వైష్ణవ్ తేజ్.. `జంగిల్ బుక్`
on Mar 1, 2021
కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం `ఉప్పెన`తో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు మెగా కాంపౌండ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. అందులోని ఆశీ పాత్రతో నటుడిగా తనదైన ముద్ర వేశాడు.
కాగా, `ఉప్పెన` విడుదలకు ముందే వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా పూర్తిచేశాడు వైష్ణవ్. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించిన ఈ చిత్రం.. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రసిద్ధ నవల `కొండ పొలం` ఆధారంగా తెరకెక్కింది. ఒక దశలో ఈ సినిమాకి `కొండ పొలం` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని వినిపించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి `జంగిల్ బుక్` అనే పేరుని ఖరారు చేశారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందంటున్నారు.
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని.. ఆగస్టులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మరి.. `ఉప్పెన` తరహాలో `జంగిల్ బుక్`తోనూ వైష్ణవ్ తేజ్ సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. కాగా, ఈ సినిమాకి ద్విశతాధిక చిత్రాల స్వరకర్త కీరవాణి సంగీతమందిస్తున్నారు.
Also Read