'మనం' తర్వాత ఒకే ఫ్యామిలీ.. మూడు తరాల హీరోలు.. ఓ మూవీ!
on Dec 1, 2020
టాలీవుడ్లో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కలిసి ఓ సినిమా చేయడం చూశాం. అది అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా క్లాసిక్గా పేరు తెచ్చుకున్న 'మనం'. ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్లోనూ ఓ సినిమా రూపొందుతోంది. డియోల్ ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అది.. 'అప్నే 2'.
ధర్మేంద్ర, ఆయన ఇద్దరు తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్ కలిసి నటించగా విజయం సాధించిన 'అప్నే' మూవీకి ఇది సీక్వెల్. ఇందులో ఆ ముగ్గురితో పాటు, తరానికి చెందిన కరణ్ డియోల్ కూడా హీరోగా నటిస్తున్నాడు. అతను సన్నీ డియోల్ తనయుడు. 'అప్నే' సినిమా 2007లో రిలీజవగా, దాని సీక్వెల్ 2021 దీపావళికి రానున్నది.
గురునానక్ జయంతి సందర్భంగా ఈ సినిమాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సన్నీ డియోల్ ప్రకటించారు. "బాబా ఆశీర్వాదాలు, మీ ప్రేమాభిమానాలతో మేం మళ్లీ మీ ముందుకు వస్తున్నాం. మా నాన్న, తమ్ముడుతో మరోసారి కలిసి పనిచేస్తుండటం, ఈసారి మా అబ్బాయితోనూ నటిస్తుండటం ఆనందంగా ఉంది. #Apne2, దీవాలీ 2021కి థియేటర్లలో" అని ఆయన పోస్ట్ చేశారు.
2021 మార్చిలో ఈ మూవీ షూటింగ్ మొదలవనున్నది. పంజాబ్తో పాటు, యూరప్లలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ స్పోర్ట్స్ డ్రామాను చిత్రీకరించనున్నారు.
"నా లైఫ్లోని బెస్ట్ ఫిలిమ్స్లో 'అప్నే' ఒకటి. ఇప్పుడు మా మొత్తం ఫ్యామిలీతో.. మా అబ్బాయిలు సన్నీ, బాబీ, నా మనవడు కరణ్తో 'అప్నే 2' చేయనుండటం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇది వెరీ స్పెషల్ ఫిల్మ్. షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా" అని ధర్మేంద్ర షేర్ చేశారు.
సోహమ్ రాక్స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో అనిల్ శర్మ డైరెక్ట్ చేసే ఈ మూవీలో ధర్మేంద్ర జోడీగా కిరణ్ ఖేర్, సన్నీ సరసన శిల్పా శెట్టి, బాబీ జోడీగా కత్రినా కైఫ్ నటించనున్నారు.
Also Read