888 నారాయణరావు | E శాలలో నక్కడక్కడ వాని నలంకరించినాడు. దేహ వేద్యము, హృదయ వైద్యము, ఆత్మ వైద్యము, అన్నియు నొకేసారి జరగాలని ఇల్లా పెట్టాను. ముఖ్యముగా చివరి రెండు వైద్యాలు నాకోసం లెండి' అని రాజారావు తన స్నేహితులతో ననుచుండును. | వైద్యమునకు వలయు మందులన్నియు సంపూర్ణముగా చెప్పించి యుంచి కొన్నాడు. ఏలమునకో గాని యావసరము రాని ఖరీదు గల మందైనను సరియే, అప్పుడు చెన్న పురికీ తంతి నిచ్చి తెప్పించుటకు బ్రయత్నించు వైద్యుడు ద్రోహి యని యాతని వాదము. కావున నే డాక్టరు రాజారావు గారి ఆస్పత్రి లో నండి, కాకినాడ గవర్నమెంటు ఆస్పత్రిలో గూడా లేని మందులున్నాయండి." అని యాతని గూర్చి పల్లెటూళ్ళ వెంబడి పేరు మోగినది. | అతడు గ్రామములు సులభముగా బోవుట కే మోటారు సైకిలు (పక్క బండి తో సహా యున్న ) అతడు తెప్పించుకున్నాడు. ఎచ్చటకు బోయిన నచ్చటకు వెంట బెట్టుకొని తిరుగుటకు అతని కడ రెండు "పెట్టెలు, ఒక ఖద్దరు సంచియు, నున్నవి. ఖద్దరు సంచి చాలా చిన్నది. ఎనిమిదంగుళముల చదరము, అందు రెండరలు, పట్టుకొనుటకు గూడా తాడు, మొదటి అరలో గుండె పరీక్ష జేయు యంత్రము, ఆయుర్వేదౌషధపు బొట్లమున్న యొక చిన్న దంతపు పెట్టె (పరమేశ్వర'మూర్తి బహుమతి) రెండవ అరలో శరీరమున మందు పొడుచుటకుసూది పిచికారి పెట్టయు. ఒక చిన్న ఇత్తడి పెట్టెలో సూది మందులు, ఎడినాలిన్, పిట్రాటిన్, సికినెను, డిజిటాలిను మందుల గాజుగోట్టములు నుండును . పెద్ద పెట్టెలలో నొక చిన్న వైద్యశాలయే ముఖ్యములగు మందు లన్నియు, తాత్కాలిక శాస్త్రచికిత్సకు వలయు పరికరములు నందుండును. రెండవ పెట్టెలో పొడపు మందుల రకములన్నియు , అన్ని రకముల సూదిపిచిరీలు - మొదలగు సామానంతయి నుండును. రాజారావునకు మొదటి నెల రెండువందలు వచ్చినవి. రెండవ నెల నాలుగు వందలు , మూడవ నెల నుంచి మాసమాసమయుదు వందల రూకలు వచ్చుచున్నవి. నారాయణరావిచ్చిన వేయి రూకలు "నాతడు తిరిగి యిచ్చీ వేసెను. అతని పేరు కోనసీమ యంతట పాకిపోయినది. నెమ్మదిగ గోదావరి అద్దరిని యిద్దరిని రాజారావును వైద్యములకై గొనిపోవ నారంభించినారు. అంతలో ఎచ్చట నుండి వచ్చినదో మాయ మృత్యుదేవత! ఇరువురు బిడ్డలను తల్లి లేని వారేనారు. మోహావేశమేగాని (ప్రేమ యన నెట్టిదో యెరుంగని చిననాటి దినములలో భార్య కాపురమునకు వచ్చినది. ఎన్నిసార్లు వివేకానందును చదివిన నేమి? ఎన్ని సార్లు జానా నందుని విన్ననేమి? ఆ వేదాంతము మనస్సు నుండి అంత 8 కరణమున కెన నంటేనదా? ఒ ఓ రామ మోహనరాయలు బోధించిన నేమి, వీరేశలింగము గారు పాఠములు ----------------
