ముమైత్కు ఓంకార్ వార్నింగ్!
on Mar 2, 2021
ముమైత్ఖాన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న విషయం తెలిసిందే. క్రేజ్ తగ్గిపోవడం ఓ కారణం కాగా... అవకాశాలు ఇచ్చేవాళ్లు లేకపోవడం మరో కారణం.. ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఆమె సినిమాల్లో నటించట్లేదు. బాలకృష్ణ మూవీ 'డిక్టేటర్' తరువాత ముమైత్ చాలా వరకు సినిమాల్లో కనిపించడం మానేసింది.
అయితే తాజాగా ఓంకార్ మళ్లీ మొదలుపెట్టిన `డ్యాన్స్ ప్లస్` షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ముమైత్తో పాటు యష్, రఘు మాస్టర్, బాబా భాస్కర్, యానీ మాస్టర్, మోనాల్ గజ్జర్ కూడా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఈ షో విజయవంతంగా రన్ అవుతోంది. ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోకి రేటింగ్ బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ వారానికి సంబంధించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ముమైత్ ఖాన్ ... సహ జడ్జిగా వ్యవహరిస్తున్న యానీ మాస్టర్ని మైండ్ గేమ్ ఆడుతున్నావని ఇరుకున పెట్టడం.. ఇలా అంటే తాను షో నించి వెళ్లి పోతానని యానీ మాస్టర్ అంటే "వెళ్లిపో.." అని ముమైత్ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సంభాషణ అంతా గమనించి ఓంకార్ "ఎందుకు మీరు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు? .. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డ్యాన్స్ చేసిన వారికి రెడ్ ఇవ్వడం.. మిస్టేక్లు చేసిన వారికి గ్రీన్ ఇవ్వడం ఎందుకు చేస్తున్నారు.. మీ పద్దతి ఏమీ బాగాలేదు." అని ఓంకార్.. ముమైత్కు వార్నింగ్ ఇచ్చేంత పని చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముమైత్ షోలో కొనసాగుతుందా?.. లేక బయటికి వెళ్లిపోతుందా? అన్నది తెలియాలంటే ఈ వీకెండ్ లో ప్రసారం అయ్యే 'డ్యాన్స్ ప్లస్' షో చూడాల్సిందే.