స్టైలిష్ స్టార్ నాటు మసాలా మూవీ డైరెక్టర్ బోయపాటితో 'సరైనోడు' ఎందుకు చేశాడు?
on Sep 20, 2020
'స్తైలిష్ స్టార్'గా పేరుపడ్డ అల్లు అర్జున్, పక్కా నాటు మాస్ మసాలా సినిమాలు తీసే బోయపాటి శ్రీను డైరెక్షన్లో 'సరైనోడు' సినిమా చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే బోయపాటి వర్కింగ్ స్టయిల్కు బాలకృష్ణలాంటి మాస్ హీరోలైతేనే కరెక్ట్ అనేది సినీ వర్గాల అభిప్రాయం. అందుకే అర్జున్-బోయపాటి సినిమాని అనౌన్స్ చేయగానే 'అన్యూజ్వల్ కాంబినేషన్'గా చాలా మంది భావించారు. . అయితే 'లెజెండ్' వంటి హిట్ సినిమా తర్వాత బోయపాటి తీసిన సినిమా కావడంతో సహజంగానే దీనిపై ఆసక్తీ, అంచనాలూ వ్యక్తమయ్యాయి.
మరోవైపు 'రేసుగుర్రం' వంటి కెరీర్ టాప్ ఫిల్మ్ తర్వాత చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం మాస్లో కంటే క్లాస్లోనే పేరు తెచ్చుకొని, బయ్యర్లకు లాభాల్ని అందించడంలో విఫలమవడంతో మాంచి మాస్ హిట్ కోసమే బోయపాటితో బన్నీ జతకట్టాడని ఇన్సైడర్స్ అభిప్రాయపడ్డారు. కాకపోతే బన్నీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని మాస్తో పాటు క్లాస్నీ ఆకట్టుకునేలా మలిచేందుకు బోయపాటి కృషి చేసినట్లు సినిమా రిలీజ్ అయ్యాక అర్థమైంది.
గీతా ఆర్ట్స్ బేనర్పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ అన్యూజ్వల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపి కలెక్షన్ల పరంగా బన్నీ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. 'అల.. వైకుంఠపురములో' వచ్చేదాకా దానిదే పైచేయి. 'సరైనోడు' హిందీ డబ్బింగ్ ఫిల్మ్ సైతం యూట్యూబ్లో వ్యూస్ పరంగా ఆలిండియా రికార్డ్ సాధించడం గమనార్హం.
Also Read