చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసా! చర్మం  ఆరోగ్యంగా ఉండటానికి  ప్రోటీన్లు, విటమిన్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా విటమిన్-కె చర్మసంరక్షణలో చాలా అవసరం. అందరూ విటమిన్-ఇ గురించి మాట్లాడతారు కానీ విటమిన్-కె గురించి అస్సలు తెలియనే తెలియదు. అందుకే  ముఖ చర్మానికి విటమిన్-కె ఎందుకు అవసరమో తెలుసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. చర్మానికి విటమిన్-కె చేసే మేలు.. విటమిన్-కె చర్మం మీద వాపులు, దురదలు తగ్గించడంలో సహాయపడుతుంది.  దీనికారణంగా ఇది తామర వంటి దారుణమైన సమస్యలను కూడా తగ్గించగలదు. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కొల్లాజెన్ చాలా అవసరం.  కొల్లాజెన్ చర్మానికి ఎలాస్టిక్ స్వభావాన్ని ఇస్తుంది. ఫలితంగా చర్మం మీద ముడతలు పడకుండా చేస్తుంది. అయితే విటమిన్-కె కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. కళ్లకింద నల్లని వలయాల గురించి ఆందోళన చెందని వారు ఉండనే ఉండరు. కానీ విటమిన్-కె దీనికి చెక్ పెడుతుంది. కళ్ల కింద నల్లగా మారిన చర్మంలో రక్తనాళాలు బలహీనంగా ఉంటాయి. ఈ రక్తనాళాలను బలోపేతం చేయడం ద్వారా కళ్లకింద నల్లటి వలయాలు తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చర్మం మీద చాలామందికి నరాలు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. వీటిని స్పైడర్ సిరలు అని అంటారు. ఈ స్పైడర్ సిరల రూపాన్ని తగ్గించడంలో విటమిన్-కె సహాయపడుతుంది. చాలామందిలో పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయిన డార్క్ స్పాట్స్, వయసు వల్ల వచ్చే ముడతలు, మచ్చలు మొదలైనవాటికి విటమిన్-కె భలే పరిష్కారం. హైపర్ పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో కూడా విటమినే-కె సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మానికి కలిగే మంటలు, ఆక్సీకరణ ఒత్తిడి, సూర్యుని హానికరమైన యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో కూడా విటమిన్-కె సహాయపడుతుంది. విటమిన్-కె కొత్త చర్మకణాలు ఏర్పడటాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవి రెండూ గాయాలు తొందరగా నయం కావడానికి సహాయపడతాయి.                    *నిశ్శబ్ద.

ఇంట్లోనే అందుబాటులో ఉన్నవాటితో  బ్రాండ్ ను తలపించే బాడీ లోషన్!   చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు అధికం అవుతాయి. వీటిని తేలిగ్గా తీసుకుంటే ఆ తరువాత చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే అమ్మాయిలు చాలా మంది మార్కెట్లో బోలెడు బాడీ లోషన్లు కొనుగోలు చేస్తారు. బ్యూటీ ఉత్పత్తి దారులు కూడా చలికాలం మొదలైందంటే బాడీ లోషన్, మాయిశ్చరైజర్లకు సంబంధించి యాడ్స్ తో సావగొడుతుంటారు. అయితే ఇవన్నీ రసాయలతో కూడినివి కావడంతో వీటిని కొనుగోలు చేయడంలో చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉన్న పదార్థాలతో బ్రాండెడ్ బాడీ లోషన్ల లాగా  ఫలితాలు ఇచ్చే బాడీ లోషన్ ను తయారుచేయవచ్చు. దీనికి కావలసిన పదార్థాలేంటో.. పూర్తీగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. బాడీ లోషన్ తయారీకి కావసిన పదార్థాలు చాలా సింపుల్ గా ఇంట్లో లభ్యమయ్యేవే.. ఒక చిన్న కప్పు కొబ్బరి నూనె నిమ్మకాయ అరచెక్క విటమిన్-ఇ క్యాప్సుల్స్ మూడు నుండి నాలుగు తయారుచేసుకునే విధానం.. ముందుగా  నిమ్మకాయ రసం తీయాలి. ఒక కప్పు కొబ్బరినూనెను ఒక గిన్నెలో వేసుకునే సన్నని మంట మీద కొద్దిగా వేడి చేయాలి. ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్, నిమ్మరసం వేయాలి. దీని ప్రభావం మరింత ధృడంగా ఉండటానికి దీనికి కొబ్బరి నూనెతో పాటు బాదం నూనెను సమంగా తీసుకుని ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి బాగా మిక్స్ చేసిన తరువాత దీన్ని ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేస్తూంటే ఏ బ్రాండ్ బాడీ లోషన్ కూడా ఇవ్వని గొప్ప ఫలితాలు ఇస్తుంది.                                       *నిశ్శబ్ద.

ముఖ చర్మం పాడవుతోందా... మీరూ  ఈ తప్పులు  చేస్తున్నారేమో!     అమ్మాయిలలో ఎక్కువగా ఆకర్షించేది ముఖమే. ముఖం అందంగా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ మరింత ఆకర్షణగా మారుతుంది.  చర్మం రంగు ఏదైనా సరే ముఖం చక్కగా, కాంతివంతంగా, మొటిమలు, మచ్చలు ఏవీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ  అలాంటి ముఖం చాలా తక్కువ మందికి ఉంటుంది.  అయితే ముఖం మీద మచ్చలు, ముడతలు, మొటిమల తాలూకు గుర్తులు ఏవీ లేకుండా ఉండటం కోసం ఎన్నో రకాల బ్యూటీ ఉత్పత్తులు వాడతారు. ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్  వాష్ లు ఇలా చాలా ఉపయోగిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఉత్పత్తులన్నీ మంచి వాసన వస్తాయి తప్ప చర్మాన్నిమాత్రం బాగు చెయ్యవు.  చర్మం చక్కబడాలంటే దానికి కావల్సింది  వాణిజ్య ఉత్పత్తులు ఉపయోగించడం కాదు, చర్మాన్ని శుభ్రం చేసే విధానం తెలుసుకోవడం. ఫేస్ వాష్ చేయడంలో  చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటిని  సరిచేసుకోవడం అవసరం. క్లెన్సర్.. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సరైన క్లెన్సర్ ఎంచుకోవడం తప్పనిసరి. చాలామంది కొంటున్నారనో, మార్కెట్లో వైరల్ అవుతోందనో క్లెన్సర్ కొనుగోలు చేయకూడదు.  చర్మాన్ని బట్టి క్లెన్సర్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి ఎటువంటి నష్టం కలగదు. ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి. ఒకవేళ ఏదైనా క్లెన్సర్ ఉపయోగించగానే ముఖం మీద గుల్లలు, దద్దుర్లు, ముఖ చర్మం ఎర్రబడటం వంటివి జరిగితే అలాంటి క్లెన్సర్ కు దూరం ఉండాలి. వేడినీరు వద్దు.. ముఖం శుభ్రం చేసుకోవడానికి కొందరు వేడినీరు ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మం శుభ్రపడుతుందని అంటారు. కానీ వేడినీటితో ముఖం కడిగితే ముఖ చర్మంలో ఉన్న తేమ కోల్పోతారు. అదే చల్లని నీటితో కడితే ముఖ చర్మం తేమ కోల్పోదు. రుద్దకూడదు.. ముఖం కడిగేటప్పుడు   క్లెన్సర్ లేదా సోప్ వంటివి ఉపయోగించే ముందు ముఖాన్ని గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం దెబ్బతింటుంది.  మృదుత్వం కోల్పోయి చర్మం రఫ్ గా మారిపోతుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా సాగిపోవడానికి అస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్త.. ముఖం కడుక్కోవడానికి ముందు చేతులు  శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చేతులు శుభ్రం చేసుకోకుండా ముఖం కడుక్కుంటే  చేతులలో ఉన్న మురికి ముఖ చర్మానికి అంటుకుంటుంది. ఇది ముఖం మీద మొటిమలు, గుల్లలు, దద్దుర్లు, ముఖం రంగుమారడం వంటి సమస్యలకు కారణం అవుతుంది.                                                    *నిశ్శబ్ద.

