సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే!

 


సర్వేల స్పెషలిస్టు లేటెస్ట్ సర్వే!

టీడీపీ-బీజేపీ కూటమికి ఆధిక్యం

 

ఎన్నికల సర్వేలు చేయించడంలో స్పెషలిస్టు అయిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు తాజాగా మరో రహస్య సర్వే జరిపించారు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న పాయింట్ మీద జరిపించిన ఈ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాలలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఏ నలుగురు రాజకీయ నాయకులు ఒక్కచోట చేరినా ఈ సర్వే ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు.

 

సదరు నాయకుడు జరిపించిన సర్వే ఫలితాల ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ-బీజేపీ కూటమి 93 ఎమ్మెల్యే స్థానాలు, 14 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ 71  ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్ర విభజన విషయంలో అత్యుత్సాహం చూపించిన కాంగ్రెస్ పార్టీ 9 ఎమ్మెల్యే స్థానాలు, ఒక్క ఎంపీ స్థానంతో సరిపెట్టుకోక తప్పదని సదరు సర్వే స్పష్టం చేసింది.



ఇక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎం.ఐ.ఎం. ఈ మూడు పార్టీలకు కలిపి 71 ఎమ్మెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే చెబుతోంది. టీడీపీ-బీజేపీ కూటమికి 46 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎంపీ స్థానాలు వస్తాయని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. వైఎస్సార్సీపీకి తెలంగాణలో అకౌంట్ ఓపెన్ అయ్యే అవకాశం లేదని ఆ సర్వే స్పష్టం చేసింది.