తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విద్యుత్ షాక్!
posted on Aug 19, 2022 @ 2:32PM
వెనకటికి ఒకాయన టీలు, సిగెరెట్లు బకాయిపడ్డాడని ఆయనకు ఓ దుకాణం వాడు రేపట్నుంచీ మీకేమీ ఇవ్వనన్నాడు. ఎందుకురా అని అడిగితే రెండునెల్లుగా ఐదు పైసలు ఇవ్వలేదన్నాడు. పెద్దాయనకు కోపం వచ్చింది. మొన్నామధ్యనేగా రెండొందలు ఇచ్చాను.. రాయడం రాక పద్దులో రాయకపోతే, నా తప్పే మిటి? అన్నాడాయన. కానీ బకాయిలు చెల్లించకపోతే బావయినా, ఏపీ సర్కార్ అయినా ఒకటే. అందులోనూ విద్యుత్ బకాయిలు పేరబెడితే కేంద్రం మనోడేగా అనుకోదు. మొండికేస్తే చేసే దేముం టుంది? పాత కరెంటు బకాయిలు కట్టకపోతే కరెంటు పీకేస్తారుగదా? ఇపుడు దేశంలో ఏకం గా 13 రాష్ట్రా ల పరిస్థితి కొద్దిగా తేడాతో ఇలానే ఉంది.
విద్యుదుత్పత్తి సంస్థల నుంచి రోజూ కొంటున్న విద్యుత్కు బిల్లులు సకాలంలో చెల్లించాలి. కానీ ఏపీ సర్కార్ అలా చేయలేదని చర్యలు తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. చర్యలను ఉపసంహరించే వరకు డిస్కంలు ఇదే పరి స్థితిని ఎదుర్కోనున్నాయి.
కేంద్రం నిషేధం విధించిన వాటిలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపుర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, జమ్మూ-కశ్మీర్, బిహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. నిషే ధం వల్ల తలెత్తే లోటు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది. తెలంగాణలో వ్యవసాయ బోర్లకు త్రీఫేజ్ కరెంటును శుక్రవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3 లేదా 4 గంటల వరకు, తిరిగి రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున అయిదున్నర వరకు ఇచ్చేందుకు డిస్కంలు ఏర్పా ట్లు చేస్తున్నాయి.
కాగా, వివిధ రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్, చెల్లించాల్సిన బిల్లు మొత్తాలను విద్యు దుత్ప త్తి సంస్థలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేందుకు వీలుగా పోర్టల్ ఏర్పాటు చేశారు. జులై, ఆగస్టు నెలల్లో డిస్కంలు తీసు కున్న విద్యుత్ బిల్లులను ఇంధన ఉత్పత్తి సంస్థలు పోర్టల్లో అప్లోడ్ చేశాయి. అప్ లోడ్ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది.
వాస్తవానికి బిల్లు ఇచ్చిన తర్వాత 45 రోజుల వరకు చెల్లింపు వ్యవధి ఉంటుంది. ఈలోగా సరఫరా చేసిన విద్యుత్ ఎంత? బిల్లులో పేర్కొన్న విధంగా యూనిట్ ధరలు ఉన్నాయా? ఇలాంటి అంశాలను పరిశీలిం చిన తర్వాతే ఉత్పత్తి సంస్థలకు బిల్లులను చెల్లిస్తుంటామని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ విషయా న్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిశీలించి నిషేధిత జాబితా నుంచి శుక్రవారంలోగా ఏపీ డిస్కం లను తొలగించే అవకాశం ఉందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
డిస్కంలు చేసిన చెల్లింపుల సమాచారం యాప్లో అప్డేట్ కాలేదు. దీంతో బకాయిలు కనిపిస్తున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలో దేశంలోని వివిధ డిస్కంలు సుమారు రూ.5 వేల కోట్ల బకాయిలున్నట్లు యాప్ చూపుతోందని అధికారులు పేర్కొన్నారు. అవసరాల మేరకు శుక్రవారం రియల్టైం మార్కెట్లో విద్యుత్ ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీక్ డిమాండ్ సమయంలో రోజు కు 10-15 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందన్నారు.
విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. రాష్ట్ర ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్ ద్వారా విద్యుత్ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. తెలంగాణలో గురు వారం గరిష్ఠ విద్యుత్ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది ఇదే రోజు (2021 ఆగస్టు 18)న 8500 మెగావాట్లు మాత్రమే డిమాండు ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పెద్దగా లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇళ్లకు, వ్యవసాయానికి వినియోగం పెరగడంతో డిమాండు ఎక్కు వైంది.
ప్రస్తుతం కృష్ణానదిలో భారీ వరదల కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనివల్ల ఎక్స్ఛేంజీల్లో కొనుగోలు తక్కువగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమ స్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు.
కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్ నుంచి చెల్లింపుల్లో జాప్యం సర్ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయంటూ.. విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించింది