రోడ్డుకు సుశాంత్సింగ్ రాజ్పుత్ పేరు
on Jul 11, 2020
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ స్టార్ సుశాంత్సింగ్ రాజ్పుత్ పేరును బిహార్లోని పుర్ణియాలో ఒక రోడ్డుకు పెట్టారు. అది సుశాంత్సింగ్ సొంత పట్నం. ముంబైలో తను నివాసం ఉంటూ వచ్చిన అపార్ట్మెంట్లో జూన్ 14న సుశాంత్సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అభిమానులు, ప్రత్యేకించి బిహార్ వాసులు తమ జ్ఞాపకాల్లో అతడిని సజీవంగా ఉంచుకోవాలనుకున్నారు. పుర్ణియాలోని మల్దిహా అనే గ్రామం సుశాంత్ స్వస్థలం. సుశాంత్ గొప్ప కళాకారుడనీ, ఒక వీధికి అతని పేరు పెట్టడం ద్వారా అతనికి నివాళి అర్పించినట్లవుతుందని భావించామనీ మేయర్ సవితాదేవి తెలిపారు. మధుబని నుంచి మాతా చౌక్కు వెళ్లే రోడ్డును ఇక నుంచీ సుశాంత్సింగ్ రాజ్పుత్ రోడ్గా పిలవనున్నారు.
అలాగే ఫోర్డ్ కంపెనీ చుట్టూ ఉన్న ప్రాంతానికి సుశాంత్సింగ్ రాజ్పుత్ చౌక్ అనే పేరు పెట్టారు. కాగా, సుశాంత్సింగ్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సవితాదేవి ఒక లెటర్ కూడా రాశారు. ఇప్పటికే బిహార్కు చెందిన మరో సీనియర్ యాక్టర్ శేఖర్ సుమన్ సైతం సుశాంత్సింగ్ కేసులో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని తరచుగా అడుగుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన సుశాంత్ సన్నిహిత స్నేహితుడు సందీప్ సింగ్తో కలిసి సుశాంత్సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు.