'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్న సాయితేజ్
on Oct 7, 2019
సాయితేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా రూపొందనున్నది. ఈ మూవీ ద్వారా సుబ్బు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బేనర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్'తో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నభా నటేశ్ హీరోయిన్గా ఎంపికైంది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా తెలియజేశాడు సాయితేజ్. "కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. ఎందుకంటే 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు అనే కొత్త దర్శకుడితో నా తదుపరి చిత్రం. మీ ఆశీస్సులు, సపోర్డ్ కావాలి" అని ట్వీట్ చేశాడు. దాంతో పాటు టైటిల్ లోగోను కూడా షేర్ చేశాడు. ఈ రోజు ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రాఫర్గా పనిచేసే ఈ మూవీకి నవీన్ నూలి ఎడిటర్. 'సోలో బ్రతుకే సో బెటర్' అనే టైటిల్ తనకు నచ్చిందని ఫిల్మ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకడైన రానా తెలిపాడు. "ఐ లవ్ దిస్ టైటిల్. అండ్ ఫుల్లీ ఎండార్స్.." అని సరదాగా ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం సాయితేజ్ 'ప్రతిరోజూ పండగే' అనే సినిమాని మారుతి దర్శకత్వంలో చేస్తున్నాడు. అందులో రాశీ ఖన్నా నాయిక.