'మహాసముద్రం'లో శర్వానంద్తో సిద్ధార్థ్ సై!
on Sep 17, 2020
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి ఇద్దరు హీరోలతో 'మహాసముద్రం' చిత్రాన్ని రూపొందించేందుకు సంకల్పించాడు. ఇప్పటికే ఓ హీరోగా నటించేందుకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆసక్తికర చిత్రాన్ని నిర్మించేందుకు ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ ముందుకు వచ్చింది. మహేశ్తో నిర్మించిన బ్లాక్బస్టర్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత అనిల్ సుంకర నిర్మించే సినిమా ఇదే.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో శర్వానంద్తో ఢీకొనే మరో హీరోగా సిద్ధార్థ్ నటించనున్నాడు. 'మహాసముద్రం' స్క్రిప్ట్కు ఫిదా అయిన అతను చాలా కాలం తర్వాత టాలీవుడ్కు తిరిగొస్తున్నాడు. చివరిసారిగా అతను 2013లో సమంత జోడీగా 'జబర్దస్త్' మూవీ చేశాడు. అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. చివరగా అతను జి.వి. ప్రకాశ్తో కలిసి నటించిన డబ్బింగ్ ఫిల్మ్ 'ఎరుపు పసుపుపచ్చ' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
శర్వానంద్, సిద్ధార్థ్లను తెరపై కలిసి చూడటం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతినిస్తుందని ఊహించవచ్చు. త్వరలోనే సిద్ధార్థ్కు సంబంధించిన అఫిషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నది.
Also Read