 ఈ నాలుగు  పదార్థాల ముందు  బ్యూటీ పార్లర్ లో ఖరీదైన ఫేషియల్స్ కూడా పనికిరావు.. అమ్మాయిలకు చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఎక్కవ. చాలా మంది చర్మ సంరక్షణ పేరుతో  దృష్టి అంతా ముఖ కాంతిని పెంచడంపైనే ఉంచుతారు.   ముఖంలో  మెరుపు కనిపిస్తూ ఉంటే చాలు తాము యవ్వనంగా ఉన్నామని అనుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ లో వందలాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పండుగలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్లు, పార్టీలు చాలా చిన్న వేడుకలలో కూడా అమ్మాయిలు తమ అందాన్ని మెరిపించడానికి ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. బ్యూటీ పార్లర్లలో కాస్త ఖరీదైన ఫేషియల్ క్రీములు ఉపయోగించి వేలాది రూపాయలు  తీసుకుంటారు. వీటిని వాడటం వల్ల చర్మం మెరుపు వచ్చినా అది తాత్కాలికమే. కానీ బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ ను తలదన్నే  పదార్దాలు చాలా సులువుగా, తక్కువ ధరకే  లభిస్తాయి. వీటిని ఉపయోగిస్తే ముఖం దగదగ మెరిసిపోతుంది. పచ్చిపసుపు.. పచ్చిపసుపు ముఖానికి మెరుపు ఇవ్వడంలోనూ, ముఖం మీద మచ్చలు, మొటిమలు, మొటిమల తాలుకూ గుర్తులను తగ్గించడంలోనూ బాగా సహాయపడుతుంది. రెండు చెంచాల పచ్చిపసుపును ఒక చెంచా శనగపిండితో కలపాలి. దీంట్లో తగినంత రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత చేతులను కొద్దిగా తడి చేసి ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయాలి. దీన్ని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి వాడాలి. కేవలం మూడు సార్లు వాడటంతోనే ముఖం లో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీన్ని లైప్ స్టైల్ లో భాగం చేసుకుంటే ముఖానికి ఏ క్రీములు అక్కర్లేదు. జాజికాయ.. చర్మంపై మచ్చలు మరియు మచ్చలను తొలగించడంలో జాజికాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. జాజికాయను గ్రైండ్ చేసి, దాని పొడిని తయారు చేసుకోవాలి. ఈ పొడికి  తేనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మొత్తం ముఖం మీద లేదా మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో అయినా   చేయవచ్చు. దీన్ని రాత్రి ముఖానికి రాసుకుని అలాగే వదిలేయవచ్చు.  తెల్లారేసరికల్లా ముఖం మెరిసిపోతుంది. దీన్ని పాలో అవుతుంటే అసలు ముఖానికి ఏ ఇతర ఉత్పత్తులు వాడక్కర్లేదు. చందనం.. చందనం చలువ చేస్తుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు తగ్గిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రెండు చెంచాల గంధపు పొడికి రోజ్ వాటర్ వేసి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  దీన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత తడి చేత్తో సున్నితంగా స్ర్కబ్ చేస్తూ కడిగేసుకోవాలి. దీని వల్ల టానింగ్ సమస్య తొలగిపోయి గ్లో పెరుగుతుంది. దాల్చిన చెక్క.. వంటల్లోకే కాదు ముఖ సౌందర్యంలోనూ దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను  మిక్సీలో వేసి  పొడి చేసుకోవాలి. అందులో పండిన అరటిపండు వేసి బాగా  కలపాలి. దీన్ని మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించాలి.  ఆరిన తరువాత శుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం మెరుపును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది.                                                           *నిశ్శబ్ద.

ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో  ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా  వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం  శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్  అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్‌కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో  వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్  వాడటం మరచిపోకూడదు.  ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు..  ఫేషియల్ చేయించుకున్న తరువాత  రోజు మొత్తం  ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను  దూరంగా ఉంచాలి . ఫేషియల్  ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్  తర్వాత  స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు.                                    ◆నిశ్శబ్ద.

గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు.. ఇలా వాడితే  అందాన్ని  కూడా మెరిపిస్తుంది..   ఆరోగ్యం మీద స్పృహ ఉన్న చాలామంది  గ్రీన్ టీ తప్పకుండా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం నుండి, బరువు తగ్గడం వరకు, ఇమ్యునిటీ పెరగడం నుండి రోజంతా ఉల్లాసంగా ఉండటం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీని కేవలం ఆరోయానికే కాదు, అందాన్ని మెరిపించడానికి కూడా ఉపయోగించవచ్చు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లలో మార్పు, దుమ్ము, ధూళి కారణంగా చర్మం దెబ్బతింటుంది. దీన్ని తిరిగి మెరిసేలా చేయడానికి బ్యూటీ పార్లర్లలో బోలెడు డబ్బు పోస్తుంటారు. కానీ అవన్నీ వద్దండోయ్.. కేవలం  గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని మెరిపిస్తాయి. గ్రీన్ టీ తో తయూరుచేసి వాడాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. ముల్తాని మట్టి, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. జిడ్డు చర్మం ఉన్నవారికి ముల్తానిమట్టి చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చెంచా ముల్తానీ మట్టికి 2 చెంచాల గ్రీన్ టీ వేసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను మందంపాటి పొరగా ముఖం మీద అప్లై చేసి కనీసం 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది జిడ్డును తొలగించడమే కాదు మృదువుగా ఉంచుతుంది. ముఖ చర్మాన్ని మెరిపిస్తుంది. ఆరెంజ్ పీల్, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. ఆరెంజ్ తొక్కలను  ముఖానికి ఉపయోగించడం ద్వారా చర్మం మెరుస్తుంది. ఇక దీనికి గ్రీన్ టీ కూడా జోడిస్తే రెట్టింపు ఫలితాలు పొందుతారు.  . తాజా నారింజ తొక్కలను అయినా ఉపయోగించవచ్చు. లేదా నారింజ తొక్కల పొడిని అయినా ఉపయోగించవచ్చు.  ఒక చెంచా గ్రీన్ టీలో ఒక చెంచా నారింజ తొక్క పొడి,  అర చెంచా తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను  ముఖం,  మెడపై  అప్లై చేయాలి. దీన్ని 15నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మ, గ్రీన్ టీ ఫేస్ ప్యాక్.. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఒక చెంచా గ్రీన్ టీ నీటిలో ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కాటన్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడగాలి. అంతే కేవలం మూడే మూడు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వల్ల పార్లర్ టైప్ మెరుపు సొంతమవుతుంది.                                                         *నిశ్శబ్ద.

