భార్య చావుకి, భర్త ప్లాన్.. చివరికి.. 

ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య వివాదాల కేసులు చాలానే తలెత్తుతున్నాయి. అటు పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో కావచ్చు, ఇటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి విషయంలో గొడవలు సహజంగా జరుగుతున్నాయి. ఏ కుటుంబంలో అయిన గొడవలు జరగడం సహజమే కానీ ఆ గొడవలు చావుల వరకు వెళ్తున్నాయి. ఇంకొందరు మాత్రం గదులలో బందించి మరి హింసిస్తున్నారు. అయితే సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది. మీరే చూడండి అసలు ఏం జరిగిందో. వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా నాలుగు ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. కారణాలు తెలియలేదుగానీ మనసుకు నచ్చి  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపాలని ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 

నెల్లూరు జిల్లాకు చెందిన ఆశ అనే మహిళ కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేసేది. అక్కడ సీతానగరం మండలంలోని పెదకొండేపూడికి చెందిన కర్రి అభిరామ్‌ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే బంధించి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. కొంతకాలం అభిరామ్ ఆమెను దూరం పెట్టడంతో ఇటీవల పెదకొండేపూడిలోని అత్తమామల ఇంటిముందు కొడుకుతో కలిసి నిరసన దీక్ష చేపట్టింది. పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పి వారి  మధ్య రాజీ కుదర్చడంతో ఆశ అత్తింట్లోనే ఉంటోంది. అయితే ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేని అభిరామ్ కొద్దిరోజులుగా భార్యను ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. పధకం వేశాడు ఆ పధకాన్ని అమలు పడ్డామని దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు అతనికి సహకరించారు. వారి నుంచి తప్పించుకున్న ఆశ సీతానగర పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త అభిరామ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వెలుగుచూసింది. మోసాల మనుషులు మోసపు రోజులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో అర్థం కానీ రోజులు ఇవి.. ప్రేమ పేరుతో కలవడం ఆ తర్వాత విడిపోవడం.. పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు ఏం అవుతుందని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.