ప్రశాంత్, సుజీత్ బాటలోనే ఆ డైరెక్టర్?
on Jun 5, 2020
‘బాహుబలి’ సిరీస్తో పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ ఊపందుకుంది. ఆ తరువాత పలు చిత్రాలు ఇదే బాట పట్టాయి. కాకపోతే ఆ సినిమాల్లో కొన్ని మాత్రమే వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాలు.. ‘కేజీయఫ్ – చాప్టర్1’(2018), ‘సాహో’ (2019). ‘కేజీయఫ్ – చాప్టర్1’తో కన్నడ చిత్రాల స్థాయి పెరగగా.. ‘సాహో’ హిందీనాట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినాని మరోసారి తెలియజేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అటు ‘కేజీయఫ్ – చాప్టర్1’, ఇటు ‘సాహో’ - ఈ రెండు చిత్రాలు కూడా ఆయా దర్శకుల కెరీర్లో రెండో ప్రయత్నాలే. ‘ఉగ్రమ్’ (2014 - కన్నడ) వంటి బ్లాక్బస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన సినిమా ‘కేజీయఫ్ – చాప్టర్1’ కాగా.. ‘రన్ రాజా రన్’ (2014) వంటి విజయవంతమైన చిత్రం తరువాత సుజీత్ రూపొందించిన సినిమా ‘సాహో’. అలా.. ఒకే సంవత్సరంలో దర్శకులుగా తొలి అడుగేసిన ప్రశాంత్, సుజీత్ ఇద్దరూ కూడా తమ కెరీర్లో రెండో సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్స్గా అవతరించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వీరిద్దరి బాటలోనే మరో యువ దర్శకుడు రెండో సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘జిల్’ (2015) ఫేమ్ రాధాకృష్ణ. ప్రశాంత్, సుజీత్ తరహాలో తొలి చిత్రంతోనే స్టైలిష్ ఫిల్మ్ మేకర్గా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ.. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడుగా తన రెండో సినిమాను రూపొందిస్తున్నాడు. పీరియడ్ రొమాంటిక్ సాగాగా తయారవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (ప్రభాస్ 20).. తెలుగుతో పాటు హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది.
సో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సమేతంగా పాన్ ఇండియా బరిలో దిగుతున్న రాధాకృష్ణ.. ప్రశాంత్, సుజీత్ తరహాలోనే రెండో సినిమాతో సంచలనం సృష్టిస్తాడేమో చూడాలి.
Also Read