ప8 వరనము 889 చెప్పిన సాంఘిక ధర్మ మర్ధమయినదా? తన భార్యను జిన్నా తనములో గలసికొనక యున్నచో నామే ఆరోగ్యవంతురాలై యుండెడిదేమో? పుష్పవతి యగుట తరువాయిగ భారతీయుడు బాలిక ను గలియుటయే గదా! భార్య బ్రతికినంత కాలము గోపురంద్రీమ తల్లి. పేమ జీవి! ఆమె నెరిగేనా తాను? ఆమె తన బిడ్డలకు దల్లి యనుమాటయేకదా తనకు తెలిసినది. పరమేశ్వరా! నా కర్తవ్యమేమి? తండ్రీ! ఈ పరీక్ష నీదా? నా "వేదాంతము పరీక్ష చేయదలుచుకొన్నవా? డబ్బు గణిస్తూ యింటిలో మూటలుక పెట్టె యీ విచిత్ర రోగి నారాయణ సేవ నీకు నచ్చినదా? నా హృదయం కల్మషం అయ్యే ఉంది. చిన్న తనాన్నుంచిన్నీ కాబట్టే నన్ను తరింప చెయ్యాలని వచ్చిన నా అన్న పూర్ణని నేను బ్రతికించుకో లేకపోయాను. నా బిడ్డలను తల్లి లేని వారిగా చేశాను' అని రాజారావు కుంగిపోవుచుండెను! చుట్టుప్రక్కల చుట్టాలు, సంబంధములు తీసికొని వచ్చి రాజారావుకు వివాహము చెయ్యవలేనని ప్రయత్నించిరి . రాజారావు 'ఆ మాట తలపెత్తకండి ) అని చెప్పినాడు. రాజారావు పైకి ధైర్యముగ తీరుగుచునేయున్నాడు. ఇదివరకు నాటకములన్న నిష్టము లేదు. సంగీత ములన్న కడుపులో ట్రిప్ప కవిత్వామన్న కనులు తిరుగును. కళయన్న నసహ్యము. అయ్యో ఎంత కష్టము అని ఎవరైనా అనినచో ఏమిటి కష్టము? ఎవరికీ ఆత్మ?? అని ప్రశ్నించేవాడు.
'ఇతడు వట్టి పొడి వేదాంతి? అని హేళన చేసేవాడు పరమేశ్వరుడు రాజారావును. సినిమాలకు వెళ్ళితే ఎప్పుడైనా తన స్నేహితులతో వెళ్ళుట వారికొరకే. సంగీత పుకచ్చీరీలు మొదలగు నితర ఖుషీలకు వెళ్ళినను అందులకే. అట్టి రాజారావు నేడు అబలయైనాడు. చంటిబిడ్డ ఏడ్చిన , అతని కన్నుల నీరు తిరుగును. కరుణారములగు కధలు విన్న భరించలేడు. పురాణములన్నియు జదువ ప్రారంభించి నాడు చదువుచు జదువుచు దన్మయు డైపోవును. ఏమి యీ కవిత్వము అనును . రోగులు వారంతట వారిచ్చినచో ఫీజులు పుచ్చుకోనును. లేనిచో లేదు. చెవుల నుండి బిర అతీసినట్లు సంగీతము వినును. కన్నుల నుండి తెర తొలగినట్లు నాటకములు, సినిమాలు చూచును.
