.webp)
మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?
Publish Date:Mar 29, 2025
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం అని కూడా ప్రచారం జరిగింది. అలాగే కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి.
అయితే రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు మరేదో ఉందనే కథనాలూ వచ్చాయి. అయితే ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.
అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి రేపు ఎప్పుడైనా జరిగేది కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో భారీగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు, మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్ నుంచి సేకరించిన గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు.
అంతే కాదు మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే ముహూర్తం ఖరారు చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.
కొలికపూడి యాక్షన్ ఓవర్ అయ్యిందా?
Publish Date:Mar 29, 2025
నైట్ రైడర్స్ మ్యాచ్కి రాములోరి బ్రేక్.. !
Publish Date:Mar 29, 2025
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు
Publish Date:Mar 29, 2025
టీటీడీ ట్రస్టులకు 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు
Publish Date:Mar 29, 2025

రాజకీయాల్లో కవిత మళ్లీ యాక్టివ్.. హరీశ్కు చెక్ పెట్టేందుకేనా?
Publish Date:Nov 24, 2024
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. స్వయాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బహిరంగ సభల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధమని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంటర్ ఇస్తూ పార్టీలో అన్నీతానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కేటీఆర్ జైలుకెళ్తే పార్టీని ముందుకు నడిపించే వారు ఎవరన్న చర్చ బీఆర్ ఎస్ వర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వర్గం నేతలు రాబోయే రోజుల్లో హరీశ్రావు పార్టీలో కీలకంగా మారబోతున్నాడని, ఆయనే పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కవిత రాజకీయాల్లో యాక్టీవ్ కావడం చర్చనీయాశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్రజా క్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల అదానీ కేసు విషయంలో కవిత కేంద్రంపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత గురుకులలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించి కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. దీనికితోడు చాలారోజుల తరువాత తన నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఏ), బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. దీంతో కవిత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లకముందు కవిత అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్ (యూపీఏ), భారత జాగృతి సంస్థల తరపున జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మనమెంతో మనకంత నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. కులగణన చట్టబద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. అయితే అరెస్టయి జైలుకెళ్లి, బెయిల్ పై విడుదలైన అనంతరం సైలెంట్ అయిపోయారు. పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. అటువంటి కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కవిత ఉన్నట్లుండి ఇప్పుడు రాజకీయాల్లో యాక్టీవ్ కావడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరూ ఊహించినట్లు కేటీఆర్ నిజంగా జైలుకెళితే పార్టీని నడిపించే బాధ్యతను కవిత తీసుకోబోతున్నారని, అందుకే ఆమె ఉన్నట్లుంటి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కవిత పొలిటికల్ గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్ కు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. ఎందుకంటే.. కవిత జైల్లో ఉన్న సమయంలో తన చెల్లికి బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా శ్రమించారు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత కవిత సైతం అన్నను హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలో అన్నాచెల్లెలు మధ్య ఒకరిపైఒకరికి ఉన్న ప్రేమ బహిర్గతం చేశారు. దీంతో రాజకీయాల్లో తాను ఎంత ప్రజాదరణ పొందినప్పటికీ.. తన అన్న తరువాతనే ఉంటానని కవిత చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలో ఒకవేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకెళ్లినప్పటికీ పార్టీ బాధ్యతలను కవిత తన భుజస్కంధాలపై వేసుకుంటారని, కేటీఆర్ జైలు నుంచి తిరిగిరాగానే ఆయన సారథ్యంలో రాజకీయాల్లో కొనసాగుతారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలా అన్నాచెల్లెలు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం కృషి చేస్తూనే.. మరో వ్యక్తి చేతికి పార్టీ పగ్గాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని, తద్వారా కేసీఆర్ వారసుడు కేటీఆర్ అనే విషయాన్ని క్యాడర్ లోకి కవిత బలంగా తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తరువాత కేసీఆర్ పెద్దగా బయటకు రావటం లేదు. అడపాదడపా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. కేటీఆరే పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నాడు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ తేలిపోతున్నాడని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హరీశ్ రావు లాంటి సీనియర్ నేతకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీలోని ఓ వర్గం డిమాండ్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకెళితే పార్టీ పగ్గాలు హరీశ్ రావు చేతికి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించిన కేసీఆర్.. తన కుమార్తె కవితను రంగంలోకి దింపినట్లు బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. జైలు నుంచి బెయిల్పై వచ్చిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత తన తండ్రి సూచనతోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా హరీశ్ రావుకు చేతికి మాత్రం పార్టీ పగ్గాలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగానే కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని తాజా రాజకీయ పరిణామాలను బట్టిచూస్తే స్పష్టమవుతోంది.
జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?
Publish Date:Nov 12, 2024
తాగిన మైకంలో కారులో డిజెతో కెటీఆర్ కొడుకు హిమాన్షు
Publish Date:Oct 22, 2024
రోజా.. గురువింద సామెత
Publish Date:Oct 22, 2024
రాజకీయాలలో చంద్రబాబు అన్ స్టాపబుల్!
Publish Date:Oct 22, 2024
నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?
Publish Date:Nov 26, 2024
మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిందే నిజమౌతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా, నాటో దేశాలపై ఆయన వెల్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేసిందనే అనిపిస్తున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలే కాదు అవమానాలనూ తెచ్చి పెట్టింది. ఉక్రెయిన్ నోటో దేశం కాకపోయినా, రష్యా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా, ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తైపోతుందని రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కంటే అన్ని విధాలుగా రష్యాకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ స్థితిలోనే పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైతే అణ్వస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేసేశారు. దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా,నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిస్సైల్స్ గురిపెట్టి సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక వేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్లే.
అసలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆరంభం అయినప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు.. ఊహాగానాలు కాదనీ, వాస్తవ రూపం దాల్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అర్ధమౌతోంది. అణు దాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి బేషజాలూ లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు. త్తగా రూపోందించిన ఓరెప్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఈ యుద్ధంలో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఈ మేరకు ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఇప్పటివరకూ ఈ మిస్సైల్స్ ను అడ్డుకునే వ్వవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాల లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిస్సైల్స్ 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించేయగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా ఆ మిస్సైల్ ను ప్రయోగిస్తే.. నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది.
ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై యుద్ధానికి వస్తే తనకు మద్దతుగా నిలిచే దేశాలను కూడగడుతోంది. ఇప్పటికే ఉత్తర కొరియా,చైనా రష్యాకు మద్దతు ప్రకటించాయి. ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు ఉక్రెయిన్, రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగే ప్రపంచ నేత ఎవరన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని మోడీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.
సొంత పార్టీ శ్రేణులకే వెగటు పుట్టిస్తున్న జగన్ రెడ్డి అతితెలివి!
Publish Date:Nov 13, 2024
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పీక్స్ కు?
Publish Date:Oct 19, 2024
బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4 చంద్రబాబుతో తొలి ఎపిసోడ్?
Publish Date:Oct 19, 2024
ముందస్తుకు చంద్రబాబు సిద్ధమౌతున్నారా?
Publish Date:Oct 19, 2024
పోర్చు గీసు పాలనను సవాల్ చేసిన వీర మహిళ.. పద్మశ్రీ పురస్కార గ్రహీత..!
Publish Date:Mar 29, 2025
మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అని అనుకుంటారు. కానీ ఇంటి గడప దాటి ఉద్యోగాలు చేయడం నుండి వివిధ పోరాటాలలో పాల్గొనడం వరకు మహిళలు ఎందులోనూ తీసిపోరు. తాజాగా సునితా విలియమ్స్ అంతరిక్షాన్నే జయించి సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే ప్రపంచం అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో జరిగిన మహిళల పోరాటం చాలా మందికి తెలియదు. 1947 సంవత్సరం దేశం మొత్తం స్వాతంత్ర్యం పొందింది. అయితే, దానిలో ఒక చిన్న భాగం అయిన గోవా మాత్రం మరో 14 సంవత్సరాలు పోర్చుగీస్ నియంత్రణలో ఉంది. 1961లో మాత్రమే గోవా విముక్తి పొందింది. 400 సంవత్సరాల వలస పాలనకు ముగింపు పలికింది.
