్పుడు, ఆయన నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాక హుడ్‌హుడ్, తిత్లీ వంటి తుపానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం, పది రోజులపాటు అక్కడే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుతిరిగారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట!  చెప్పడమే కాదు... దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటుతో, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన... అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూసమీకరణ విధానంలో రెండు నెలల్లోనే 33వేల ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది.  2023 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని మూడు అగ్రశ్రేణి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో సామాజిక పింఛన్లను రూ.2వేలకు పెంచడం, అన్న క్యాంటీన్లు, ఆదరణ వంటి కొన్ని పదుల సంక్షేమ కార్యక్రమాల్ని అమలుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండగా... రాష్ట్ర అభివృద్ధికి విజన్‌-2020 తయారుచేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పారదోలే ఆయుధమని గ్రహించి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే!  హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు, ఐఎస్‌బీ, ఐఐఐటీ వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్ని ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించి, వారికి విందులో ఆయన స్వయంగా వడ్డించేవారు. అప్పుడే ఆయనకు రాష్ట్రానికి సీఈఓ అని పేరు వచ్చింది. అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో 22వ స్థానంలో ఉన్న ఏపీ... ఆయన కృషి వల్ల నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆయన నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా, ఐఎస్‌బీ వంటి సంస్థలు ప్రత్యేక ఉత్సవాలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించాయంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతుంది.  రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ వంటి మహా నగరాన్ని కోల్పోయి, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక, ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుకున్న పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కయ్యారు!  ఆయన అపార పరిపాలనా అనుభవం, దార్శనికత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడే తపన.. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు బలంగా నమ్మారు. 2014లో రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయనకు కట్టబెట్టారు. చంద్రబాబు అహరహం శ్రమించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేసి, నిర్మాణం పరుగులు పెట్టించారు. పట్టిసీమ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారు.  కరవు సీమ... రాయలసీమకు సాగునీరు అందించారు. పట్టుబట్టి పోలవరం ప్రాజెక్టును 70 శాతానికి పైగా పూర్తిచేశారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని, రూ.వేల కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి ఒక మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నం.1 స్థానంలో నిలిపారు. 22 మిలియన్‌ యూనిట్ల కరెంటు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రంగా మార్చారు.  దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల్లో ఒక సీఈఓలానే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాల్ని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. కాలికి బలపం కట్టుకుని అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆయన కృషి ఫలితంగానే.. ఐటీ, ఆటోమొబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి రంగాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కియా, హీరో మోటార్స్, ఇసుజు, అశోక్‌ లేలాండ్, హెచ్‌సీఎల్, ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, రామ్‌కో, ఫ్లోరా సిరామిక్స్, అపోలో టైర్స్‌ వంటి అనేక పరిశ్రమలు, సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి.  దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న అతి కొద్దిమంది సీనియర్‌ నాయకుల్లో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్‌ ఫ్రంట్, ఎన్డీయేలకు కన్వీనర్‌గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు, యావత్‌ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యభూమిక నిర్వహించిన చంద్రబాబు... ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు భాజపాకు దక్కకపోవడంతో తెదేపా మద్దతు కీలకమైంది. ఎన్డీయే పక్షాల్లో బీజేపీ తర్వాత, అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ టీడీపీనే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు ప్రాభవం మొదలైంది. ఎన్టీఆర్‌ హయాం నుంచి చంద్రబాబుకు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో ఆయన యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు చొరవ చూపి, దానికి కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానులుగా ఎంపిక చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు.  1998లో కేంద్రంలో బీజేపీకి టీడీపీ మద్దతిచ్చింది. చంద్రబాబు కన్వీనర్‌గా ఎన్డీయే ఏర్పాటైంది. వాజపేయీ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర నిర్వహించారు. ఆ ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతిచ్చారు. రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపికలోనూ ఆయనదే ముఖ్య భూమిక. ఎస్సీ వర్గానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభకు స్పీకర్‌గా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కలసి పోటీచేశాయి. ఈ కూటమికి జనసేన పార్టీ మద్దతిచ్చింది. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు  వంటి కొన్ని అంశాల్లో విభేదించి 2019 ఎన్నికలకు ఏడాది ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ  వైదొలగింది. ఈసారి ఎన్నికల్లో భాజపా, జనసేనలతో పొత్తు పెట్టుకున్న తెదేపా సొంతంగా 16 లోక్‌సభ స్థానాల్ని, మిత్రపక్షాలతో కలసి 21 స్థానాల్ని గెలుచుకుంది.  ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే... వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభా పాటవాల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయ నాయకుల్లో ఐటీ జ్ఞానిగా, ఈ-గవర్నెన్స్‌ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 1998లో అమెరికాలోని ఇలినాయి గవర్నర్‌ జిమ్‌ ఎడ్గార్‌ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబరు 24వ తేదీని ‘నాయుడు డే’గా ప్రకటించారంటే ఆయన విజన్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్, బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్‌ ప్రధాని, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటివారు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. బిల్‌గేట్స్‌ వెంటపడి, ఒప్పించి మైక్రోసాఫ్ట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించేలా చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే! పలు పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు ఇచ్చాయి. ‘ఐటీ ఇండియన్‌ ఆఫ్‌ ద మిలేనియం’గా, ‘బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘సౌత్‌ ఏషియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ వంటి బిరుదులతో సత్కరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్‌ చంద్రబాబును ‘హిడెన్‌ సెవెన్‌ వర్కింగ్‌ వండర్స్‌’లో ఒకరుగా అభివర్ణించింది. బీబీసీ... ‘సైబర్‌ శావీ సీఎం’ అని కొనియాడింది. సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ ‘సీఈఓ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ప్రశంసించింది.   విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన దగా కంటే... 2019 నుంచి ఐదేళ్ల జగన్‌ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట..! జగన్‌ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై పడింది. ఐదేళ్ల పాటు ఆయన అలుపెరగకుండా శ్రమించినా... జగన్‌ వచ్చి ఒక్క ఛాన్స్‌ అనడంతో ప్రజలు ఆయనను నమ్మారు. చంద్రబాబు కంటే బాగా అభివృద్ధి చేస్తారేమోననుకుని 2019లో ఒక్క ఛాన్స్‌ ఇచ్చారు. ఐదేళ్ల విధ్వంసకర పాలన చూశాక.. చంద్రబాబు విలువేంటో, రాష్ట్రానికి ఆయన అవసరమేంటో గుర్తించారు. రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల జగన్‌ విధ్వంసక పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్నారు. ఈసారి అసాధారణ సంఖ్యలో సీట్లు కట్టబెట్టి, కనీవినీ ఎరుగని మెజారిటీలతో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టారు.  ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఆయన భుజస్కంధాలపై ఉంది. జగన్‌ పాలనలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాక... ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యాక... వచ్చే ఐదేళ్లూ రాష్ట్రాన్ని పరిపాలించడం నల్లేరు మీద బండి నడక కానే కాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టడం, తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన యువతకు మళ్లీ భరోసా ఇచ్చి, ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయడం, పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసాన్ని పాదుకొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం తప్పకుండా పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాలు. 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిత్య యవ్వనుడు, హైటెక్ సీఎం సీబీఎన్‌కు ఆ సవాలు అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు . హ్యాపీ బర్త్‌డే.. అండ్.. అల్ దబెస్ట్ సీబీఎన్ సార్
నిరంతర శ్రామికుడు.. అభివృద్ధికాముకుడు.. చంద్రబాబు Publish Date: Apr 20, 2025 6:44AM

