మహేష్ 'సర్కారు...' మొదలయ్యేది 2021లోనే!
on Oct 24, 2020
అమెరికా వీసాలు సకాలంలో రాకపోవడం వలన 'సర్కారు వారి పాట' చిత్రీకరణ ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో అమెరికాలో ప్రారంభించాలని అనుకున్నారు. వీసాల కోసం అప్లై చేశారు. కానీ, అవి రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు టోటల్ షూటింగ్ షెడ్యూల్ చేంజ్ చేశారట.
కొత్త ఏడాదిలో 'సర్కారు వారి పాట' షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. బహుశా... జనవరి 2వ తేదీ నుండి మొదలు కావచ్చు. సుమారు 45 రోజుల పాటు జనవరి 2 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు అక్కడే చిత్రీకరణ చేస్తారట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటించనున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. 'గీత గోవిందం' విజయం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.