కొరియోగ్రాఫర్గా మారుతున్న సాయిపల్లవి!
on Jul 14, 2020
'లవ్ స్టోరి' హీరోయిన్ సాయిపల్లవి.. ఆ సినిమా కోసం కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తనున్నది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఆమె నాగచైతన్య జోడీగా నటిస్తోంది. పల్లవి మంచి డాన్సర్ అనే విషయం తెలిసిందే. 'ఢీ' వంటి డాన్స్ షోలలో కంటెస్టెంట్గా పాల్గొని తన డాన్సింగ్ స్కిల్స్తో అందరినీ ఉర్రూతలూగించిన గతం ఆమెది. 'లవ్ స్టోరి'కి సంబంధించి ఒక పాట తప్ప మిగతా పాటలను షూట్ చేశారు. ఆ బ్యాలెన్స్ ఉన్న సాంగ్కు కొరియోగ్రఫీ చేయాల్సిందిగా పల్లవిని డైరెక్టర్ శేఖర్ కోరాడు. ఇప్పటికే 90 శాతం పూర్తయిన ఈ సినిమాలోని మిగతా భాగాన్ని రామోజీ ఫిల్మ్సిటీలో చిత్రీకరించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడు.
శేఖర్, సాయిపల్లవి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. ఇదివరకు ఆ ఇద్దరూ కలిసి చేసిన 'ఫిదా' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయింది. 'లవ్ స్టోరి' అనేది తమ కలలను సాఫల్యం చేసుకోడానికి తమ తమ గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కథ. ఇందులో నాగచైతన్య తొలిసారిగా తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. దీనికోసం అతను చాలా శ్రమించాడు. 'ఫిదా'లో తెలంగాణ అమ్మాయిగా కనిపించి అలరించిన పల్లవి ఈ మూవీలో అందుకు పూర్తి విరుద్ధమైన పాత్రతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. పల్లవి కొరియోగ్రీఫీ అందించే పాట ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Also Read