వర్మ చెప్పిన శ్రీదేవి తొడల పురాణం!
on Oct 16, 2017
పుస్తకాలు మనుషుల్ని మేధావుల్ని చేస్తాయ్. ఎక్కువ చదివితే.. పిచ్చోళ్లని చే్స్తాయ్. శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ చదివి నక్సలైట్స్ అయిన వారు ఉన్నారు. చలం సాహిత్యం చదివి.. అందులో సారాన్ని అర్థం చేసుకోకుండా... నైతిక విలువలకు తిలోదకాలిచ్చినవారూ ఉన్నారు. ‘ఓషో’ సాహిత్యం చదివి... జంతువులుగా తయారైన మనుషులూ ఉన్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షి... రామ్ గోపాల్ వర్మ.
నిన్న వర్మగారు ఓ ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో... సంబంధం లేని ఓ టాపిక్ ని లేవనెత్తి... పైశాచిక ఆనందానికి పాల్పడ్డాడు. ఆ టాపిక్ అంతా... శ్రీదేవి తొడల మీదే కావడం గమనార్హం. ‘క్షణం క్షణం’ షూటింగ్ ఓ ఫారెస్ట్ లో జరుగుతోందట. అనుకోకుండా శ్రీదేవి తొడపై ఏదో పురుగు కుట్టిందట. దాంతో అక్కడ వాచిందట. దగ్గర్లో హాస్పిటల్స్ లేకపోవడంతో ఆర్.ఎం.పీ డాక్టర్ ని తీసుకొచ్చారట. ఆ డాక్టర్ చూడ్డానికి నల్లగా, పొట్టిగా.. కూలీ పని చేసుకునేవాడిగా ఉన్నాడట. వాడ్ని చూసి శ్రీదేవి... ‘ఇతను నిజంగా డాక్టరేనానండీ’ అని అమాయకంగా అడిగిందట. వర్మ నచ్చజెప్పాడట.
వాడు ‘ఎక్కడ కుట్టింది?’ అని అడుగున్నట్లు వర్మను చూశాడట. శ్రీదేవి స్కర్క్ పైకెత్తిందట. ఆమె థయిస్ ని చూస్తూ డాక్టర్ చేతులు వణికాయట. చేతులో ఉన్న సిరంజ్ కింద పడిపోయిందట. తర్వాత రెండో సిరంజితో ఇంజక్షన్ చేశాడట. ఇది అవతల పక్క జర్నలిస్ట్ అడక్కపోయినా... వర్మ చెప్పిన విశేషం. అందుకు ఆ జర్నలిస్ట్ గారూ... శ్రీదేవి తొడలు చూసినప్పుడు మీకేం అనిపించలేదా? అని మరో ప్రశ్న. ఇంతకు మించి పైశాచిక ఆనందం ఏమైనా ఉంటుందా? అలా అడగడంలో ఆయనకూ... ఇలా చెప్పడంలో ఈయనకూ... కొత్తగా పొందిన ఆనందం ఏంటో అర్థం కాలేదు.