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే వారి చదువు ఎలా ఉండాలో తెలుసా?   చదువుకోరా గాడిదా అని చిన్నపిల్లలను  పెద్దలు ఒక్కసారి అయినా తిట్టే ఉంటారు, ఇప్పటి పెద్దలు కూడా తమ చిన్నతనంలో  తమ తల్లిదండ్రులతో తిట్టించుకునే ఉంటారు. చదువుకోవాల్సిన వయసులో దాని విలువ అర్థం కాలేదు, వయసైపోయిన తరువాత చదువు విలువ అర్థం అవుతుందని చాలామంది చెబుతారు. ఈ కారణంగానే  పెద్దలు తమ పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటుంటారు. కానీ పిల్లలు అందరూ ఒకేలా చదవరు, ఒక్కొక్కరు  ఒకోవిధంగా చదువుతుంటారు. చదువుతున్నప్పుడు పిల్లలు తరచూ ఒక అంశాన్ని పునరావృతం చేస్తూ  నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు, దీనిని రోట్ లెర్నింగ్ అని తెలుగులో బట్టీ పట్టడం అని అంటారు. ఒకరి జ్ఞాపకశక్తి ఎంత మెరుగ్గా ఉంటే పరీక్షలో సమాధానాలు అంత బాగా వ్రాస్తారని, దాని ద్వారా వచ్చే  ఫలితం ఆధారంగా అతన్ని తెలివైన పిల్లవాడు అని పిలుస్తారు. అయితే లోతుగా ఆలోచిస్తే అలాంటి పిల్లలు నిజంగా తెలివైన వారా?  నిజంగా భవిష్యత్తులో  గొప్పగా మారుతార? అంటే ఖచ్చితమైన సమాధానం లేదు! పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే  పిల్లలు  ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో చాలా మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.  కానీ  జీవితానికి సంబంధించిన నిజమైన జ్ఞానాన్ని కోల్పోతారని పరిశోధకులు కూడా చెబుతున్నారు.   వారు  తమ చదువును కూడా సరిగా వినియోగించుకోలేరు.  విద్య అంటే నేర్చుకోవడం.  జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి  పాఠశాల విద్య ఆధారమవుతుంది. అందువల్ల జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడం కావాలి తప్ప విషయాన్ని గుర్తుంచుకోవడం కాదు కావాల్సింది. అంటే పిల్లలు ఏదైనా విషయాలను గుర్తుంచుకోవడం కంటే ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకోవడం వల్ల పిల్లల  జీవితం  అటు విద్యాపరంగానూ, ఇటు జీవితపరంగానూ  ఎదుగుతుంది. గుర్తుంచుకోవడం కంటే విషయాలను అర్థం చేసుకోవడం ఎందుకు మంచిదంటే.. బట్టీ పట్టడం ద్వారా పిల్లలు  శబ్ద జ్ఞానాన్ని పొందుతారు అప్పుడు వారికి  పదాలు మాత్రమే మనస్సులో నిలిచిపోతాయి. పిల్లవాడు ఇలా చదివితే అతను  కంఠస్థం చేసిన పదాల సంఖ్యకు అతని అభివృద్ది  పరిమితమవుతుంది.  అదే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే విషయ పరిజ్ఞానం పెరుగుతూ పోతుంది. బట్టీ పట్టే ప్రక్రియ కారణంగా పిల్లల మానసిక ఎదుగుదల  సరిగా ఉండదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఒకరి మేధో సామర్థ్యాన్ని పెంచే విషయాలపై మంచి అవగాహనకు దారి తీస్తుంది. బట్టీ పట్టడం వల్ల పిల్లలు అలసిపోతారు. పిల్లలు కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోకుండా విషయాలను కంఠస్థం చేసినప్పుడు  నీరసం వస్తుంది. మెదడు అలసిపోతుంది. బట్టీ పట్టి చదివే పిల్లలు నిజ జీవితంలో ఏ విషయాన్ని ఒక పద్దతి ప్రకారం ఆచరించలేరు.  విషయాన్ని అర్థం చేసుకోవడం,  రాయడం ద్వారా పిల్లలు మరింత సమర్థవంతంగా ఉంటారు.  జీవితంలోని కష్ట సమయాల్లో కూడా  ఆ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల వారి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. జ్ఞాపకం అనేది స్వల్పకాలిక ప్రక్రియ. ఇది కొద్దికాలం మాత్రమే  ప్రభావవంతంగా ఉంటుంది. కొన్నిరోజుల తరువాత విషయాన్ని మరచిపోతారు. అందుకే పదే పదే రివిజన్ చేయాల్సి ఉంటుంది. అదే  విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత  దాన్ని రాయడం అలవాటు చేసుకుంటే అది చాలాకాలం పాటు గుర్తిండిపోతుంది. అందుకే పెద్దలు పిల్లలకు విషయాన్ని అర్థం చేసుకుని చదివే దిశగా మార్గనిర్దేశం చేయాలి.  అవసరమైతే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతుండాలి. ఎంతసేపు మార్కుల కోణంలో పిల్లలను సతాయించకుండా పిల్లల ఆలోచనా పరిధి ఏంటి అనే విషయాన్ని గుర్తించాలి.                                                                  *నిశ్శబ్ద. 