కాలాతీతుడు.. కారణ జన్ముడు.. నారా చంద్రబాబునాయుడు!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు 75 జన్మ దినం ఆదివారం (ఏప్రిల్20).  ఈ సందర్భంగా, వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ..అందిస్తున్న అభినందన అక్షరమాల ..    నారా చంద్రబాబు నాయుడు.. కాలాతీతుడు, కారణ జన్ముడు. అవును. వయసు ముందుకు వెళ్ళే కొద్దీ, భారంగా మారుతుంది. వయసు భారం పెరుగుతుంది. ముఖ్యంగా, సప్త పదులు దాటి, వృధ్యాప్యంలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి అడుగూ భారంగానే పడుతుంది. సహజంగానే  అడుగులు తడబడతాయి, ఆలోచనలు మందగిస్తాయి. కదులుతున్న కాలంతో కదలలేని నిరాసక్త కృంగదీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితం చలన రహితంగా,నిశ్చలన చిత్రంగా నిలిచిపోతుంది.  అవును. ఇది నిజం.  సర్వ సాధారణ ప్రకృతి ధర్మం.  కానీ.. కొందరుంటారు, ఏదో ఒక పవిత్ర కార్యాన్ని నెరవేర్చేందుకు జన్మించిన కాలాతీత వ్యక్తులు, కారణ జన్ములు.  ఎక్కడో కోటికొక్కరు ఉంటారు. అలాంటి కారణ జన్ములకు వయసుతో సంబంధం ఉండదు. వయసు అడ్డురాదు. కాలంతో సంబంధం ఉండదు. కార్యమే ప్రధానంగా సాగిపోతూనే ఉంటారు. కార్యసిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంటారు. అలాంటి కారణజన్ములను, ఆవరోధాలు అడ్డుకోలేవు. వాటినే వారు  అవకాశాలుగా మలచుకుంటారు. వివేచనతో  అవరోధాలను అధిగమిస్తూ ముందుకు  సాగుతూనే ఉంటారు.    అదిగో అలాంటి కారణజన్ముల్లో, అలాంటి కాలాతీత వ్యక్తుల్లో  ఈరోజు (ఏప్రిల్ 20) 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న  తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఒకరు. ఒకరు కాదు. ఒకే ఒక్కరు. అవును ఈ వయసులోనూ అలుపూ సొలుపూ లేకుండా పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల కోసం పని చేయడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. అందుకే  చంద్రబాబు ఒకే ఒక్కరు. ఆయనలాంటి ఇంకొకరు ఉండరు.   అవును  75 సంవత్సరాల వయసులో, ఒకటీ రెండు కాదు, ఏకంగా వంద మెట్లు సునాయాసంగా ఎవరు ఎక్కగలరు. వయసును జయించిన చంద్రబాబు  తప్ప. మెట్లు ఎక్కడమే కాదు నిటారు నిలబడి బాధ్యతల బరువులు మోయగల సామర్ధ్యం కూడా ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చారిత్రక వాస్తఃవం. అదొక్కటే కాదు, చంద్రబాబాబు, ‘పుస్తకం’ తెరిస్తే.. ఇలాంటి రికార్డ్స్  ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ఎవరి  ఆసరా అవసరం లేకుండా,(అవును,ఆయనే ఎందరికో ఆసరా కదా)  ప్రచార రథం మెట్లు చకచా ఎక్కేస్తారు. ఎక్కడా తడబడకుండా,తొట్రుపాటు లేకుండా అలా నిలబడే అనర్గళంగా, అద్భుతంగా. సుదీర్గ ప్రసంగం చేస్తారు.. చప్పట్లు కొట్టించుకుంటారు.  చంద్రబాబు నాయుడు కారణజన్ముడు మాత్రమే కాదు. కాలాన్ని జయించిన కాలాతీతుడు. అందుకే  47 డిగ్రీల మండు టెండలో అయినా, గజగజ లాడించే తుపాను గాలుల్లో అయినా ప్రజాబలంతో పనిచేసే, ఒకే  ఒక్కడు. చంద్ర బాబు నాయుడు రోజుకు 20 గంటల చొప్పున ఏడాది పొడవునా అంటే  365 రోజులూ పని చేసే ఏకైక నాయకుడు. చంద్రబాబుకు  పని రాక్షసుడు’ అనే పేరు ఎప్పుడో  వుంది. అలాగే  పరిపాలనలో ఆయనకు ఆయనే సాటి. ప్రభుత్వ శాఖలన్నిటిపైనా  పట్టున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుదీర్గ అనుభంలో అన్ని ప్రభుత్వ శాఖలను అవపోసన పట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఇన్ని మాటలు ఎందుకు.. తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన వరం నారా చంద్రబాబు నాయుడు. ఆయన జీవితం.. ఈ తరానికే కాదు, ముందు తరాలకు కూడా ఒక పాఠ్య పుస్తకం. అందరం చదువుకుందాం.అందరం నేర్చుకుందాం.  మరొక్క మారు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు..
కాలాతీతుడు.. కారణ జన్ముడు.. నారా చంద్రబాబునాయుడు! Publish Date: Apr 19, 2025 11:35PM

