హీరోలతో పడక పంచుకున్న తరవాతే...
on Sep 16, 2020
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి నటి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ మీద కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చలన చిత్ర పరిశ్రమకు ఏం చేసిందని ప్రశ్నించారు. పార్లమెంట్లో మంగళవారం హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారంటూ జయా బచ్చన్ ఘాటైన పదజాలంతో మాట్లాడారు. ఎవరి పేరు ప్రస్తావించనప్పటికీ... పరోక్షంగా కంగనా రనౌత్ వ్యాఖ్యలను ఉదహరించారు. దాంతో కంగనా రనౌత్కి కోపం వచ్చింది. ట్విట్టర్ సాక్షిగా జయా బచ్చన్ మీద ఎటాక్ చేయడం ప్రారంభించారు.
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి జయా బచ్చన్ ఏం చేసింది? నేను ఇండస్ట్రీలోకి ఎంటరయ్యే టైమ్కి యాక్ట్రెస్కు రెండు నిమిషాల పాత్రలు, ఐటమ్ నంబర్ సాంగ్స్ లేదా ఒక రొమాంటిక్ సీన్ వచ్చేవి. అదీ హీరోతో పడక పంచుకున్న తరవాతే! విమెన్ సెంట్రిక్, దేశభక్తి సినిమాలతో ఇండస్ట్రీకి ఫెమినిజం అంటే ఏంటో నేను నేర్పించా’’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. దీనిపై నటి స్వర భాస్కర్ ఘాటుగా బదులిచ్చారు.
‘‘నీ డర్టీ మైండ్ని నీకు మాత్రమే పరిమితం చేసుకో. ఒకవేళ నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తిట్టు. నీ నాన్సెన్ వింటా. బురదలో పడి నీతో ఫైటింగ్కి రెడీ. భారతీయ సంస్కృతి మొదటి పాఠం పెద్దలను గౌరవించడం. నువ్వు జాతీయవాదివా?’’ అని కంగనా రనౌత్ ట్వీట్కి స్వర భాస్కర్ రిప్లై ఇచ్చారు. మరోవైపు జయా బచ్చన్ స్పీచ్ పట్ల బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.