పిల్లలకు క్రమశిక్షణ ఎలా నేర్పాలి.. ప్రయోజనాలు ఏంటి.. ప్రతిఒక్కరికీ  క్రమశిక్షణ అనేది చాలా అవసరం. పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ నేర్పించడం చాలా ముఖ్యం. దీని ద్వారా పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. శ్రమ ఎప్పటికీ వృధా కాదు. మీరు మీ పిల్లలకు క్రమశిక్షణను చిన్నతనంలోనే నేర్పించాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించాలి. ఇలా పెంచిన పిల్లలు భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం. మీరు పిల్లలకి ఎక్కువ పనిని అప్పగించాల్సిన అవసరం లేదు.  బదులుగా మీరు వారి మానసిక, ప్రవర్తనా అలవాట్లను గమనించి వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధికి ఎలా సహకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి: పిల్లల భవిష్యత్తు అనేది వారి క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ క్రమశిక్షణతోపాటు ప్రేమను కూడా వ్యక్తపరుస్తుండాలి. క్రమశిక్షణ అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుంది. పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని ప్రోత్సహించినప్పుడు, వారు పట్టుదల, సంకల్పం వంటి లక్షణాలను నేర్చుకుంటారు. ఈ విషయాలు పిల్లల పాత్రచ పరస్పర చర్యలు, ఇతరులతో సంబంధాలను ఏర్పరుస్తాయి. కష్టపడి పనిచేసే పిల్లలు భవిష్యత్తులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. ఇదంతా తల్లిదండ్రుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. పని విషయంలో కఠినమైన నియమాలను రూపొందించండి: పిల్లలు బలమైన పని-సంబంధిత నీతిని అభివృద్ధి చేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలు చెప్పి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పనులు చేయగలరని విశ్వాసం కలిగించాలి.దీని ద్వారా, పిల్లలు తాము చేసిన పనికి బాధ్యత వహించడం నేర్చుకుంటారు. వారి పనిని పూర్తి చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రత్యేక నైపుణ్యం: క్రమశిక్షణ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది పిల్లలు పాఠశాలలో, వృత్తిలో, వారి వ్యక్తిగత జీవితంలో ఈ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందేందుకు అనుమతిస్తుంది. మీ పిల్లలలో ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి సమయం పట్టవచ్చు. అలాగే, దీనికి తల్లిదండ్రుల నుండి చాలా ఓపిక అవసరం. పిల్లలను అనవసరమైన ఒత్తిడికి గురిచేయకూడదు. ఒత్తిడికి గురిచేయవద్దు: క్రమశిక్షణ పేరుతో మీ పిల్లలను ఒత్తిడికి గురిచేయకూడదు. పిల్లల వయస్సుకు తగిన అంచనాలు ఉండాలి. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెడితే చిన్న వయసులోనే డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ముందుగా సులభమైన పనులు ఇచ్చి, క్రమంగా వారి స్థాయిని పెంచుతుండాలి.  దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే పిల్లవాడు చాలా నేర్చుకోవచ్చు. మంచి దినచర్యలో ఇంటి పని కూడా ఉంటుంది. అది అబ్బాయి అయినా సరే... అమ్మాయి అయినా సరే. పిల్లలు ప్రశంసిస్తుండాలి: పొగడ్తలను ప్రేమించే పిల్లలను ప్రశంసించడం ద్వారా వారికి క్రమశిక్షణ నేర్పించవచ్చు. కల్మషం లేని హృదయానికి ప్రేమ, శ్రద్ధ అవసరం. ఇది మీ బిడ్డకు తల్లిదండ్రులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఏదైనా మంచి చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. వారి ప్రయత్నాలను గుర్తించడం ద్వారా వారి విజయానికి బాసటగా మారుతుంది.

