రియల్ లీడర్ వర్సెస్ డమ్మీ లీడర్

రాజ‌కీయాల్లో త‌రాలు మారుతున్నాయి.. ఒక్కొ త‌రానికి కొంద‌రు నేత‌లు ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొట్టూ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోతూ వ‌చ్చారు. అదేస‌మ‌యంలో యువ‌త‌కు టార్చ్ బేరర్ గానూ మారుతూ కొత్త రాజ‌కీయాల‌కు పునాదులు వేశారు. ఈ కోవ‌లో ప్ర‌ముఖంగా గుర్తుకొచ్చే పేర్లు ఎన్డీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు. ఎన్డీఆర్ హ‌యాంలో బీసీ, ఎస్సీ వ‌ర్గాల ప్ర‌జ‌లు రాజ‌కీయాల్లో రాణించారు. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలంటే ఆమ‌డ‌దూరం ఉండే ఆ వ‌ర్గాల ప్ర‌జ‌లు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో గ్రామ‌ స్థాయి నుంచి రాష్ట్ర‌ స్థాయి, జాతీయ స్థాయిలో రాజ‌కీయాల్లో కీల‌క భూమిక పోషించ‌డం ప్రారంభమైంది. అదే ఒర‌వ‌డిని చంద్ర‌బాబు నాయుడుకూడా కొన‌సాగించారు. అంతేకాదు.. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఎలా రాజ‌కీయాలు చేయాలో చంద్ర‌బాబు నేర్పించారు. ఫ్యాక్ష‌న్ ప‌ల్లెల్లోనూ అభివృద్ధికి బాట‌లువేసి శాంతిని నెల‌కొల్పారు. ఐటీ రంగాన్ని అభివృద్ధిచేసి తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త‌ ఇత‌ర దేశాల్లో ఐటీ రంగంలో అగ్ర‌గామిగా నిలిచేలా చేశారు. చంద్ర‌బాబు చూపిన మార్గంలో ప‌య‌ణించిన యువ‌త నేడు ఉన్న‌త స్థాయిల్లో ఉన్నారు. అయితే, గ‌డిచిన ఐదేళ్లు అధికారంలో కొన‌సాగిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం రాజ‌కీయాల అంటే కొట్టుకోవ‌టం, బూతులు తిట్ట‌డం అన్న‌ట్లుగా మార్చేశారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న వ‌ల్ల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో  అభివృద్ధి ఆనవాలే లేకుండా చేశారు.  ఉన్న పరిశ్రమలను తరిమేసి.. ఏపీ అంటేనే పెట్టుబడి దారులు భయపడేలా చేశారు. అక్కడితో ఆగలేదు అక్ర‌మ కేసులుపెట్టి చంద్ర‌బాబుస‌హా అనేక మంది ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను జైళ్లకు పంపించారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయించారు. జైళ్ల‌లో పెట్టించారు. ఒక‌ప‌క్క ఎన్టీఆర్ హ‌యాంనుంచి ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు క్ర‌మంగా త‌గ్గుకుంటూ వ‌స్తున్న వేళ‌.. ఫ్యాక్ష‌న్ మూలాలు క‌లిగిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో మ‌ళ్లీ రాష్ట్రంలో హ‌త్య‌లు, గొడ‌వల‌కు కార‌ణం అయ్యాడు. దీంతో ప్ర‌జ‌లు విసిగిపోయి గ‌త ఎన్నిక‌ల్లో ఓటుద్వారా వైసీపీకి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. అయినా, జ‌గ‌న్‌లో మార్పు రావ‌డం లేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఏపీ అన్ని రంగాల్లో అబివృద్ధి ప‌థంలో దూసుకెడుతోంది.  ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు. అయితే, రాష్ట్ర ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే  చూడ‌లేను అన్న‌ట్లుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌శాంతంగా ఉన్న రాష్ట్రంలో మ‌ళ్లీ అల్ల‌ర్లు చెల‌రేగేలా కుట్ర‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల తీరుప‌ట్ల మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వీళ్ల‌కు 11 సీట్లు ఇచ్చి త‌ప్పుచేశాం అంటూ బాధ‌ప‌డుతున్నారు. ఒక్కటి కూడా ఇవ్వకుండా ఉండాల్సిందని భావిస్తున్నారు.  