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. చాలా కాలంగా మెగా డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల తేదీని ప్రకటించేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శనివారం (ఏప్రిల్ 19) సాయంత్రం విడుదల చేసిన ప్రకటన మేరకు మెగా డిఎస్సీ 2025 నోటిఫికేషన్ఆదివారం (ఏప్రిల్ 20)న వెలువడ నుంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తొలి సంతకం మెగా డీఎస్పీ ఫైలు పైనే చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన రోజు వ్యవధిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో కలిపి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తి చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఆదివారం (ఏప్రిల్ 19) విడుదల చేయనుంది.ఇప్పటికే మెగా డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని  42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని జీవోలో స్పష్టంగా  పేర్కొంది.  కాగా మొత్తం 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేపు అంటే ఆదివారం (ఏప్రిల్ 20)న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా పేర్కొంది.  
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా? Publish Date: Apr 19, 2025 11:09PM

విడదల రజిని వైజాగ్ కి వెళ్లి ఉంటే..?

ఒక ఐడియా మాత్రమే కాదు..  ఒక పొరపాటు కూడా జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఓటమిపాలైన వైసీపీ  నాయకుల్లో ఈ పరిస్థితి చాలా మందిలో కనిపిస్తోంది.  జగన్మోహన్ రెడ్డితో పాటు ఫ్యాన్ పార్టీని నమ్ముకున్న చాలామంది నాయకులు ఇప్పుడు  కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి వారిలో పేరు చెప్తేనే ప్రజలందరికీ తెలిసే మాజీ మంత్రి విడదల రజిని ఒకరు. ఏపీలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన నేతలలో విడదల రజినీ కూడా ఒకరు.  తెలుగుదేశంతో మొదలైన విడదల రజని  రాజకీయ ప్రస్థానం వైసీపీలో ఉచ్ఛ స్థితికి చేరుకుంది. వాస్తవానికి ఆమెకు పార్టీలో అత్యధిక శాతం మంది వ్యతిరేకులే. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి,  సజ్జల రామకృష్ణారెడ్డి మినహాయిస్తే ఇతర కోటరీ ఎప్పుడు విడదల రజనికి సహకరించ లేదు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా అప్పటి ఎంపీ కృష్ణదేవరాయలతో విభేదాలు కొనసాగాయి అలాగే మర్రి రాజశేఖర్ తదితరులు కూడా ఆమెకు సొంత పార్టీలోనే సమస్యగా ఉండేవారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఫ్యాన్ పార్టీ హవా లో గెలిచిన ఆమె ఆ తర్వాత అనుకూలమైన పరిస్థితుల్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం పొందారు. మొదటి నుంచీ ఆమె వ్యవహార శైలి పార్టీలోని చాలా మందికి మింగుడు పడలేదు. ప్రధానంగా ఫ్యాన్ పార్టీలోని కొన్ని వర్గాలు ఆమెను చాలా సందర్భాల్లో ఒంటరి చేశారు. ఫ్యాన్ పార్టీ అధికారిక మీడియాలో కూడా అప్పటి మంత్రి రోజాకు ఇచ్చిన ప్రాధాన్యత విడదల రజినీకి ఇవ్వలేదన్న అసంతృప్తి ఆమెలో చాలా వరకు ఉంది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బదిలీలు, నియామకాల విషయాల్లో ఉన్నతాధికారులు ఆమెకు సహకరించ లేదు. ప్రతి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు దాట వేసిన సందర్భాలు ఎన్నో.  అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు తో పాటు డి ఏం ఈ స్థాయి అధికారులు కూడా ఆమె సిఫార్సులను చాలా సందర్భాల్లో అమలు చేయలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న దశలో ఆమె జరుగుతున్న పరిణామాలను అధినాయకుడు జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. అప్పటికే సమయం దాటిపోవడంతో టికెట్ల కేటాయింపులో జగన్మోహన్ రెడ్డి మూడో కన్ను సర్వేల్లో ఆమె చిలకలూరిపేటలో గెలవడానికి అవకాశాలు తక్కువని తేలింది. దీంతో ఆమెను విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారట. అప్పటికి విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ మరోసారి ఎంపీగా పోటీ చేయనని విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కసరత్తు ప్రారంభించారు విశాఖలో ఎంపీ స్థాయి అభ్యర్థి లేకపోవడం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆదరించే పరిస్థితి విశాఖలో ఉండడంతో..  జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎంపీ గా పోటీ చేసే అవకాశాన్ని విడదల రజనీకి ఇచ్చారు. కానీ తన భర్త_ మామ సంబంధించిన వ్యవహారాలన్నీ గుంటూరు జిల్లా చుట్టూ ఉన్నాయనీ,  అక్కడి నుంచే పోటీ చేస్తానని రజనీ చెప్పి, తనకున్న  బలంతో గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా ప్రకటన చేయించుకున్నారు. కానీ ఫ్యాన్ పార్టీ కూటమి గాలికి కొట్టుకు పోవడంతో విడదల రజిని కూడా గల్లంతయ్యారు. అదే సమయంలో ఆమె సొంత పార్టీ నాయకులతో పాటు,  కూటమి నాయకులు ఆమెపై    దృష్టి పెట్టారు  దీంతో ప్రస్తుతం ఏసీబీ కేసు కూడా ఆమె పై నమోదయింది నిజంగా ఆమె ఎన్నికలకు ఏడాది ముందే విశాఖ ఎంపీగా మకాం మార్చినట్లయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదని ఆమె అనుచరులు అంటున్నారు. విశాఖ నగరం చరిత్ర చూస్తే స్థానికేతరులే ఎమ్మెల్యే లు ఎంపీలు అయినా సందర్భాలు ఉన్నాయి. టి సుబ్బరామి రెడ్డి, నేదురుమల్లి  జనార్దన్ రెడ్డి,  పురందేశ్వరి ఇలా ఎందరో ఎంపీలు స్థానికేతరులే.  