'నవరస' మ్యూజిక్ టీమ్లో కార్తీక్.. మణిరత్నంను ప్రశ్నించిన చిన్మయి!
on Oct 28, 2020
నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న మణిరత్నం వెబ్ సిరీస్ 'నవరస' మ్యూజిక్ డైరెక్టర్లలో సింగర్ కార్తీక్ కూడా ఉన్నాడు. 2018లో వచ్చిన #MeToo ఉద్యమంలో అతని పేరును అనేకమంది మహిళలు బయటకు లాగారు. #MeToo ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక సింగర్కు ఇప్పటికీ పని దొరుకుతుండగా, తనలాంటి బాధితులకు మాత్రం పని దొరకడం ఎందుకు దొరకడం లేదని సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ప్రశ్నించారు.
మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'నవరస' యాంథాలజీని బుధవారం ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. సూర్య, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి స్టార్లు నటిస్తున్న ఈ సిరీస్కు కార్తీక్ ఓ మ్యూజిక్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. ఈ అనౌన్స్మెంట్ రాగానే, #ManiRatnam అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్లోకి వచ్చింది. #MeToo ఉద్యమంలో అనేకమంది మహిళలు కార్తీక్కు వ్యతిరేకంగా గళం వినిపించారనీ, అలాంటివాడికి ఎలా పని ఇచ్చారని చిన్మయి సహా పలువురు నెటిజన్లు మణిరత్నంను ప్రశ్నించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మంచి నిర్ణయాలను ఆశించడం మానుకున్నానని ఓ కామెంట్లో చిన్మయి తెలిపారు. వేధింపులకు గురిచేసే వ్యక్తికి ఒక వేదిక కల్పించడం ప్రతి ఒక్కరి సమస్య అని ఆమె అన్నారు.