కిడ్నాప్ కేసులో వైసీపీ నేత‌, గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించ‌డంతో విజ‌య‌వాడ‌లోని జిల్లా స‌బ్ జైలుకు త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ స‌బ్‌జైలుకు వెళ్లిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్ల‌భ‌నేని వంశీతో ములాఖ‌త్ అయ్యాడు. అయితే, జైలు వ‌ద్ద సినిమా త‌ర‌హాలో ఓ సీన్ జ‌రిగింది. జ‌గ‌న్‌ను చూసేందుకు వ‌చ్చిన ఓ చిన్నారి కేక‌లు వేస్తూ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. దీంతో జ‌గ‌న్ ఆ అమ్మాయిని రా.. రా.. అంటూ ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. ఇదంతా ప్ర‌జ‌ల‌కు చూడ‌టానికి ఎమోష‌న‌ల్ సీన్‌లా అనిపించొచ్చు. ఎమోష‌న‌ల్ సీన్ల‌ను పండించి ప్ర‌జ‌ల సానుభూతిని పొంద‌డంలో జ‌గ‌న్ దిట్ట అని ఏపీలో ఏ చిన్న‌పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అంత‌లా కోడికత్తి, బాబాయ్ హ‌త్య‌, గుల‌క రాయిల‌తో జ‌గ‌న్ ఫేమ‌స్ అయ్యారు. అయితే, ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. వంద‌ల మంది జ‌నం జ‌గ‌న్ కాన్వాయ్ చుట్టూ గుమ్మికూడారు. ఓ వ్య‌క్తి చిన్న‌పాప‌ను తీసుకొని స‌రిగ్గా జ‌గ‌న్ వాహ‌నం ముందుకే రావ‌డం.. ఆ చిన్నారి కూడా కేక‌లు వేస్తూ, ఏడ్చుకుంటూ జ‌గ‌న్ జ‌గ‌న్ అంటూ అర‌వ‌టం.. ఆ వెంట‌నే జ‌గ‌న్ ఆ అమ్మాయిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దుపెట్టడాన్ని చూసిన ప్ర‌జలు ఇదంతా వైసీపీ నాయ‌క‌త్వం ముందుగానే క్రియేట్ చేసిన డ్రామా అంటూ ఈజీగా చెప్పేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదేక్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి.. మంత్రి నారా లోకేశ్ కు తేడాఇదే అంటూ ప‌లు  వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  మంత్రి నారా లోకేశ్ తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్ర‌బాబు రాజ‌కీయ ల‌క్ష‌ణాల‌ను పుణికిపుచ్చుకొని క్ర‌మ శిక్ష‌ణ క‌లిగిన రాజ‌కీయాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈ తరానికి నారా లోకేష్ టార్చ్ బేరర్ గా కనిపిస్తున్నారు. లోకేశ్ పాల్గొన్న స‌భ‌లో అత‌నికి ద‌గ్గ‌రిగా ప‌దిహేనేళ్ల‌లోపు పిల్ల‌లు పార్టీ కండువా వేసుకొని, పార్టీ గుర్తుతో ఉన్న చొక్కా వేసుకొని క‌నిపిస్తే వాటిని వెంట‌నే తీయించి వేయిస్తారు. అవ‌స‌ర‌మైతే, వారి వ‌ద్ద‌కు వెళ్లి తానే స్వ‌యంగా తీసేస్తాడు. ఎందుకంటే.. చిన్న‌పిల్ల‌లు చ‌దువు, ఆట‌ల మీద‌నే   దృష్టిని కేంద్రీక‌రించాలి. లోకేష్ ప్రజాగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఓ చిన్నారి తెలుగుదేశం జెండా పట్టుకుని, తెలుగుదేశం నేతల బొమ్మలున్న పసుపుపచ్చ చొక్కా ధరించి లోకేష్ దృష్టిలో పడ్డాడు. వెంటనే లోకేష్ ఆ పిల్లవాడి చేతిలోని తెలుగుదేశం జెండాను తీసేశారు. ఆ చిన్నారి ధరించిన తెలుగుదేశం గుర్తులున్న షర్టునూ విప్పేశారు. బుద్ధిగా చదువుకో, పెద్ద అయిన తరువాత రాజకీయాలలోకి వద్దువుగానీ అంటూ బుజ్జగించి, హితవు చెప్పారు. చిన్న‌త‌నంలోనే పిల్లలపై రాజ‌కీయాల‌ను ర‌ద్దొద్ద‌న్నది లోకేశ్ ఆలోచ‌న‌. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం చిన్న పిల్ల‌లైనా, పెద్ద‌వారైనా ఫ్యాక్ష‌న్ త‌ర‌హా రాజ‌కీయాలు, ఓవ‌రాక్ష‌న్ రాజ‌కీయాలు చేస్తే చాలు.. ప్రోత్స‌హిస్తుంటారు. చ‌దువు లేకుండా యువ‌త ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో మ‌గ్గిపోవాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. దీంతో సోష‌ల్ మీడియాలో లోకేశ్ కు సంబంధించిన వీడియోల‌ను పోస్టుచేసి  లోకేశ్‌ను చూసి రాజ‌కీయాలు ఎలా చేయాలో నేర్చుకో జ‌గ‌న్ అంటూ నెటిజ‌న్లు సూచిస్తున్నారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు.. ఇప్పుడు నారా లోకేశ్ చిన్నారులు, యువ‌త‌కు టార్చ్ బేర‌ర్‌గా మారుతున్నాడని ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.
Publish Date: Feb 19, 2025 7:34PM

