రజనీ.. రెడీ ఫర్ యాక్షన్!
on Sep 17, 2020
లాక్డౌన్ విధించిన దగ్గర్నుంచీ రజనీకాంత్ నటిస్తోన్న 168వ చిత్రం 'అన్నాత్తే' షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ గ్రాండ్ మూవీకి సంబంధించిన ఆనందకర వార్త తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ సినిమాకి డైరెక్టర్. ఇదివరకు రజనీ నటించిన రోబో, పేట, దర్బార్ సినిమాలను నిర్మించిన సన్ పిక్చర్స్ ఈ సినిమానీ నిర్మిస్తోంది.
గతంలో 2021 పొంగల్కు 'అన్నాత్తే' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సన్ పిక్చర్స్ తన అఫిషియల్ ట్వీట్లో ప్రకటించింది. అయితే కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ నిలిచిపోవడంతో అది సాధ్యపడుతుందా అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. అయితే వారిని ఆనందపరిచే ఒక విషయం మాత్రం తెలియవచ్చింది. 'అన్నాత్తే' షూటింగ్ను పునఃప్రారంభించడానికి రజనీ రెడీ అవుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ రెండో వారం నుంచి 'అన్నాత్తే' సెట్స్లో రజనీ సందడి చేయనున్నారు. హైదరాబాద్లో షూటింగ్ను కొనసాగించడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read