కరోనాతో తమిళ సీనియర్ నటుడు మృతి
on Sep 16, 2020
కరోనా మహమ్మారి మరో సినీ ప్రముఖుడి ప్రాణాన్ని బలి తీసుకున్నది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే భారతీయ సినిమా పరిశ్రమలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా తమిళ నటుడు ఒకర్ని కరోనా ప్రాణాలు తీసుకున్నది. అసలు వివరాల్లోకి వెళితే...
తమిళ సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కలైంగర్ టీవీ మాజీ జీఎం ఫ్లోరెంట్ పెరీరా కరోనా కారణంగా సోమవారం రాత్రి చెన్నైలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. లాస్ట్ వీక్ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సోమవారం ఫ్లోరెంట్ మృతి చెందారు. సుమారు 50 చిత్రాల్లో ఆయన నటించారు. ఎక్కువగా తండ్రి పాత్రలు పోషించారు. ధనుష్ 'విఐపి 2', 'కుంకీ' తదితర చిత్రాల్లో ఆయన నటించారు.
Also Read