విశాఖ ఇన్చార్జ్ మంత్రిగా విడదల రజిని రెండేళ్లలో విశాఖ వాసులకు ఒకింత పరిచయం కూడా అయ్యారు.  జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య ఆరోగ్య శాఖకు కొంత ప్రాధాన్యత ఉండడం,  అందుకు తగ్గట్టు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి విక్టోరియా ఆసుపత్రి అంటువ్యాధుల ఆసుపత్రి ఇలా ఎన్నో వైద్య పరమైన అభివృద్ధి పనులు విడదల రజిని చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. చివరికి పాడేరు అరకు లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి పనులు ఆమె చేతుల మీదుగా, ఆమె హయాంలోనే జరిగాయి. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పరీక్షలకు కోట్లాది రూపాయలు ఆమె హయాంలోని మన్యానికి కేటాయించారు. పాడేరు మెడికల్ కాలేజ్ ను కూడా ఆమె ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ రకంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె ఏదో మేరకు ప్రజలకు దగ్గరయ్యారు. అందుకే గత ఎన్నికలలో  జగన్ సూచించినట్లు  ఆమె వైసీపీ అభ్యర్థిగా   విశాఖ ఎంపీగా పోటీ చేసినట్లయితే గెలవడం మాట ఎలా ఉన్నా గుంటూరు లాంటి స్థానిక విభేదాల నుంచి ఆమె గట్టెక్కే పరిస్థితి ఉండేదని ఆమె అనుచరులు అనుకుంటున్నారు. అందుకే అంటారు ఒక ఐడియా మాత్రమే కాదు ఓ నిర్ణయం కూడా జీవితాన్ని మార్చేస్తుందని.
విడదల రజిని వైజాగ్ కి వెళ్లి ఉంటే..? Publish Date: Apr 19, 2025 10:23PM

శ్రీ కాళహస్తిలో రోజా దిష్టిబొమ్మ దగ్ధం

తిరుపతిలో మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో శనివారం ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్. శ్రీకాళహస్తిలోని పెళ్లి మంటపం సెంటర్ లో ఆ నియోజకవర్గ ఇన్ చార్జ్ వినుత కోటా రోజా దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి, ఆ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రోజా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు.   రోజాకి నగిరి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారనీ, అయినా ఆమె మారలేదనీ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు మానుకోకుంటే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ చిల్లర మాటలు మాట్లేడేందుకు ఎంత ప్యాకేజీ తీసుకున్నావో చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు దిష్టిబొమ్మ దగ్ధంతో రుకుంటున్నామనీ, మరోసారి పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినా, నిరాధార ఆరోపణలు చేసినా ఆమె ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెబుతామని నినుత కోటా హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన వీరమహిళలు, జనసేన కార్యకర్తలూ పాల్గొన్నారు.  
శ్రీ కాళహస్తిలో రోజా దిష్టిబొమ్మ దగ్ధం Publish Date: Apr 19, 2025 10:09PM

కరవు ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కురవాలి.. చిరపుంజిలో రఘువీరా ప్రార్థన

అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చిరపుంజిలో ప్రకృతి సోయగాలకు మైమరిచిపోయారు. రాయలసీమలో పుట్టిన రుఘువీరా ఏడాది పొడవునా వర్షం కురిసే చిరపుంజిలో పర్యటన ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఏడాదిలో 365 రోజులూ వర్షం కురిసే చిరపుంజిని చూసి సంతోషంగా ఉందని తన అసోంపర్యటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. కరువు ప్రాంతాలన్నిటిలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని చిరపుంజి వేదికగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పిన రఘువీరా.. ఆ వీడియోలో తన పర్యటన విశేషాలను వివరించారు.  
కరవు ప్రాంతాలలో సమృద్ధిగా వర్షాలు కురవాలి.. చిరపుంజిలో రఘువీరా ప్రార్థన Publish Date: Apr 19, 2025 9:50PM

ప్రపంచ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్..ట్రెండింగ్‌లో #HBDBabu

  ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీమ్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఐటీని ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లాగే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు బర్త్‌డే ఈ సందర్భంగా ఆయనకు దేశవిదేశాల నుంచి నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 75వ ఏటలోకి ప్రవేశించారు. వయసు పైబడినా యువకులకి తీసిపోని ఆరోగ్యం ఆయనది. మండుటెండల్లో ఆయన ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగం పేరు చెబితే CBN అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్వీట్టర్‌లో ట్రెండ్ కొనసాగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్..ట్రెండింగ్‌లో #HBDBabu Publish Date: Apr 19, 2025 9:16PM

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రగడ...గులాబీ పార్టీ వైఖరింటో?

  రాష్ట్రంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వేడి రాజుకుంది. ఎన్నికల బరిలో ప్రధానంగా బీజేపీ, ఎంఐఎం ఉన్నాయి. ఈ ఎలక్షన్‌లో మజ్లిస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వనుట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌కు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కావడం కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు గులాబీ పార్టీ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్ జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీ విప్ ధిక్కరిస్తే వేటు తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ వద్దు ఎంఐఎం వద్దని ఇరు పార్టీలకు సమదూరం పాటించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈనెల 24వ తేదీన ఎమ్మెల్సీ ఓటింగ్‌కు అందరూ దూరంగా ఉండాలని పార్టీ నేతలకు కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎవరికీ ఓటు వేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.   బీజేపీకి గెలిచే అంతా బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ మద్దతిస్తాయనేది చూసిన తర్వాత కమలం పార్టీ ఓ నయా ప్లాన్ రూపొందించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. అంటే ,హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 113 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 113 ఓట్లలో 49 ఓట్లతో ఎంఐఎంకు, తిరుగులేని ఆధిక్యత వుంది. బీఆర్ఎస్‌కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్‌కు 14 ఓట్లు ఉన్నాయి.  ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి కాలం, త్వరలో ముగియనుండడంతో జరుగతున్న, ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి, మీర్జా రియాజ్ ఉల్ హసన్ గెలుపుకు ముందు గానే ఖారారైనట్లు తెలుస్తోంది.  క్రాస్ ఓటింగ్‌పై కాషాయ పార్టీ హోప్స్ పెట్టుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, అధైర్యంతోనే బీజేపీ సంఖ్యా బలం లేక పోయినా తమ అభ్యర్ధిని బరిలో దించిందని ఆరోపిస్తున్నారు.    
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రగడ...గులాబీ పార్టీ వైఖరింటో? Publish Date: Apr 19, 2025 8:01PM

లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిని 8 గంటలు విచారించిన సిట్

  ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్‌ అధికారుల విచారణ  ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్‌రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్‌  అధికారుల బృందం విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, మిథున్‌రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాజ్‌ కసిరెడ్డికి చెందిన ఆడాన్‌ డిస్టిలరీ, డికార్ట్‌ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం.  రాజ్‌ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్‌, అవినాష్‌రెడ్డిలతో మిథున్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ప్రశ్నించారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో మిథున్‌ రెడ్డిని సిట్‌  ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్‌ కసిరెడ్డి, అవినాష్‌ రెడ్డి, చాణక్యరాజ్‌లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, దానిపై ఆయన సంతకాన్ని తీసుకున్నారు
లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిని 8 గంటలు విచారించిన సిట్ Publish Date: Apr 19, 2025 6:56PM

