రవితేజ.. మరో యాక్షన్ ఎంటర్ టైనర్
on Apr 8, 2021
యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన తెలుగు కథానాయకుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. `వెంకీ`, `భద్ర`, `విక్రమార్కుడు`, `కృష్ణ`, `కిక్`, `డాన్ శీను`, `మిరపకాయ్`, `బలుపు`, `పవర్`, `క్రాక్`.. ఇలా రవితేజకి మంచి విజయాలను అందించిన సినిమాలన్నీ వినోదాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్స్ నే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `ఖిలాడి` కూడా అదే తరహా చిత్రం. ఆపై త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్ లో చేయనున్న సినిమా.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన మాస్ ఎంటర్ టైనర్ అని టాక్.
కాగా, తాజాగా మాస్ మహారాజా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఓ డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని `పడి పడి లేచె మనసు`, `విరాట పర్వం` సినిమాల నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తారని బజ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని.. మరికొద్దిరోజుల్లో ఈ ప్రాజెక్ట్ తాలూకు డిటైల్స్ అధికారికంగా బయటకు వస్తాయని వినికిడి. మరి.. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రవితేజకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.