జగన్ వ్యాఖ్యలతో  పోలీసు అధికారుల్లో నైరాశ్యం 

విజయవాడ్ సబ్ జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని పరామర్శించడానికి వచ్చిన వైకాపా అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు చర్చనీయాంశమయ్యాయి. ఐదేళ్ల పాలనలో జగన్ అధికార దుర్వినియోగం చేసిన తీరు ప్రతీ పోలీసు అధికారికి తెలుసు.  వైసీపీ  ఎంపిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణ రాజును పోలీస్ టార్చర్ పెట్టిన ఘటన బహుషా ఎవరూ మర్చిపోరు. తాము అధికారంలో రాగానే అన్యాయం చేసిన పోలీసు అధికారుల బట్టలూడదీస్తామని జగన్ వ్యాఖ్యలు చేశారు. పోలీసుటోపిపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయాలని వైకాపా నేత హెచ్చరించారు. చట్టాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన  కేసులో వంశీని అరెస్ట్ చేశారు. పరామర్శకు వచ్చిన జగన్ పరామర్శించి వెళ్లిపోయి ఉంటే ఇంత రచ్చ జరిగేదికాదు. పోలీసులను పరుష పదజాలంతో దూషించినప్పటికీ జగన్ పై  కేసు నమోదు కాకపోవడం పోలీసుల ఆత్మస్తైర్యం దెబ్బతీసింది. జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం తప్పు పట్టింది.  అధికారం కోల్పోయిన జగన్ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించడం తప్పుడు సంకేతాలు వెళ్తాయని సర్వత్రా వ్యక్తమైంది. ఎన్నికల కోడ్ ఉండగానే  గుంటూరు మిర్చియార్డు కు  జగన్ వచ్చినప్పుడు కూడా  ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరించారు. ఈ అలుసే కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. జగన్ పర్యటకు జిల్లా పోలీసులు నిరాకరించారు. అయినా జగన్ మిర్చియార్డకు వచ్చి నానా హంగామా చేశాడు.  ఎన్నికల అధికారి  ప్రేక్షకపాత్ర వహించడం టిడిపి శ్రేణుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వైకాపా హాయంలో అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే సాహసం పోలీసు అధికారులు తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మెతకవైఖరి వీడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు  కూడా చం ద్రబాబు మెతక వైఖరి ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అవలంబిస్తే  తప్పుడు సంకేతాలు అధికారులకు వెళ్లే ప్రమాదం ఉంది.  
Publish Date: Feb 19, 2025 5:11PM

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా.. కారణమేంటంటే?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన మేరకు గురువారం (ఫిబ్రవరి 20)న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు జరగాల్సిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అయితే అనూహ్యంగా కేబినెట్ భేటీ వాయిదా పడటంతో ఇందుకు కారణమేంటా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఈ భేటీకి అధ్యక్షత వహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన కారణంగా కేబినెట్ భేటీ వాయిదా పడింది. గురువారం (ఫిబ్రవరి 20) న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. దీంతో అనివార్యంగా ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది.  
Publish Date: Feb 19, 2025 2:32PM

బీఆర్ఎస్ లో నూతనోత్సాహం.. ఎందుకంటే?

