'కేజీఎఫ్' దర్శకుడు.. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత.. ఓ ప్రభాస్ సినిమా!
on Sep 19, 2020
లాక్డౌన్లో ప్రభాస్ కథల మీద కాన్సంట్రేట్ చేసినట్టు ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలకు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' చేస్తున్న ప్రభాస్... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో 'ఆదిపురుష్' చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తాడని ఎప్పటినుండో వినిపిస్తోంది. కానీ, అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం లేదు. ఇటీవల హీరోకి కథ చెప్పిన ప్రశాంత్ నీల్, హీరో నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్న డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మిస్తారని సమాచారం.
ప్రభాస్ కంటే ముందు ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ చేస్తుకున్నాడు ప్రశాంత్ నీల్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఆ సినిమా చేయనున్నాడు. 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ సినిమా ప్రభాస్ కంప్లీట్ చేసేలోపు... ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేస్తాడట.