తమన్నా.. పాయల్ రూటులో పునర్నవి?
on Jul 10, 2020
ఇటీవల 'ఆహా' ఓటీటీలో ఒక షో చేయడానికి మిల్క్ బ్యూటీ తమన్నా అంగీకరించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా వంటి స్టార్ హీరోలు... తమన్నా స్నేహితులు ఈ టాక్ షోకి అతిథులుగా వస్తారని సమాచారం. మరో హాట్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ 'ఆహా'లో వెబ్ సిరీస్ చేయడానికి సంతకం చేశారని టాక్. సమంత కూడా చేయవచ్చని సమాచారం. వీళ్ల రూటులో తెలుగమ్మాయి, బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం వెళుతున్నారట.
త్వరలో ఆహా కోసం రూపొందబోయే ఒక వెబ్ సిరీస్లో నటించడానికి పునర్నవి భూపాలం సూత్రప్రాయంగా అంగీకరించారని సమాచారం. ఇతర నటీనటులు, దర్శకుడు వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్. కరోనా ప్రభావం తగ్గిన తరవాత షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ఫైన్ ట్యూనింగ్ జరుగుతుందని తెలిసింది.