పిల్లలలో ఐక్యూ ఎంతుందో ఎలా తెలుసుకోవాలి..వారి ఐక్యూ ఎలా పెంచాలంటే..  తల్లిదండ్రులు తమ బిడ్డ తెలివిగా, చురుగ్గా ఉండాలని కోరుకుంటారు.  దీని కారణంగా పిల్లలు  విజయం సాధిస్తారు. పిల్లలు చురుగ్గా తయారుకావడానికి తల్లిదండ్రులు వారికి మంచి వాతావరణాన్ని అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఆహారం నుండి పానీయాల వరకు, మంచి అలవాట్ల నుండి  మంచి పాఠశాలను కనుగొనడం వరకు తల్లిదండ్రులు కృషి చేస్తారు. కానీ పిల్లవాడు తెలివిగా ఉండటానికి,  అతని IQ స్థాయి బాగా ఉండటానికి చాలా తేడా ఉంది. IQ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇది పిల్లలను సాధారణ పిల్లల నుండి భిన్నంగా చేస్తుంది. చిన్నతనం నుంచి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే పిల్లల ఐక్యూ స్థాయిని పెంచవచ్చని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా పిల్లల ఐక్యూ స్థాయి 90 నుంచి 110 మధ్య ఉంటుంది. పిల్లల IQ స్థాయి 125 నుండి 130 వరకు ఉంటే అతనిని మేధావిగా పరిగణిస్తారు. అయితే దీనికి ముందు  పిల్లల ఐక్యూ ఎంతో  తెలుసుకోవడం ముఖ్యం.  దీన్ని తెలుసుకోవడం కష్టమేమీ కాదు, పిల్లవాడిని కొంచెం గమనించాలి,   అతని ప్రవర్తనను అర్థం చేసుకోవాలి.  పిల్లలలో గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే..  మాట్లాడటం.. అన్నింటిలో మొదటిది పిల్లవాడు ఏ వయస్సులో మాట్లాడటం ప్రారంభించాడో గమనించాలి. పదాలను పట్టుకోవడంలో అతని సామర్థ్యం ఏమిటి? అతను ఏ పదాలు తక్కువ తప్పులతో మాట్లాడుతున్నాడు లేదా అతనికి పదే పదే చెప్పాల్సివస్తోందా? అతను పూర్తి వాక్యాలు చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడు? ఇవి చిన్న విషయాలు, కానీ అవి పిల్లల భవిష్యత్తు జీవితం గురించి మీకు చాలా చెప్పగలవు. త్వరగా మాట్లాడటం, పదాలను గ్రహించడం,  వాక్యాలుగా మాట్లాడటం అధిక IQకి సంకేతాలుగా చెబుతారు. నేర్చుకోవాలనే ఆత్రుత.. నేర్చుకోవాలనే బలమైన కోరిక పిల్లల్లో మంచి IQకి సంకేతం. వారి మనస్సులో చాలా  గందరగోళం ఉంటుంది, దానిని శాంతపరచడానికి వారు ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలకు వీలైనంత వరకు సమాధానమివ్వడానికి ప్రయత్నించండి, తద్వారా పిల్లవాడు సంతృప్తి చెందుతాడు. పిల్లవాడు ఆ  చర్యలను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అది అతనిలో ఉన్నత మానసిక స్థాయికి సంకేతం  కావచ్చు. సంక్లిష్టమైన విషయాలపై ఆసక్తి..  పిల్లలు గణితం,  సైన్స్ వంటి విషయాలపై ఆసక్తిని కనబరుస్తున్నట్లయితే అది చాలా సంతోషకరమైన విషయం. ఒకరి వయస్సు కంటే క్లిష్టమైన విషయాలపై ఆసక్తి చూపడం కూడా అధిక IQకి సూచికగా పరిగణించబడుతుంది. పరిశోధనాత్మక స్వభావం.. జిజ్ఞాస కలిగిన పిల్లలు తమ తల్లిదండ్రులను వింత ప్రశ్నలు వేస్తూంటారు. ఉదాహరణకు, కుళాయి నుండి నీరు ఎందుకు వస్తుంది?  కాఫీ ఎందుకు రాదు? పాల రంగు ఎందుకు తెల్లగా ఉంటుంది? నది ఎందుకు ప్రవహిస్తుంది? చాలా సార్లు తల్లులు, తండ్రులు ఆందోళన చెందుతారు. అయితే  కాస్త ఓపికగా  వారి ప్రశ్నలకు వీలైనంత సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఏకాగ్రత.. పిల్లవాడు ఒక పనిపై ఏకాగ్రతతో ఉంటే, అతను తన పనిని ఆనందిస్తున్నాడని రుజువు చేస్తుంది. చదరంగం ఆడటం లేదా డ్రాయింగ్ ఇలాంటి అధిక ఏకాగ్రత కలిగిన విషయాలు పిల్లలలో  అధిక IQకి సూచిక. సెన్స్ ఆఫ్ హ్యూమర్.. ఎవరైనా తమాషా చేసినా, అవతలి వ్యక్తి చెప్పేదానికి సరైన,  ఆసక్తికరమైన సమాధానం ఇచ్చినా కూడా  పిల్లవాడు చిరాకు పడకుంటే, అది కూడా అధిక IQని కలిగి ఉండడానికి సంకేతం. మంచి హాస్యం అనేది సంతోషకరమైన వ్యక్తి యొక్క గుర్తింపు. మంచి జ్ఞాపకశక్తి..  పిల్లలకు ఏదైనా నేర్పిస్తే వారు మరుసటి రోజు దానిని మరచిపోతారు. కానీ ఆ  విషయాలు గుర్తుంచుకుంటే అది మంచి విషయమే. కష్టమైన పదాలు, రైమ్స్, పండ్లు,  కూరగాయల పేర్లు గుర్తుంచుకోవడం,  ఇంటి చిరునామా,  తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను గుర్తుంచుకోవడం అధిక మానసిక సామర్థ్యానికి సంకేతాలు. పిల్లలలో iq ని ఎలా పెంచాలంటే.. పిల్లల ముందు దుర్భాషలాడకూడదు, వారని కొట్టకూడదు. పిల్లలను వీలైనంత ఎక్కువ సమయం ప్రకృతి మధ్య గడపనివ్వాలి. పిల్లవాడు ప్రశ్నలు అడగడం ప్రారంభించినప్పుడు, అతని ప్రశ్నలకు సాధ్యమైనంతవరకు సరైన,  శాస్త్రీయ సమాధానాలు ఇవ్వాలి. దెయ్యాలు, దెయ్యాలు, జంతువులు, మర్మమైన వ్యక్తులు లేదా ఇతర విషయాలతో పిల్లలను ఎప్పుడూ భయపెట్టవద్దు. ఎల్లప్పుడూ పిల్లల కళ్ళలోకి చూస్తూ వారితో మాట్లాడాలి.  వారు మీతో మాట్లాడేటప్పుడు వారు కూడా మీ కళ్ళలోకి చూసేందుకు ప్రయత్నించండి. ఏదైనా వాయిద్యం నేర్పండి..  పిల్లలకు గిటార్, హార్మోనియం వంటి ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయించడం నేర్పించవచ్చు. ఇది అతని IQ స్థాయిని పెంచడమే కాకుండా  గణిత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. బ్రెయిన్ గేమ్స్ సహాయపడతాయి.. పిల్లల ఉత్సాహం  IQ స్థాయిని పెంచడానికి ఉపకరిస్తాయి.  పిల్లలతో బ్రెయిన్ గేమ్స్   ఆడాలి.   మెదడు వ్యాయామ ఆటలను ఆడనివ్వాలి.  అతని మానసిక,  శారీరక అభివృద్ధికి కూడా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలు ఆడేటప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు.   చెస్, క్యారమ్ లేదా బిజినెస్  ఆటలు ఆడటం నేర్పించవచ్చు. గణిత ప్రశ్నలు.. పిల్లల మానసిక వికాసానికి, గణిత ప్రశ్నలను పరిష్కరించేలా చేయాలి. వాటిని సరదా మార్గంలో పట్టికలు లేదా కూడిక,  తీసివేత సమస్యలను పరిష్కరించేలా చేయండి. ఇలా రోజూ 10 నుంచి 15 నిమిషాల పాటు చేస్తే వారి ఐక్యూ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి లోతైన శ్వాస.. లోతైన శ్వాస మనస్సుకు మంచి ఆలోచనలను తెస్తుంది. ఇది పిల్లలకి ప్రతిదానిపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని పెంచుతుంది,  ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కాకుండా, మీరు  పిల్లలకు తేలికపాటి యోగా ఆసనాలను కూడా నేర్పించవచ్చు.                                      *నిశ్శబ్ద. 

