బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట
on Dec 3, 2020
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా హ్యాట్రిక్ విజయాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మహేష్ సరసన కీర్తి సురేష్ నటించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ ని తొలుత అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారని బజ్. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ఉంటుందట. ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ జాతీయ బ్యాంక్ సెట్ ని వేస్తున్నారట. ఇందులో దాదాపు నెల రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని వినికిడి. ఈ షెడ్యూల్ అయ్యాకే చిత్ర బృందం అమెరికా పయనమవుతుందని సమాచారం.
బ్యాంక్ స్కాముల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ ఇదివరకు ఎన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారట.
Also Read