'పవర్స్టార్' ట్రైలర్ చూడాలన్నా డబ్బు చెల్లించాలి!
on Jul 14, 2020
రామ్గోపాల్ వర్మకు జనం దగ్గర్నుంచి డబ్బు ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు. అతి తక్కువ డబ్బుతో చౌకబారు సినిమాలు తీసి, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ట్వీట్స్తో పబ్లిసిటీ తెచ్చుకొని, నాలుగింతలు సంపాదించే విద్య ఆయనకు బాగా అలవడింది. అయితే రిలీజ్ చేయడానికి థియేటర్లు లేవాయె. అందుకేఏ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ ప్లాట్ఫామ్ను ఆయన ప్రారంభించాడు. పోర్న్స్టార్ మియా మల్కోవా హీరోయిన్గా 'క్లైమాక్స్' అనే సినిమా తీసి.. ఆర్జీవీ వరల్డ్ థియేటర్తో పాటు శ్రేయాస్ ఈటీలోనూ రిలీజ్ చేశాడు. ఒక్కో వ్యూకు రూ. 100 వసూలు చేశాడు. ఆ తర్వాత శ్రీ రాపాక అనే యువతి ప్రధాన పాత్రధారిగా 22 నిమిషాల 'నగ్నం' అనే షార్ట్ ఫిల్మ్ తీసి, ఒక్కో వ్యూకు ఏకంగా రూ. 200 వసూలు చేశాడు. ఈ రెండు ఫిలిమ్స్ ద్వారా ఖర్చు పెట్టిన దానికి పది రెట్లు ఆయన సంపాదించాడంటారు.
ఇప్పుడు 'పవర్స్టార్' అనే మూవీని ఆర్జీవీ తీస్తున్నాడు. ఇది పవన్ కల్యాణ్పై తీస్తున్న సినిమాగా అందరికీ తెలిసినా, ఆయన మాత్రం కాదంటున్నాడు. పవన్ కల్యాణ్ కెరీర్ను మలుపు తిప్పిన 'తొలిప్రేమ' విడుదలైన జూలై 24న 'పవర్స్టార్' మూవీని రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. ఈలోగా ఆ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నాడు.
సాధారణంగా ఏ సినిమా నిర్మాతైనా దాని విడుదలకు ముందు ప్రచారం కోసం శాంపిల్గా ట్రైలర్ను యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంటారు. దాన్ని ఉచితంగానే మనం చూస్తుంటాం. అయితే ఆర్జీవీ అందుకు భిన్నంగా 'పవర్స్టార్' ట్రైలర్కు కూడా జనం దగ్గర్నుంచి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఒక్కో వ్యూకు ఆయన రూ. 50 చార్జ్ చేయునున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పట్టించుకోకపోయినా మిగతా హీరోల ఫ్యాన్స్ దాన్ని ఆసక్తిగా చూస్తారనే ఉద్దేశంతోనే ఆయన ఈ పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగానూ ఆర్జీవీ కొత్త ట్రెండ్ను సృష్టించనున్నాడన్న మాట.
Also Read