ఆ సంవత్సరాల్లో నిరంతర ఆక్రమణలో ఒక నిశ్శబ్ద విప్లవం పుట్టుకొచ్చింది. స్వేచ్ఛను కోరుతూ వినిపించిన లెక్కలేనన్ని స్వరాలలో, లొంగిపోవడానికి నిరాకరించిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు . గోవా విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో పోరాడారు. ఈ నిర్భయ మహిళలలో కొంతమంది వారి అద్భుతమైన ధిక్కార చర్యల గురించి తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
1955 ప్రాంతంలో గోవా వాసులు నమ్మే ఏకైక వార్త 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్' ద్వారా వ్యాప్తి చేయబడిన వార్త. నిజం కోసం రేడియో ప్రసారాన్ని నమ్మవచ్చు. సమయం కఠినంగా ఉంది. గోవా తనను తాను విడిపించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆ సంవత్సరాల్లో చాలా మంది మహిళలు సామాజిక ప్రతీకారం లేదా విమర్శలకు భయపడకుండా తిరుగుబాటులో ముందుకు వచ్చారు. వారిలో ఒకరు లిబియా లోబో సర్దేశాయ్. ఆమె తన భర్త వామన్ సర్దేశాయ్తో కలిసి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక అడవి నుండి 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు. వారి వార్తా ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి. జాతీయవాద మనస్తత్వాన్ని పెంచింది.
జనవరి 2025లో లిబియా తన ధైర్యసాహసాలకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. విమోచన దినోత్సవం 19 డిసెంబర్ 1961 గోవా స్వేచ్ఛను రుచి చూసిన రోజు ఆమె మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది. “గోవా విముక్తి పొందినప్పుడు, జనరల్ జెఎన్ చౌధురి [అప్పటి భారత సైన్యం సైన్యాధ్యక్షుడు] మా వద్దకు వచ్చి స్వయంగా వార్తలను అందించారు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను తోట నుండి ఒక పువ్వును తీసుకొని అతనికి ఇచ్చాను. అతను నన్ను అడిగాడు, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?' అని. నేను 'నేను దానిని ఆకాశం నుండి ప్రకటించాలనుకుంటున్నాను' అని అన్నాను. మరుసటి రోజు గోవా విముక్తిని ప్రకటించే కరపత్రాలతో రాష్ట్రం నిండిపోయింది. మూలం ఆకాశం నుండి లిబియా సర్దేశాయ్ కూర్చున్న విమానం నుండి కరపత్రాలను రాష్ట్రం లో కుమ్మరించారు. ఈ విధంగా రాష్ట్రానికి స్వేచ్ఛ అందిన వార్త విని రాష్ట్రం ఎంతగానో సొంతోషించింది.
*రూపశ్రీ
పుత్రులు ఉదయించే సూర్యులు కావాలంటే...
Publish Date:Mar 28, 2025
రంగురంగుల రంగస్థలం.. ప్రపంచ రంగస్థల దినోత్సవం..!
Publish Date:Mar 27, 2025
మైక్రో వెడ్డింగ్ పేరు విన్నారా? ట్రెండ్ అవుతున్న ఈ పెళ్లి ఏంటంటే..!
Publish Date:Mar 27, 2025
మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!
Publish Date:Mar 26, 2025
శరీరంలో రక్తం తక్కువ ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
Publish Date:Mar 29, 2025
మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది. రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
చర్మం...
ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం.
పొడిబారడం..
ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది.
నల్ల మచ్చలు..
ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు.
మొటిమలు
రక్తం లేకపోవడం వల్ల ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.
*రూపశ్రీ.
చిన్న విషయాలకే కోపం వస్తోందా? సెకెండ్ల వ్యవధిలో చిరాకు పుడుతోందా? సమస్య ఇదే కావచ్చు..!
Publish Date:Mar 28, 2025
శాకాహారులు భయపడక్కర్లేదు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!
Publish Date:Mar 27, 2025
ఈ ఆహారాలను పెరుగుతో తింటే పాయిజన్ అవుతాయట..!
Publish Date:Mar 26, 2025
పిల్లల మెదడు పదునుగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
Publish Date:Mar 25, 2025