టీవీ నటి నవ్య స్వామి కొవిడ్-19 పాజిటివ్!
on Jul 1, 2020
తెలుగు టీవీ తార నవ్య స్వామి కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. 'నా పేరు మీనాక్షి' (ఈటీవీ), 'ఆమె కథ' (స్టార్ మా) సీరియల్స్ ద్వారా ఆమె పాపులర్. ప్రస్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు తలనొప్పితో బాధపడిన ఆమె, డాక్టర్ సలహా మేరకు టెస్ట్ చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
"ఆ విషయం వెల్లడవగానే, ఇంటికి వెళ్తూ తెగ ఏడ్చేశాను. నిద్ర పట్టలేదు. మా అమ్మ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది. నా ఫోన్ బిజీగా మోగుతూనే ఉంది. చాలామందితో మాట్లాడుతూనే ఉన్నాను. లక్షణాల గురించీ, చికిత్స గురించీ, ఇంకా అనేక విషయాలు అడుగుతూ నా వాట్సాప్కు మెసేజ్లు ప్రవాహంలా వస్తూనే ఉన్నాయి. నా పని అధ్వాన్నమైపోయింది. నా సహ నటులను, సాంకేతిక నిపుణులను, ఇతర సిబ్బందినీ ట్రబుల్స్కు గురి చేశాననీ ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతున్నా" అని ఆమె చెప్పింది.
రెండు వారాల క్రితం నుంచీ ఆమె సీరియళ్ల షూటింగ్స్లో పాల్గొంటూ వస్తోంది. ఇప్పుడు ఆమెతో కలిసి పనిచేసిన వాళ్లంతా కొవిడ్-19 టెస్టులు చేయించుకొని, క్వారంటైన్లోకి వెళ్లినట్లు సమాచారం.