• Prev
  • Next
  • పరారీలో అతిథి

    పరారీలో అతిథి

     

    ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.
    అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,
    రెండవ అమ్మాయి పేరు చిరిగిన,
    మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,
    నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...
    ఇలా ఈ విధంగా ఆ తల్లి తన
    కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.
    . ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.
    .అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో
    కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’
    .
    అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’
    .తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!
    అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే
    కూర్చుంటాను’’
    .తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’
    .అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే
    కూర్చుంటాను’’
    . అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు.
    .కొద్దిసేపు తరువాత....
    . తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా..
    పాలు తీసుకుంటారా?’’
    . అతిథి : ‘‘టీ’’
    .తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’
    . అతిథి : ‘‘వద్దు వద్దులెండి..
    .నేను పాలు తీసుకుంటాను’’
    .
    తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని
    రామ్మా’’
    .
    ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి
    పారిపోతాడు........

     

  • Prev
  • Next