బొత్స, గుడివాడ ఎత్తులు చిత్తు.. వైసీపీ పరువు గల్లంతు

విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అనుకున్నట్టే జరిగింది... విశాఖ కార్పొరేషన్ తెలుగుదేశం కూటమి వశం అయింది. మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ,  గుడివాడ అమర్నాథ్ ఎత్తులు చిత్తయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమాయకపు బీసీ మహిళ బలయ్యారు. సొంత పార్టీ కార్పొరేటర్లే ఎదురుగా తిరగడంతో ఆ పార్టీ పరువు మరోసారి గంగలో కలిసింది.  విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం శనివారం జరిగింది.  పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య గుర్తింపు అనంతరం కార్పొరేటర్ లను అనుమతించారు ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల పార్టీ బలాబలాలు మారాయి. నాలుగేళ్ల క్రితం మేయర్ పదవి దక్కించుకున్నప్పుడు వైసిపి బలం 58 కాగా ఇప్పుడు మారిపోయింది జనసేన బలం 11 కి చేరింది ఈ దశలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా కూటమి పార్టీలు మేయర్ పదవిని దక్కించుకుంటాయని ముందుగానే అందరూ అంచనాలు వేశారు. కానీ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రాజకీయ ఎత్తులు వేశారు.  ముందుగా శిబిర్యాలను ఏర్పాటు చేసి కార్పొరేటర్ లను శ్రీలంక తరలించారు. కానీ కరుడుగట్టిన వైసిపి కార్పొరేటర్లుగా పేరుందిన గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీ బెహరా భాస్కరరావు, అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక తదితరులు అవిశ్వాసానికి ముందే పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కూటమి చేతుల్లోకి విశాఖ కార్పొరేషన్ రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. కానీ విప్ జారీ చేయడం ద్వారా అవిశ్వాసానికి తమ కార్పొరేటర్లు దూరంగా ఉంటారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మరోవైపు విప్ పాటించినట్లయితే అనర్హత వేటు వేస్తామని మరో మంత్రి బొత్స సత్యనారాయణ బెదిరింపులు, హెచ్చరికలకు దిగారు.  అయితే వీరి హెచ్చరికలను భయపడే స్థాయి నుంచి వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు ఎప్పుడో ఎదిగిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదని పార్టీ పనులు అన్నీ కూడా ఓ కోటరీ చుట్టూ తిరిగాయనీ,  తిరుగుబాటు కార్పొరేటర్లు బహిరంగంగా ఆరోపణలు చేశారు.  ఈ దశలో అవిశ్వాస తీర్మా నానికి అనుకూలంగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది కూటమి. కూటమికి చెందిన 11 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు తో పాటు 63 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.  ఇందులో ప్రధానంగా తిప్పల వంశీ ముత్తం శెట్టి ప్రియాంక బెహరా తదితరులు ఉన్నారు. ఒకరకంగా కూటమి పరువును  వైసీపీ తిరుగుబాటు కార్పొరేటర్లు దక్కించినట్లు అయింది.  ఏడాది కాలంలో ఎప్పుడు కార్పొరేషన్ వైపు రాని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు కూడా కౌన్సిల్ కు హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా చెయ్యి ఎత్తారు.    అదలా ఉంటే.. నాలుగేళ్లపాటు మేయర్ గా కొనసాగిన గొలగాని హరి వెంకట కుమారి  అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు.  తొలి  నుంచీ సౌమ్యంగా ఉండే ఆమె పట్ల ఏ పార్టీకీ వ్యతిరేకత లేదు కానీ..  ఒక్కటయ్యారు.  దాదాపు మూడు నెలలుగా అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ పదవి పోతుందని ఊహాగానాలు వినిపించాయి.  ఆ దశలో గొలగాని హరి వెంకట కుమారి పదవికి రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేది.  కానీ వైసీపీ  నాయకులు కులం కార్డు కూడా వినియోగించారు.  బీసీ మహిళ అంటూ నినదించారు.  అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రధానంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్ కారణంగానే గోల గాని హరి వెంకట కుమారి ప్రతిష్టకు భంగం కలిగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ముందుగా ఆమె రాజీనామా చేసినట్లయితే ఆమెతో పాటు పార్టీకి గౌరవం దక్కి ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు.  ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు విశాఖ మేయర్ పదవిని బలి ఇచ్చారని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. . విశాఖ మేయర్ పదవిని చెప్పినట్లే తప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు  డిప్యూటీ మేయర్ లపై దృష్టి పెట్టారు.  అయితే ఇద్దరు డిప్యూటీ మేయర్లలో ముందుగా   శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో.. మరికొన్ని రోజుల్లోనే  ఆయన నాలుగేళ్ల పదవి కాలం ముగుస్తోంది. దీంతో  ఇప్పటికే  ఆ అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ కు కూటమి నాయకులు నోటీసు ఇచ్చారు.  ఈ దశలో డిప్యూటీ మేయర్ శ్రీధర్,  ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను  చక్రం తిప్పారని చాలా విమర్శలు ఉన్నాయి.  మేయర్ ను ఒక బొమ్మగా చూపించి దోచుకున్నారని.  అందుకే ఆ నాయకులను టార్గెట్ చేయాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే జియాని శ్రీధర్ ఆస్తుల వివరాలపై ఒక వీడియోను కూడా కూటమి నాయకులు విడుదల చేశారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన బాణాల శ్రీను, జియ్యాని శ్రీధర్, మోల్లి లక్ష్మి అప్పారావు, పారిశ్రామిక వాడకు చెందిన సురేష్ తదితరుల పై ఇప్పుడు కూటమి టార్గెట్ పెట్టింది.  త్వరలోనే డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  అదలా ఉంటే.. పెందుర్తి ప్రాంత కార్పొరేటర్ టిడిపి సీనియర్ నాయకుడు పీలా శ్రీనివాస్ ఇక విశాఖ నగర మేయర్ అయినట్టే.  కూటమి కార్పొరేటర్ల శిబిరాల ఏర్పాటు.. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్ల  ఫిరాయింపు వ్యవహారంలో అన్ని రకాల వ్యవహారాలను పీలా శ్రీనివాస్ తన భుజంపై వేసుకున్నారు.  కేవలం 10 నెలల కాలపరిమితి ఉన్న ఈ మేయర్ పీఠం కోసం ఎందుకని చాలామంది కూటమి నాయకులు వెనుకడుగు వేసినా..  పీలా కుటుంబం వైసీపీ హయాంలో తమకు జరిగిన నష్టాన్ని ఈ రకంగా తీర్చుకో వాలని నిర్ణయించారు.  పీల శ్రీనివాస్ సోదరుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే ఆస్తులను  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో   ధ్వంసం చేసిన ఘటనలను కూటమి నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  సీతంపేటలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ భవనాన్ని కూల్చివేయడం ఆనందపురం మండలం రామవరం వద్ద వారి కుటుంబానికి చెందిన భూములను తీసుకోవడానికి వైసిపి హయాంలో జరిగిన వ్యవహారాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ దశలో త్వరలో జరిగే సమావేశం ద్వారా కూటమి నాయకులు పీలా శ్రీనివాస్ ను మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు దాదాపు ఖరారు అయినట్టే.  అయితే విశాఖలో వైసీపీ పరువు పోవడానికి బోత్స, గుడివాడల అనవసర రాజకీయాలే కారణమని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు తమతమ పదవులకు రాజీనామా చేశారు.  ఇక్కడ కూడా అదే రకంగా గొలగాని హరి వెంకట కుమారి రాజీనామా చేసినట్లయితే పార్టీ పరువు నిలిచి ఉండేది.  కానీ బొత్స గుడివాడ అనాలోచిత నిర్ణయాల వలన పార్టీ పరువు బజారు పాలు అయిందని వైపీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.  
బొత్స, గుడివాడ ఎత్తులు చిత్తు.. వైసీపీ పరువు గల్లంతు Publish Date: Apr 19, 2025 6:00PM

హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆఫీసును కూల్చేశారు : ఎమ్మెల్యే వసంత

  హైదరాబాద్ హఫీజ్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన ఆఫీసును పోలీసులు భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేసింది.  హఫీజ్‌పేట్​లోని సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ షెడ్ ఏర్పాటు చేసి నూతన కార్యాలయం చేపట్టడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు శనివారం రోజున కూల్చివేతలు చేపట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణ మాట్లాడుతు మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని అన్నారు. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామని ఆయన పేర్కొన్నారు.  ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని తెలిపారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు కార్యాలయం కూల్చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్సమంత్రి రేవంత్ రెడ్డి  విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని సంత కృష్ణ అన్నారు.. ముఖ్యమంత్రి  తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందని చెప్పారు. హైడ్రా కరెక్ట్ అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు జరుపుతోంది ? అంటూ ఆగ్రహించారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా హైడ్రా ప్రవర్తించిందని ఎమ్మెల్యే తెలిపారు. 
హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆఫీసును కూల్చేశారు : ఎమ్మెల్యే వసంత Publish Date: Apr 19, 2025 5:33PM

గాంధీలు జైలుకు వెడతారా?

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 
గాంధీలు జైలుకు వెడతారా? Publish Date: Apr 19, 2025 5:02PM

సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి ఆనం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.  నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.  దేశ ఔన్నత్యాన్ని చాటుతూ చంద్రబాబు కోసం పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమం చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్​లో ఒకటవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.  
సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి ఆనం Publish Date: Apr 19, 2025 4:20PM

