కొవిడ్ కేసుల విజృంభ‌న‌.. 55 రైళ్లు ర‌ద్దు..

కొవిడ్ కేసులు బీభ‌త్సంగా పెరుగుతున్నాయి. క‌ట్ట‌డి అదుపు త‌ప్పింది. విచ్చ‌ల‌విడి కేసుల‌తో క‌ల్లోలం మొద‌లైంది. బ‌స్సు, రైళ్ల ప్ర‌యాణంతో క‌రోనా ముప్పు మ‌రింత వ్యాపించే ప్ర‌మాదం ఉంది. అందుకే, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అల‌ర్ట్ అయింది. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. ఈ నెల 21 నుంచి 24వరకు.. 4 రోజుల పాటు 55 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. ఆ మేర‌కు ర‌ద్దైన రైళ్ల జాబితా రిలీజ్ చేసింది.