అతడిప్పుడు తన హృదయమును గనుగోన్నాడు. నేడు తన వైద్యశాలలో నమర్చిన బాలకృష్ణుని లీలలు దనకర్దము సాగినవి. భగవద్గీత లో పురుషోత్తమ భావము యొక్క అర్ధము గోచరింపసాగెను. "కృష్ణా! కృష్ణా! భక్తీ లేని' యీ హృదయమునకు భక్తీ పరిళమునిచ్చినావా, నా భార్యను గొనిపోయి? యని హృదయములో ననుకోనుచు కంటికి పెట్టిన జోడు తీసికొని కన్నులు నులుముకొని తలవంచి నమస్కరించినాడు -------------------
ఆత్మహత్య . నా హృదయము నారాయణరావు సవరించి వదలి రాకున్న దేల?' అను ప్రశ్న శ్యామసుందరిని వీడ లేదు. నారాయణుని పై తనకున్న పేమతత్వ మెట్టిదోయని యాలోచించుకొన్నది. ఆ పేమ వాంచా పేరితము మాత్రము 'కాదు అది ఒక్కసారే కలిగినది . నే డాతడు పేమారియవచ్చి తన్ను కోరినను, దాను కుంచించుకొనిపోవలసినదే. ఆ దినమున తన శరీరంగములన్నియు నుప్పొంగిపోయినవి. మూర్తిభవించిన అతని "పురుషత్వము తలచుకొన్నను నేడు పుల్క లైన జనింపకుండుట కాశ్చర్య మొందినది. శ్యామసుందరీదేవి . ఆ దివ్య మూహుర్తము, తానాతని కౌగిలిలో కరిగిపోయిన పరమప్రసన్నత, తన జీవితములో ముందునకు దారి జూపు దివ్య తేజస్సు వంటిది. యని యామె నిర్ధారణ చేసికొన్నది. అప్పటి నుండియు నామెకు సకల లోకములు తన్ను జుట్టు తోన్నట్లు భావము తోచినది. 'నే నందరిని బెమించుచున్నోను, నన్నందరు పెమించుచుచున్నారు. నేను ప్రేమమూర్తిని పెమచే నందరు నాలో నున్నా "రన్న దివ్య వాణి తనలో ప్రతిధ్వనించుచున్న దని యామె భావించుకోన్నది. ఆనాటి నుండి ఆమె ప్రతి జీవియందును పేమాను భావము జూచినది. ఇంతలో రాజారావు వచ్చినాడు. సుబ్బారాయుడు గారి జబ్బు కొరకు . రాజారావునకు భార్య పోయినదా? అయన జన్మము తరించు సంసార బాటసారి భగ్నపోయినదా? ఆమె కిరువురు బిడ్డలట. ఆ బిడ్డల నాదరించి పెంచువారెవరూ? మూడు కాళ్ళ ముదుసలియగు "మా తమహి? రాజారావు వివాహమెల యడకూడదు? ఛీ! అదేమీ యాలోచన. అయన వేదాంతీయనియు, అందువలన అయన హృదయము కర్కశ మైనదనియు దనతో నొకనాడు నారాయణరావు చెప్పినాడు. అట్టీ పుణ్య పురుషుడు మరల వివాహము చేసికోనునా? అయన బాలికల యదృష్ట మెట్టిదియో? తనతో నారాయణరావు అన్నగారు సూరమాంబ పావన చరిత్రయని చెప్పినాడు. గంభీరహృదయుడగు నారాయణరావే ఆమె పేరు తలచుకొని కన్నీరు పెట్టుకొన్నాడు. ఆ వార్త విని సూరీడు చెల్లి తన ఒడిలో జేరి, వెక్కి వెక్కి వాపోయినది. ఆ సూరమాంబ యెంత సాద్వియో?' ఇట్టి యాలోచనలు తన్నా వరించుకొన వదలించుకొనుచు వైద్య పరీక్షకే సంపూర్ణ దీక్ష వహించి చదువుకొనుచున్నది శ్యామసుందరీ. ఇంతలో రాజేశ్వరరావు విషము పుచ్చుకొని చనిపోయినాడని రోహిణి వార్తా తెచ్చినది. --------------


