ప్రభాస్ను ఓడించిన కార్తికేయ.. 'సాహో' అత్యల్ప టీఆర్పీ!
on Oct 29, 2020
పాన్ ఇండియా స్టార్గా పేరు పొందిన ప్రభాస్ 'బాహుబలి 2' తర్వాత నటించిన 'సాహో' సినిమా హిందీ వెర్షన్ హిట్టవగా, తెలుగు వెర్షన్ నష్టాలు చవిచూసింది. ఎంత ఫ్లాపయినప్పటికీ దాని వసూళ్లు మిగతా స్టార్ల హిట్ సినిమాల రేంజికి తగ్గకుండా వచ్చాయి. కానీ టీవీ తెరపై మాత్రం 'సాహో' వీక్షకులను ఆకర్షించలేక పోయింది. జీ తెలుగు చానల్లో తొలిసారిగా అక్టోబర్ 18న ఆదివారం ప్రసారమైన ఆ చిత్రం అతి తక్కువ టీఆర్పీ నమోదు చేయడం ఫ్యాన్స్తో పాటు విశ్లేషకులనూ షాక్కు గురిచేసింది. దానికి కేవలం 5.81 టీఆర్పీ రావడం గమనార్హం.
'సాహో' కంటే కొత్త హీరో కార్తికేయ నటించిన 'గుణ 369' మెరుగైన టీఆర్పీ సాధించడం ప్రభాస్ ఫ్యాన్స్కు మింగుడు పడని విషయం. ఈటీవీలో అదే రోజు అంటే అక్టోబర్ 18నే తొలిసారి ప్రసారమైన 'గుణ 369'కు 5.92 రేటింగ్ రావడం విశేషం. దీంతో ఆ సినిమా టీమ్ తమ సినిమా హయ్యెస్ట్ టీఆర్పీ సాధించిందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసింది. ఏదేమైనా 'సాహో' ప్రీమియర్ కంటే తమ హీరో సినిమా ఎక్కువ టీఆర్పీ సాధించడంతో కార్తికేయ ఫ్యాన్స్ ఆన్లైన్లో సందడి చేస్తున్నారు.
పెద్ద స్టార్ల సినిమాల విషయానికొస్తే, ఇదివరకు పవన్ కల్యాణ్ మూవీ 'అజ్ఞాతవాసి' సాధించిన 6.1 టీఆర్పీయే అతి తక్కువ టీఆర్పీగా రికార్డులకెక్కగా, ఇప్పుడు 'సాహో' దాన్ని బీట్ చేసి, చెత్త రికార్డును సొంతం చేసుకుంది.
Also Read