ముప్పై ఏళ్ళకే  ముఖం మీద ముడతలా.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు! వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం మొదట  ముఖంపైనే కనిపిస్తుంది. వృద్ధాప్యం అనేది ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి, కానీ  దాని కారణంగా ముఖం ముసలిగా కనిపిస్తుంది.  ముఖ్యంగా  30 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై  గీతలు,  ముడతలు క్రమంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు. వీటిని చూసి చాలామంది అమ్మాయిలు చాలా నీరసపడతారు, అందం గురించి భయపడతారు. ముడతలు పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు,  లోషన్ల కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు.   కానీ ఇవి ధీర్ఘకాలిక  ఫలితాలను ఇవ్వవు. అయితే ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్  రెమిడీస్ ఉన్నాయి. ఇవి  పురాతన వైద్య శాస్త్రంలో ప్రస్తావించిన ఔషదాలు. ఇవి  చర్మ సంరక్షణకు, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో అధ్బుతంగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఎంత వయసయినా యవ్వనంగా కనిపిస్తారు. తులసి.. ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన ఔషదం. ఇది ముడుతలతో పోరాడటానికి చక్కగా  సహాయపడుతుంది. ముఖంపై తులసిని పూయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది, ఎందుకంటే ఇది తేమను లాక్ చేస్తుంది.  ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనితో చర్మం  మీద ఉండే కరుకుదనం పూర్తిగా తొలగిపోయి చర్మం నునుపుగా మారుతుంది. అశ్వగంధ.. అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  చర్మం  రూపాన్ని చాలా వరకు  మార్చవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల  చర్మం యవ్వనంగా,  మునుపటిలా చిన్న వయసు వారిలా మెరిసిపోతుంది . అంతే కాదు ఇది ముడతలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మార్చేందుకు  సహాయపడుతుంది. ఉసిరి.. యాంటీ-ఆక్సిడెంట్లు,  విటమిన్ సి ఆమ్లా లేదా అమలాకిలో లేదా ఉసిరిలో  సమృద్ధిగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తుంది, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జిన్సెంగ్.. జిన్సెంగ్ ఒక యాంటీ ఏజింగ్ హెర్బ్ . జపనీస్,  కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ హెర్బ్‌లో ఉండే ఫైటోకెమికల్స్ వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతాయి. ఇది   చర్మం సూర్యరశ్మి వల్ల కలిగే నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. సరస్వతి.. సరస్వతి మరొక అత్యంత ముఖ్యమైన,  ప్రభావవంతమైన యాంటీ ఏజింగ్  ఔషదం. ఇందులో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిస్తాయి,  వృద్ధాప్య సంకేతాలతో పోరాడటానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ మూలిక శరీరం  మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పసుపు.. పసుపు ఒక అద్భుత మూలిక. పసుపులో ఉండే కర్కుమిన్ వయసును  తగ్గించడంలో  అద్బుతంగా సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా పోరాడుతుంది.  సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పసుపు ఆహారంలో తీసుకోవడం, ముఖానికి  పూయడం రెండూ ముఖంలో మెరుపును తెసుకొస్తాయి.                                         *నిశ్శబ్ద. 

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!   వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  

 పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ..!! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా,  మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం.  ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం,  కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.  

చుండ్రు తగ్గించే తేలికైన ఉపాయాలు ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల రోజు రోజుకి చుండ్రు సమస్యలు ఎక్కువైపోతున్నాయి . చుండ్రు వల్ల జుట్టు రాలిపోవటం, పేలు రావడం, దురద లాంటివి మొదలవుతాయి. ఈ సమస్యను అరికట్టాలంటే చిన్న చిన్న చిట్కాలు చేయాల్సిఉంటుంది . అవేంటో చూసేద్దాం రండి .. * వేపాకులతో చుండ్రును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. దురదను తగ్గించడమే కాదు.. చుండ్రు పెరగడానికి కారణమయ్యే ఫంగస్‌ పెరుగుదలను కూడా వేపాకు అరికడుతుంది. రెండు గుపిళ్ల నిండుగా వేపాకు, కొద్దిగా మందారకు,కొద్దిగా కలబంద గుజ్జు ఈ మూడింటిని మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. * పిల్ సీడర్ వెనిగర్‌తోనూ చుండ్రును అరికట్టవచ్చు. ఇందుకోసం వెనిగర్ ను, నీటిని సమపాళ్లలో కలపాలి. దీన్ని షాంపుగా వాడి తలస్నానం చేయడం వల్ల చుండ్రు వల్ల వచ్చే దురదను వెంటనే తగ్గించవచ్చు. ఇలా కొద్ది రోజులపాటు చేయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. * కొబ్బరి నూనెతోనూ చుండ్రు ని తరిమేయొచ్చు. కాకపోతే దీనికి టీ ట్రీ ఆయిల్‌ను కలపాల్సి ఉంటుంది. ప్రతి ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 5 - 10 చుక్కల స్వచ్ఛమైన టీ ట్రీ ఆయిల్ కలపాలి. తర్వాత దాన్ని మాడుకు పట్టించడం వల్ల చుండ్రుకు కారణమైన ఫంగస్ నశిస్తుంది. ఒకవేళ టీ ట్రీ ఆయిల్ లేకపోతే మామూలు కొబ్బరినూనె లో కొద్దిగా కర్పూరం పొడి వేసి కలిపి తలకి పెట్టుకున్న చుండ్రు తగ్గుతుంది. * తాజా నిమ్మరసంలోని యాసిడ్లు చుండ్రును కలిగించే ఫంగస్‌ను నాశనం చేస్తాయి. నిమ్మరసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు నుంచి మంచి పరిమళం కూడా వస్తుంది. నిమ్మరసాన్ని మాడుకు పట్టించి ఒక నిమిషంపాటు వదిలేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.చుండ్రు తగ్గే వరకూ ఇలా చేయాలి. * పులిసిన పెరుగును మాస్క్‌గా వేసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుముఖం పడుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ పెరుగు లో ఒక స్పూన్ మెంతి పొడి కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం పూట తలకు పట్టించి గంటపాటు అలా వదిలేయాలి. తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు మృదువుగా మారుతుంది.

