నిహారిక-చైతన్యకు పార్టీ ఇచ్చిన వరుణ్ తేజ్!
on Dec 4, 2020
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ముద్దుల చెల్లెలు నిహారిక, కాబోయే బావ చైతన్యకు శుక్రవారం రాత్రి పార్టీ ఇచ్చాడు. దానికి సంబంధించిన రెండు ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఈ పార్టీకి సంబంధించిన నేపథ్యం.. తెలుపు! పార్టీ వేదిక దగ్గర అన్నింటినీ తెలుపు రంగు వస్తువులతో అలంకరించారు. డిసెంబర్ 9న రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఉదయ్ విలాస్ ప్యాలెస్లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగనున్నది.
వరుణ్ ఇచ్చిన పార్టీకి మెగా కుటుంబానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు పలువురు హాజరయ్యారు. రామ్చరణ్, అల్లు అర్జున్ మాత్రం ఈ పార్టీలో కనిపించలేదు. మిగతా వారంతా వచ్చారు. నిహారికతో పాటు తన కుటుంబంలోని ఇతర సిస్టర్స్తో కలిసి దిగిన ఫొటోను వరుణ్ షేర్ చేశాడు. చిరంజీవి కుమార్తెలు సుష్మిత, శ్రీజ కూడా అందులో ఉన్నారు.
రెండో పిక్చర్లో నిహారిక, చైతన్యతో పాటు వరుణ్, అల్లు బాబీ, శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, స్నేహారెడ్డి, చిరంజీవి ఇద్దరు అల్లుళ్లు తదితరులున్నారు. ఈ ఫొటోలను షేర్ చేసి, "About last night! (sic)." అనే క్యాప్షన్ పెట్టాడు. దీనికి కామెంట్ సెక్షన్లో "Loved everything about last night (sic)." అని కామెంట్ పెట్టింది నిహారిక.
ఈ పార్టీతో తనకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన సుష్మిత, శ్రీజలకు చైతన్య థాంక్స్ చెప్పాడు. చైతన్యను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ నిహారిక-చైతన్య కలిసున్న పిక్చర్ను సుష్మిత షేర్ చేశారు.