తన లవర్ గురించి చెప్పేసిన తెలుగు హీరోయిన్
on Sep 24, 2016
కొత్త బంగారు లోకం సినిమాతో అమాంతంగా తారాపథంలోకి దూసుకొచ్చింది శ్వేతాబసు ప్రసాద్. ఆ సినిమాలో ముద్దు ముద్దు మాటలతో, చక్కటి నటనతో ఆకట్టుకొంది. చిత్రసీమకు మరో మంచి కథానాయిక వచ్చిందని పొంగిపోయారంతా. కానీ.. ఆ ఘనత ఆ ఒక్క సినిమాకే పరిమితం. ఎంత త్వరగా పేరు తెచ్చుకొందో, అంతే త్వరగా పోగొట్టుకొంది. ఓ కేసులో అడ్డంగా బుక్కయి జైలుకి కూడా వెళ్లింది. దాంతో టాలీవుడ్ పూర్తిగా ఆమెని దూరంగా పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. చంద్రనందిని సీరియల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు శ్వేత పేరు మరో సారి వార్తల్లోకి వచ్చింది. రోహిత్ మిట్టల్ అనే ఓ నవ దర్శకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారని ముంబై పత్రికలు కోడై కూశాయి. కానీ అప్పట్లో ఇద్దరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు శ్వేతాబసు ఈ ప్రేమ వ్యవహారంలో నోరు విప్పింది.
అవును.. మేం డేటింగ్లో ఉన్నాం అని నిర్భయంగా చెప్పేసింది. తమ బంధం ప్రస్తుతానికి చక్కగా సాగుతోందని, అయితే పెళ్లి గురించి ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చింది. కొంతకాలం ప్రేమ పక్షుల్లా తిరిగి... ఆ తరవాత పెళ్లి చేసుకొంటామని చెబుతోంది. శ్వేతాబసు - రోహిత్ల ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా కెరీర్ పై తనకు ఎలాంటి బెంగ లేదని, అవకాశాలొచ్చినప్పుడే చేస్తానని, ప్రస్తుతం లైఫ్ అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చింది శ్వేత. మరి పెళ్లెప్పుడో?? ఈ బంధం ఎంత కాలమో..??
Also Read