ఈ ఫేస్ ప్యాక్‎లతో ముఖంపై ముడతలకు చెక్..!! అందం మనకు భగవంతుడిచ్చిన వరం. దాన్ని సరిగ్గా ఉపయోగించాలంటే మనం టెక్నిక్ తెలుసుకోవాలి. మితిమీరిన మేకప్ కూడా మంచిది కాదు. ఉన్న అందాన్ని ఎక్కువ కాలం నేచురల్ గా మెయింటైన్ చేయాలంటే దాని కోసం నేచురల్ టిప్స్ ఫాలో అవడం మంచిది. అంటే సహజసిద్ధమైన పదార్థాలతో అందాన్ని కాపాడుకోవడం. ఇటీవలి వ్యక్తులలో గమనించదగ్గ ఒక లక్షణం ఏమిటంటే వారు చిన్న వయస్సులో ఉన్నప్పటికీ వారు వృద్ధాప్యంగా కనిపిస్తారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. ఇక్కడ కొన్ని అద్భుతమైన నేచురల్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎగ్ వైట్ , లెమన్ జ్యూస్ ఫేస్ ప్యాక్! గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రొటీన్ మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముడతలను తగ్గిస్తుంది.  నిమ్మరసం విటమిన్ సి కంటెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది మన శరీరం చర్మానికి ఉపయోగపడే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి: -కోడి గుడ్డు నుండి పచ్చసొనను తొలగించి తెల్లసొన తీసుకోండి. -దానిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి -ఒక చెంచా సహాయంతో గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలపండి. -ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి వేలికొనలతో అప్లై చేయండి. -ఇది సుమారు 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వండి. -ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. క్యారెట్,బాదం నూనె ఫేస్ ప్యాక్: ముఖంపై ముడతలను పోగొట్టడంలో,  మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో క్యారెట్ చాలా బాగా పని చేస్తుంది, తద్వారా మీ చర్మం ఎల్లప్పుడూ తాజాగా కనిపిస్తుంది. ఇది కాకుండా, బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ప్యాక్ ను ఇలా ఉపయోగించండి: -మీడియం సైజులో ఉండే రెండు క్యారెట్లను తీసుకుని వాటి పై తొక్క తీసి మెత్తగా ఉడికించాలి. -తర్వాత క్యారెట్‌లను బాగా మగ్గనివ్వాలి -ఇప్పుడు క్యారెట్‌లో ఒక టీస్పూన్ బాదం నూనె వేసి కలపాలి -దీన్ని ఒక గంట పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, మీ చెంపలపై, కళ్ల చుట్టూ, గడ్డం మీద అప్లై చేయండి. -ఇలా అరగంట అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్: బొప్పాయి పండులో పాపైన్ ఉండటం వల్ల, ఇది మృత చర్మ కణాలను తొలగించడంలో పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చాలా సాగేలా, దృఢంగా చేస్తుంది. బొప్పాయిలో మెగ్నీషియం,  ఫోలేట్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన చర్మం,  మృదువైన చర్మానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -బాగా పండిన బొప్పాయి పండు కొన్ని ముక్కలను తీసుకోండి -దీన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి - మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి -తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. దోసకాయ ఫేస్ ప్యాక్: దోసకాయ మీ శరీరానికి యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను అందిస్తుంది. ఇది మీ చర్మంపై ముడతలను తొలగిస్తుంది. అలాగే నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ ప్యాక్ ఎలా ఉపయోగించాలి: -సగం దోసకాయ తీసుకుని బాగా తురుముకోవాలి -దీనికి బీట్ చేసిన గుడ్డులోని తెల్లసొన భాగాన్ని జోడించండి -ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి -దీన్ని మీ చర్మంపై పూయండి. -తర్వాత 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిలో కడిగేయాలి -ఇలా రోజు విడిచి రోజు అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న ఫైన్ లైన్స్ తొలగిపోతాయి

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖ సౌందర్యాన్ని పెంచుకునే సింపుల్ టిప్స్ ఇవే..!! నేచురల్ గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం అందాన్ని పెంచుకోవాలంటే కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు నేచురల్ ఫేస్ ప్యాక్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. చాలామందికి నలుగురిలో తామే స్మార్ట్ గా, అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. తాత్కాలికంగా ముఖ అందాన్ని పెంచినప్పటికీ...సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఇలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ ఒక్కసారి ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. దీని తర్వాత మళ్లీ అందం మసకబారుతుంది! కాబట్టి అనవసరమైన కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, డబ్బు ఖర్చుపెట్టి ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకోవడం కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తులేంటో నేటి కథనంలో చూద్దాం... పండిన అరటి: సాధారణంగా, అరటిపండు ఎక్కువగా పండినట్లయితే, గుజ్జు మెత్తగా మారుతుంది. అలాంటప్పుడు వాటిని తినాలని అనిపించదు. దానిని చెత్తబుట్టలో పడేస్తుంటాము. అయితే ఇకపై అలా చేయకండి, ఈ పండును పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చిన్న వయసులో కనిపించే వృద్ధాప్య లక్షణాలు క్రమంగా మాయమవుతాయి. - ముందుగా, బాగా పండిన అరటిపండును తీసుకుని.. పేస్ట్‌లా చేసుకోవాలి. -ఇందులో అర టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ గట్టి పెరుగు కలపాలి. -ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో మందంగా అప్లై చేసి, పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పాలు : పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా పాలు, దాని ఉత్పత్తుల పేరు ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి. పూర్వ మహారాణులు  తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పాలతో చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ తో స్నానం చేసేవారని పురాణాలు కూడా చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్. ఇది చర్మంపై మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది, ముఖం యొక్క అందం, కాంతిని పెంచుతుంది - కొంచం కుంకుమపువ్వును పాలలో కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. దాదాపు అరగంట తర్వాత స్నానం చేయాలి. - రెండు టేబుల్‌స్పూన్‌ల క్రీమ్‌లో అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న చెంచా శనగ పిండి వేసి బాగా కలపాలి. -ఆ తర్వాత వేళ్ల సహాయంతో ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. ఐదునిమిషాలపాటు ఉంచి నీళ్లతో కడిగేయాలి. కలబంద: సహజంగా లభించే ఈ కలబంద గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఉన్నాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చిన్న వయసులో కనిపించే ముసలితనం సంకేతాలు, చర్మంపై దద్దుర్లు మొదలైనవి చాలా త్వరగా తొలగిపోతాయి. -ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ -తేనె సగం టీస్పూన్ -గట్టి పెరుగు అర టీస్పూన్ -ఒక చిన్న టీస్పూన్ రోజ్ వాటర్ పైన పేర్కొన్న మిశ్రమాలన్ని  ఒక గిన్నెలో వేసి బాగా కలపండి, మందపాటి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు వేళ్ల సహాయంతో, ఈ పేస్ట్‌ను ముఖంపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి.  పావుగంటపాటు పేస్టును ముఖంపై ఉంచి..గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి.   పసుపు:  పసుపును పొగబెట్టినా తక్కువే. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అందానికి ఈ పసుపుతో మంచి సంబంధం ఉంది.  ఈ రోజుల్లో పెద్ద బ్రాండ్ బ్యూటీ కంపెనీలు కూడా తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పసుపుపై ఆధారపడుతున్నాయి. ఒక గిన్నెలో అర చెంచా పసుపు పొడి, ఒక టీ చెంచా నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. వేళ్ల సహాయంతో వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. పదిహేను నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గడమే కాకుండా ముఖ సౌందర్యం కాంతివంతంగా మారుతుంది.

