బన్నీతో రీ -ఎంట్రీకి రెడీ!!
on Feb 20, 2019
ఒకప్పుడు హీరోయిన్స్ గా టాప్ హీరోస్ తో సందడి చేసిన నటీమణులు ఇప్పుడు అత్త, అమ్మ, అక్క పాత్రల్లో రీ ఎంట్రీ ఇస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే నదియా, ఖుష్బూ ,మీనా , రమ్యకృష్ణ లు ఈ కోవలో వచ్చినవారే. ప్రజంట్ ఈ లిస్ట్ లో గ్లామర్ క్వీన్ నగ్మా చేరుతున్నారు. గతంలో త్రివిక్రమ్ నదియా, ఖుష్బూలను తన సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు ఇచ్చి అద్భుతమైన రీ ఎంట్రీ కల్పించాడు. ఇప్పుడు నగ్మా కూడా త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీకి తల్లిగా నటించనుందట నగ్మా.
త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే మరో హీరోయిన్ రేణూ దేశాయ్ కూడా రీ ఎంట్రీ కి సిద్దమైంది. పవన్ కళ్యాన్ `బద్రి ` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రేణు పవన్ తోనే `జానీ` సినిమాలో నటించింది. పవన్ ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. పవన్ కళ్యాన్ తో విడిపోయాక తెలుగు ప్రేక్షకులకు కూడా దూరమైంది. తాజాగా ఓ టీవీ షోతో తెలుగు ప్రేక్షకులకు మళ్లీ దగ్గరైంది. త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ``దొంగాట ఫేం` వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు సైన్ చేశాను. గొప్ప రైటర్, సామాజిక వేత్త హేమలత లవణం గారి పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నా. అలాగే మరో సినిమాకు కూడా సైన్ చేశాను. తొందరలోనే షూటింగ్ లో పాల్గొంటాను`` అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది రేణు దేశాయ్. చూద్దాం రేణు రీఎంట్రీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో మరి.