'వార్' సీక్వెల్లో 'టైగర్' అండ్ 'పఠాన్'!
on Nov 25, 2020
సుదీర్ఘ నిరీక్షణ తరువాత, షారుఖ్ ఖాన్ ఇటీవల తన రాబోయే ప్రాజెక్ట్, 'పఠాన్' షూటింగ్ను ముంబైలోని ఒక స్టూడియోలో చడీచప్పుడు లేకుండా ప్రారంభించాడు. మరోవైపు, హీరోయిన్ దీపికా పడుకోనే సోమవారం సెట్స్లో చేరింది. షారుఖ్ తోటి ఏజెంట్గా ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. కొద్ది రోజులు ఈ సెట్స్పై ఉండి, వెంటనే షకున్ బాత్రా డైరెక్ట్ చేస్తోన్న తన తదుపరి సినిమా సెట్స్కు వెళ్లనుంది.
'పఠాన్' ఒక గూఢచారి నేపథ్యంతో నడిచే సినిమా. అందువల్ల దీపికకు కూడా ఇందులో ఉత్తేజభరితమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. టైటిల్ రోల్ను షారుఖ్ పోషిస్తున్నప్పటికీ దీపిక క్యారెక్టర్కు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. 'టైగర్' మూవీలో సల్మాన్ ఖాన్కు జోయా పాత్రలో కత్రినా కైఫ్ ఎలా సాయపడుతుందో, పఠాన్ క్యారెక్టర్కు దీపిక క్యారెక్టర్ అలా సాయపడుతుందని సమాచారం.
కాగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, దీపికా పడుకోనే ఒకే సినిమాలో ఏజెంట్లుగా దర్శనమిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది బాలీవుడ్ బజ్. హృతిక్ రోషన్తో సిద్ధార్థ్ ఆనంద్ తీయనున్న 'వార్' సీక్వెల్లో వారంతా కనిపించనున్నారట. అంటే సల్మాన్, షారుఖ్, కత్రినా, దీపిక కేమియో రోల్స్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ ఆయా యాక్టర్లతో మాట్లాడాడట కూడా. మరోవైపు 'టైగర్ 3' చిత్రీకరణని 2021 ఫిబ్రవరిలో సల్మాన్ ప్రారంభించున్నాడు.