ప్రతి అమ్మాయి తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 5 బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవే..!! నేటి రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో, మనం ఎప్పుడూ చాలా విషయాల గురించి గందరగోళంలో ఉంటాము. వీటిలో ఒకటి మేకప్ ఉత్పత్తులు. అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఇష్టపడతారని మనందరికీ తెలుసు. కానీ మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మన రూపాన్ని కాపాడుకోవడానికి, మనం ఎల్లప్పుడూ కొన్ని వస్తువులను మన బ్యాగ్‌లో ఉంచుకోవాలి. సహజంగానే  మొత్తం మేకప్ కిట్‌ను  బ్యాగ్‌లో అన్ని సమయాలలో ఉంచుకోలేము. అటువంటి పరిస్థితిలో, మన బ్యాగ్‌లో ఎల్లప్పుడూ ఉండవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువుల జాబితా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్: సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని UVA UVB నుండి రక్షిస్తుంది. అంటే సూర్యుని హానికరమైన కిరణాలు, కాలుష్యం నుండి కూడా రక్షిస్తుంది. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా, కనీసం 5 నుండి 10 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ అప్లై చేసి, కొన్ని గంటల తర్వాత మళ్లీ అప్లై చేయండి. మీరు సన్‌స్క్రీన్‌ను ఇండోర్, అవుట్‌డోర్‌లో ఉపయోగించవచ్చు. కాజల్ పెన్సిల్: కాజల్ పెన్సిల్ మహిళల రూపాన్ని తక్షణమే పెంచడానికి పనిచేస్తుంది. ఇది మీ కళ్లను అందంగా మార్చడం ద్వారా మీ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. మీరు స్నేహితుడిని కలవాల్సి వచ్చినా లేదా ఎవరితోనైనా డిన్నర్ కు  వెళ్లాల్సి వచ్చినా ఎల్లప్పుడూ స్మడ్జ్ ప్రూఫ్, వాటర్‌ప్రూఫ్ కాజల్‌ని ఉపయోగించండి. వెట్ వైప్స్: మీ బ్యాగ్‌లో వెట్  వైప్స్ చిన్న ప్యాకెట్ ఉంచడం మర్చిపోవద్దు. మీరు ఆఫీసుకు, కాలేజీకి లేదా బయట ఎక్కడికైనా వెళితే, మీ ముఖంలోని మురికిని శుభ్రం చేయడంలో ఇది సహాయపడుతుంది. మీరు జిడ్డుగల లేదా పొడి చర్మం కలిగి ఉన్నారా, ఇది అందరికీ పని చేస్తుంది.   కాంపాక్ట్: టచ్-అప్‌ల కోసం మీ బ్యాగ్‌లో చిన్న అద్దంతో కూడిన మేకప్ కాంపాక్ట్ తప్పనిసరిగా ఉండాలి. తరచుగా టచ్‌అప్‌లతో, మీరు మీ మేకప్‌ను అతుక్కొని ఉంచుకోవచ్చు. లిప్ బామ్‌: మన పెదవులకు ఎల్లవేళలా పోషణ, తేమ అవసరం. మారుతున్న సీజన్‌లో, మన పెదాలు చాలా పొడిగా, పగిలిపోయేలా చేస్తాయి. కాబట్టి దీనిని నివారించడానికి, మీరు తప్పనిసరిగా మీతో లిప్ బామ్‌ను ఉంచుకోవాలి. లిప్ బామ్‌లు పర్యావరణ కాలుష్యం నుండి మీ పెదాలను రక్షించడంలో కూడా సహాయపడతాయి.  

 పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.. పిల్లలు తరచుగా జ్వరం, ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఆకస్మిక దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం వేధిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ హెచ్చుతగ్గులు. పెరిగిన శరీర ఉష్ణోగ్రత, అంటువ్యాధులతో పోరాడే ప్రక్రియ, శరీరం నుండి ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అందుకే పిల్లలు జబ్బు బారిన పడగానే.. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కాబట్టి పిల్లలు త్వరగా కోలుకోవడానికి తల్లిదండ్రులు ఎలాంటి ఆహారాలు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కరివేపాకు పొడి: పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు పసుపు, కరివేపాకు పొడిని ఆహారంలో చేర్చండి. వీటిలో శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. మిల్క్ షేక్: రుచిలేని నాలుకకు మిల్క్ షేక్ ఉత్తమం. పిల్లలు తినడానికి ఆసక్తి చూపవచ్చు. అరటి-వాల్నట్ మిల్క్ షేక్..జ్వరంతో బాధపడుతున్నవారికి ఇవ్వాల్సిన ఆహారంలో ఒకటి.  ఇది నరాలు, కండరాలు, రోగనిరోధక శక్తి, మెదడుకు మద్దతు ఇచ్చే పూర్తి, పోషకమైన ఎంపికగా పనిచేస్తుంది. ఈ అరటి-వాల్నట్ మిల్క్ షేక్ మీరు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్: పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్‌ను కరకరలాడే స్నాక్‌గా ఇవ్వవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆప్రికాట్లు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష వంటి వాటిని ఇస్తుండాలి. ఇవి ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి. పండ్లు, కూరగాయలు: పిల్లలు త్వరగా కోలుకోవడానికి పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చాలి.  కూరగాయలతో చేసిన వంటకాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. వీటితో పాటు ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. పుచ్చకాయ దాదాపు 91% నీరు కలిగి ఉంటుంది.  జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఇది అనువైనది. అలాగే, పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. వేడి నీరు: పిల్లల జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వేడినీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బిడ్డ గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా వేడిచేసిన నీటిని ఇవ్వండి. వేడి నీళ్ళు గొంతు నొప్పి, మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనంగా పనిచేస్తాయి.  

ఇవి తింటే ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు! వయసు పెరిగే కొద్దీ మన స్కాల్ప్, హెయిర్, స్కిన్ అన్నీ తమ మెరుపును కోల్పోతాయి. మన చర్మం మెరిసిపోవడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అంతే కాకుండా మనం తిన్న తర్వాత మన శరీరంలో జరిగే ప్రక్రియలు కూడా కారణం. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మన చర్మ సౌందర్యాన్ని లోపలి నుండి కాపాడుకోవచ్చు. వయస్సు పెరుగుతున్నా... యవ్వనంగా కనిపించాలంటే వీటిని తినడం అలవాటు చేసుకోండి. బొప్పాయి పండు: బొప్పాయి పండులో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు..యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా లైకోపీన్ బొప్పాయి పండు ఎరుపు రంగులో ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యంతోపాటు చర్మం కూడా మెరుస్తుంటుంది. దానిమ్మ పండు: దానిమ్మలో చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు కొల్లాజెన్ ఉత్పత్తిలో పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా డైట్లో చేర్చుకున్నట్లయితే  చర్మ ఆరోగ్యం క్షీణించదు. అంతేకాదు  చర్మ సమస్యలు కూడా ఉండవు. పెరుగు: పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం. ఇది మన జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. మనం తినే ఏ ఆహారం మన శరీరంలో బాగా జీర్ణమైతే అది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు తినడం వల్ల మన చర్మానికి అవసరమైన విటమిన్ బి12 ఎలిమెంట్స్ కూడా అందుతాయి. ఇది మన చర్మం యొక్క గ్లోను పెంచుతుంది. అంతేకాదు కణాల అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. ఆకు కూరలు: ఆకుకూరల్లో కొల్లాజెన్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.  క్లోరోఫిల్ పుష్కలంగా ఉండటం వల్ల మన చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. టమోటా: టొమాటోలో లైకోపీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి రంగును ఇస్తుంది. టమోటా పండు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఇదే. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన చర్మం  తాజాగా మెరుస్తూ ఉంటుంది. నిత్యం వీటిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.