'రాధేశ్యామ్'.. వేసవి మిస్సవుతున్నట్టేనా?
on Jan 25, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తరువాత నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'రాధేశ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. జయరామ్, భాగశ్రీ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. 'రాధేశ్యామ్'ని ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కి స్కోప్ ఉన్న సినిమా కావడం, ఆ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఏప్రిల్ నాటికి 'రాధేశ్యామ్' విడుదలకు సిద్ధమయ్యే అవకాశాలు తక్కువే అని టాక్. అంతేకాదు.. ఈ వేసవిలో తెరపైకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవంటున్నారు. జూలై ప్రథమార్ధంలో 'రాధేశ్యామ్'ని రిలీజ్ చేసేందుకు రాధాకృష్ణ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్టు టాక్.
కాగా, ప్రభాస్ కెరీర్ ని కీలక మలుపు తిప్పిన బాహుబలి సిరీస్ లోని మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' జూలై ప్రథమార్ధంలోనే విడుదలైంది. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి 'రాధేశ్యామ్' కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.