జగన్ సర్కార్ పై ఉద్యోగుల జంగ్ సైరన్.. సీఎస్ కు జేఏసీ నోటీస్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు... మధ్యాహ్నం 12:15 గంటలకు సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇవ్వనున్నాయి. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను ఇవ్వనున్నారు. 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌పై ఐక్య వేదిక నోటీస్ ఇవ్వనుంది. డిసెంబర్ 7 నుండి ఉద్యమ కార్యాచరణను అమలులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై జేఏసీ నేతలు ఒత్తిడి చేయనున్నారు.