బీఆర్ఎస్ శ్రేణులలో చాలా రోజుల తరువాత కొత్త ఉత్తేజం, ఉత్సాహం కనిపించింది. ఇందుకు కారణం సుదీర్ఘ కాలం ఫామ్ హౌస్ కే పరమితమైన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ కార్యాలయం తెలంగణ భవన్ కు రావడమే. బుధవారం (ఫిబ్రవరి 19)మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో  బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండటానికి కారణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు తదితర అంశాలపై ఆయన క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ భవన్ కు చేరుకోగానే స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. సీఎం, సీఎం అని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్ వారిని మందలించారు. ఒర్లకండిరా బాబూ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధ్యక్షతన  జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు,  ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు హాజరయ్యారు.  
Publish Date: Feb 19, 2025 2:21PM

ఎన్నికల కోడ్ కు అంబటి కొత్త భాష్యం.. అజ్ణానమా? అతి తెలివా?

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తన అమోఖమైన వాదనా పటిమతో జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను సమర్ధించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్నికల నియమావళికి సైతం కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేసే పార్టీలూ, అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని సెలవిచ్చారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఎన్నికలలో పోటీలో లేని వైసీపీకి ఆ కోడ్ వర్తించదని అంబటి రాంబాబు వాదిస్తున్నారు.  వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కృష్ణా గుంటూరు గ్రడ్యుయూట్ కాన్సిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది.  ఆ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు అనుమతి నిరాకరించింది. అయినా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వేలాది మందితో ప్రదర్శనగా మిర్చియార్డ్ కు వెళ్లి హల్ చల్ చేశారు. రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేశారు. అలా నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరులో పర్యటించడానికి ఎన్నికల కోడ్ కు సంబంధం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఎక్కడైనా సరే ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకే వర్తిస్తుందనీ, పోటీకి దూరంగా ఉన్న పార్టీలకు కాదనీ భాష్యం చెప్పి తన అజ్ణానాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీ పోటీలో లేదు కనుక ఆ పార్టీకీ, ఆ పార్టీ వ్యక్తులకు అది వర్తించకుండా మినహాయింపు లేదు. సభలూ, సమావేశాలు నిర్వహించకూడదు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదు. ఈ విషయం కూడా తెలియకుండానే అంబటి రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.   
Publish Date: Feb 19, 2025 1:45PM

చట్టాలపై జగన్ కు ఖాతరీ లేదు.. ఇదిగో మరో రుజువు!

చట్టాల పట్లా, నిబంధనల పట్లా, రాజ్యాంగం పట్ల  తనకు ఖాతరీ లేదని జగన్ మరోసారి రుజువుచేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గుంటూరులో మిర్చియార్డు పర్యటనకు జగన్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. పోలీసు శాఖ కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. అయినా జగన్ లెక్క చేయలేదు. వేలాది మందిని వెంటేసుకుని మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. వాస్తవానికి అనుమతి లేదు అని చెప్పిన పోలీసులు జగన్ భారీ ప్రదర్శనగా మిర్చియార్డుకు వెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు. అనుమతి లేని ప్రదర్శన చేసినందుకు ఎన్నికల సంఘం ఎలాగా కేసు పెడుతుంది అప్పుడు చూసుకుందాం అని వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఎంత నేరమో తెలియదనుకోలేం.    అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చియార్డులో మిర్చి రైతుల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు.  అదే సమయంలో రైతుల కష్టాలను గాలికొదిలేసి.. చంద్రబాబు తన దృష్టినంతా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలపైనే కేంద్రీకరించారని విమర్శించారు.  దీంతో ఇప్పడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతి రైతులను ఎంత క్షోభపెట్టారో గుర్తు చేస్తూ నెటిజనులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై అప్పట్లో అడుగడుగునా దాడులు చేయించిన వైనాన్ని ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముందు వాటికి బదులిచ్చి ఆ తరువాత మిర్చిరైతుల గురించి మాట్లాడమని నిలదీస్తున్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఒిక రాజకీయ పార్టీ అధినేతగా జగన్ పోరాడడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అందుకోసం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడాన్నీ, చట్టాలను ధిక్కరించడాన్ని ఎవరూ సమర్ధించరు. అలా చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం మిన్నకుండటం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   
Publish Date: Feb 19, 2025 1:12PM