Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పశ్చిమ గోదావరిలో అన్ని స్థానాలూ టీడీపీవే
posted on: May 12, 2014 12:41PM
.jpg)
మునిసిపల్ ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మునిసిపల్ స్థానాలను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపల్ స్థానాలున్నాయి. భీమవరంలో 39 కౌన్సిలర్ స్థానాలున్నాయి. వీటిలో 19 తెలుగుదేశం, 5 వైకాపా గెలిచాయి. ఒకస్థానంలో ఇతరులు గెలుపొందారు. పాలకొల్లులోని 31 స్థానాల్లో 24 స్థానాల్లో తెలుగుదేశం 6 స్థానాల్లో వైకాపా గెలవగా, ఇతరులు ఒక్క స్థానంలో గెలిచారు. తాడేపల్లిగూడెంలోని 35 స్థానాల్లో 24 స్థానాలు తెలుగుదేశం గెలుచుకోగా, ఏడు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. మూడు స్థానాల్లో ఇతరులు గెలిచారు. నర్సాపురంలోని 31 స్థానాల్లో 10 తెలుగుదేశం, ఏడు వైకాపా, మూడు ఇతరులు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం ఆధిక్యంలోకి వచ్చే అవకాశం వుంది. నిడదవోలులోని 28 వార్డుల్లో 17 తెలుగుదేశం, 10 వైకాపా గెలవగా ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. తణుకులోని 34 స్థానాల్లో 31 తెలుగుదేశం గెలుచుకుంది. ఒక స్థానాన్ని వామపక్షాలు, రెండు స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు. కొవ్వూరులోని 23 స్థానాల్లో 13 స్థానాలు తెలుగుదేశం గెలిచింది. ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. ఇతర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. జంగారెడ్డిగూడెంలోని 20 స్థానాల్లో 16 స్థానాల్లో టీడీపీ, రెండు స్థానాల్లో వైకాపా, రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడం విశేషం.


.jpg)
.jpg)


