Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్
posted on: May 12, 2014 10:53AM
.jpg)
కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ప్రతి ఒక్కరూ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోతుందని భావించారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో తమకు బోలెడంత బలముందని బిల్డప్పులు ఇస్తూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో అసలు సీనే లేదని మునిసిపల్ ఎన్నికలు నిరూపించాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మటాష్ అని చెప్పేశాయి. మునిసిపల్ ఎన్నికలలో ప్రధాన పోటీ తెలుగుదేశం, వైకాపాల మధ్య కొససాగుతోంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీయే సీమాంధ్ర అంతటా ఆధిపత్యంలో వుంది. వైకాపా చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిలో వుంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. సీమాంధ్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీని చాచిపెట్టి కొట్టారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఛైర్మన్, మేయర్ స్థానాలను దక్కించుకునే మాట దేవుడెరుగు.. వార్డులు, కార్పొరేషన్ స్థానాలలో రెండు అంకెలను కూడా అందుకోలేకపోయింది.



.jpg)