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల ఆర‌బోత‌

ఇంత‌కీ ఏంటీ పోచంప‌ల్లి ఇక్క‌త్ చీర ప్ర‌త్యేక‌త‌? అన‌సూయ‌ది కూడా పోచంప‌ల్లి అంద‌మేనా!  మే 7 నుంచి మే 31 వ‌ర‌కూ హైద‌రాబాద్ లో జ‌రిగే మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల‌ను ప్ర‌ద‌ర్శించేలా ఒక ఏర్పాటు చేయ‌నుంది రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ. ఈ పోటీల సంద‌ర్భంగా ఇక్క‌డికి 140 దేశాల‌కు సంబంధించిన వారు రానున్నారు.  వీరిని మే 15న పోచంప‌ల్లికి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు.  అంతే కాదు వీరి చేత పోచంప‌ల్లి వ‌స్త్రాల‌ను ధ‌రింప చేసి.. ప్ర‌మోట్ చేయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం పోచంప‌ల్లి చేనేత క‌ళాకారుల చేత ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయించ‌నుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. స్థానిక చేనేత క‌ళ‌ల‌పై అతిథుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం మాత్ర‌మే కాక‌.. ఆయా వ‌స్త్రాల  ప్ర‌త్యేక‌త‌ల‌ను తెలియ చేయ‌నున్నారు.  క‌ళాకారుల‌తో అతిథులు మాట్లాడ్డానికి గానూ.. ట్రాన్స్ లేట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చేనేత కళ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, పట్టుదలతో ఉందో  ఊహించుకోవ‌చ్చు. అలాగే, గద్వాల్‌ సిల్క్‌, సిద్దిపేట దగ్గరలోని గొల్లభామ కాటన్‌, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను కూడా పోచంపల్లిలో ఏర్పాటు చేయ‌నున్నారు.  పోచంపల్లి పర్యటనకు వచ్చిన వారంతా ఈ స్టాల్స్‌ను కూడా సందర్శిస్తారు. ఆయా స్టాల్స్‌లో ప్రదర్శించే వస్త్రాల విశేషాలు కూడా విదేశీయులకు అర్థమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ ప ర్యటన మొత్తం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనుండగా..  విదేశీ అతిథుల కోసం పోచంపల్లిలో తెలంగాణ జానపద కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.దీంతో ఎక్క‌డిదీ పోచంప‌ల్లి అన్న చ‌ర్చ మొద‌లైంది. ఇది  తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రాంతం. పోచంప‌ల్లి చేనేత క‌ళాకారులు నిలువు పేక‌ల మ‌గ్గంపై నేసిన చేనేత క‌ళాఖండాల‌కు ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ఉంది. హైద‌రాబాద్ కి 35కిలోమీట‌ర్ల దూరంలో ఉండే పోచంప‌ల్లి.. ఇటు చేనేత‌, అటు భూదానోద్య‌మానికి ప్ర‌సిద్ధి చెందిన‌ది. ఇక్క‌డ చేనేత చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే  స్త్రీ మూర్తులంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ఈ చీర‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా  ఉన్న  ఆయా ప్రాంతాల మేని ఛాయ‌ల‌న్నిటికీ న‌ప్పి.. ఆయా స్త్రీమూర్తుల‌లోని మ‌హిళా శ‌క్తిని  మ‌రింత ప్ర‌జ్వ‌రిల్లేలా చేస్తాయి. అందుకే పోచంప‌ల్లి చీర కేవ‌లం మ‌హిళ ఒంటిని మాత్ర‌మే కాదు ఈ భూగోళం మొత్తం  చుట్టేసిన ఖ్యాతి సంపాదించిందని అంటారు.  అలాంటి పోచంప‌ల్లిలో తొలుత నూలు చీర‌లు మాత్ర‌మే నేసేవారు. డెబ్భైల నుంచీ ప‌ట్టు చీర‌ల త‌యారీ మొద‌లైంది. ఇద్ద‌రు యువ‌కుల‌ను బెంగ‌ళూరుకు పంపి ప‌ట్టు నేతలో మెల‌కువ‌లు తెలుసుకోమ‌న్నారు. ఇది పోచంప‌ల్లి చేతి మ‌గ్గాల ద‌శ- దిశ మార్చేలా చేసింది. ఈ చీర‌లు ఎంతో మోడ్ర‌న్ గా ఉంటాయి. ఈ చీర‌ల త‌యారీ ఇక్క‌త్ మీద ఆధార‌ప‌డుతుంది. ఈ ప‌నిత‌నం చీరాల నుంచి ఈ ప్రాంతానికి వ‌చ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అది ప‌ట్టు మీద కూడా చేయ‌డం మొద‌లెట్టారు. గుజ‌రాత్, ఒడిశాలాగా ఇక్క‌త్ నేత‌కు తెలంగాణ‌లోని పోచంప‌ల్లి ఎంతో ఫేమ‌స్ అయ్యింది. 1953 లో తొలిసారిగా పోచంపల్లిలో ఇక్కత్ కళ మొదలైంది. కర్నాటి అనంతరాములు అనే పెద్దాయన గుజరాత్ లోని బెనారస్ వెళ్లి.. అక్క‌డ‌ శిక్షణ తీసుకుని సిల్క్ తో ఇక్కత్ కళను వెలుగులోకి తెచ్చారు. ఇక్కత్ కళకు 2003 లో భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు లభించాయి.  ఇక్కడ ఉత్పత్తయ్యే చేనేత చీరలు 2 వేల రూపాయల నుంచి యాభై, అరవై వేల రూపాయల వరకు ధర పలుకుతాయంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన‌ ప్రముఖ సినీతారలు, అనేక మంది రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి వ‌చ్చిన‌ మహిళలు.. పోచంపల్లి చేనేత కార్మికులు తయారుచేసిన చీరలపై ఎక్కువ‌గా మక్కువ చూపుతుంటారు.   తెలంగాణ గాంధీగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీ చొరవతో చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో పోచంపల్లి చేనేత పరిశ్రమ కేవలం పోచంపల్లికి మాత్ర‌మే పరిమితం కాకుండా జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, సిరిపురం, ఎల్లంకి, రామన్నపేట, నాగారం, బోగారం గ్రామాలకు విస్తరించింది. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఎంద‌రో కార్మికులకు పోచంపల్లి డిజైన్ చీరలు ఉపాధి కల్పిస్తున్నాయి.  ఇక్కడి చేనేత టైఅండ్ డై అసోసియేషన్, చేనేత సహకార సంఘం ఎంతో కృషి చేసి 30 రకాల డిజైన్లకు పేటెంట్ హక్కు కల్పించాలని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ కి పలుమార్లు విన్నవించింది. కానీ, కేవలం 11 రకాల డిజైన్లనే పేటెంట్ హక్కును కల్పించేందుకుగాను 1999లో గుర్తించింది. 2000లో పేటెంట్ హక్కును కల్పించారు. దేశచరిత్రలో కార్మికుడు సాధించిన ఘన విజయంగా దీనిని అభివ‌ర్ణిస్తారు. పోచంపల్లి చీరకు 2005లో భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ కి ర‌క్ష‌ణ‌ లభించింది. పోచంపల్లి లో తయారైన ఇక్కాత్ శైలి పోచంపల్లి చేనేత సహకార సంస్థ లిమిటెడ్, పోచంపల్లి హాండ్లూం టై అండ్ డై సిల్క్ సారీస్ తయారీ అసోసియేషన్ రిజిస్టర్డ్ ప్రోపర్టీగా గుర్తింప బడింది. అయితే పోచంప‌ల్లి ఇక్క‌త్ కి న‌కిలీలు రావ‌డం మొద‌లైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి పోరాడుతూ.. పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తారు. అంతే కాదు, వాణిజ్య మంత్రికి ఈ దిశ‌గా ఒక లేఖ సైతం రాశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోచంపల్లి ఇక్కత్‌ చీరల నకిలీలను అరికట్టి.. చేనేత రక్షణ కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీ చామల త‌న లేఖ‌లో కోరారు. ఇక పోచంప‌ల్లి మ‌రో అందాల ఆర‌బోత‌ విష‌యానికి వ‌స్తే జబ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ కూడా పోచంప‌ల్లికి చెందిన అంద‌మే. అయితే పోచంప‌ల్లి చీర నూలుతో చేసిన అంద‌మైతే.. అదే అన‌సూయ న‌వ్వుల‌తో త‌యారైన అందం. ఆమె యాంక‌రింగ్ చేసిన‌ జ‌బ‌ర్ద‌స్త్ లో వ‌చ్చే స్కిట్ల‌లో అక్క‌డ కామెడీ ఉన్నా లేక పోయినా త‌ను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతూ ఆ ముత్యాల‌ను ప్రేక్ష‌కుల చేత‌ ఏరుకునేలా చేసిన న‌వ్వుల అందం అన‌సూయ‌. ఈమెది కూడా ఈ పోచంప‌ల్లే. వీరికి ఈ ఊరిలో వంద గ‌డ‌ప‌ల ఇల్లు ఒక‌టి ఉంద‌ని స‌మాచారం. ఇది అతి పురాత‌న‌మైన ఇల్లుగా చెబుతారు. ఇదండీ పోచంప‌ల్లి వెన‌క దాగిన అనేక విశేషాల స‌మాచార స‌మాహారం.. చూశారుగా మ‌న చెంత‌నే ఉన్న పోచంప‌ల్లికి ఎక్క‌డో విదేశీయులు వ‌స్తున్నార‌ని తెలిసి.. ఆరా తీస్తే ఇన్నేసి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి గ‌మ‌నించారా!!!
మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో చేనేత అందాల ఆర‌బోత‌ Publish Date: Apr 19, 2025 4:04PM