బాలీవుడ్కి వెళుతున్న మరో టాలీవుడ్ డైరెక్టర్
on Aug 11, 2020
సెన్సిబుల్ టాలీవుడ్ డైరెక్టర్లలో సాయి కిరణ్ అడివి ఒకరు. దర్శకుడిగా పరిచయమైన 'వినాయకుడు' సినిమా ఆయనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలే కాదు... దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సినిమాలో సబ్జెక్టు అటువంటిది మరి. లావుగా ఉన్న ఒక యువకుడు, సన్నగా ఉన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇప్పుడీ సినిమాను ఆయన బాలీవుడ్ తీసుకువెళుతున్నట్టు సమాచారం.
'వినాయకుడు' కథతో సాయికిరణ్ అడివి బాలీవుడ్కి వెళుతున్నారు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నారు. తెలుగులో కృష్ణుడు పోషించిన పాత్రకు హిందీలో భారీ పర్సనాలిటీ ఉన్న కమెడియన్ ను సెలెక్ట్ చేశారట. మిగతా కాస్టింగ్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట. బహుశా... కరోనా తరవాత పనులు ప్రారంభం కావచ్చు.