నా మీద పడి ఏడుస్తున్నారు
on Nov 13, 2017
పోసాని కృష్ణమురళి.. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తనలోని అన్ని కోణాలను ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమాల్లోనే కాదు.. బయటా పంచ్ల మీద పంచ్లు వేసేస్తుంటారు పోసాని. అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా.. ఎవ్వరినీ వదలిపెట్టని ముక్కుసూటితనం పోసాని సొంతం.. ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే లక్షల్లో డిమాండ్ చేస్తారటగా అని యాంకర్ అడగ్గా.. దానికి పోసాని దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.. పోసాని ఇవాళ రిచ్, కాస్ట్లీ అని అంటున్నవారందరినీ ఒక్కటే అడుగుతున్నా.. నేను అప్పట్లో సినిమాలు తీసి నష్టపోయినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు..? అప్పుల పాలైపోయి.. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు ఎవడు మాట్లాడలేదే.. నాడు నన్ను హేళనగా మాట్లాడిన వారే.. ఇప్పుడు పోసాని అంత సంపాదిస్తున్నాడా..? అని నా మీద పడి ఏడుస్తున్నారు. పోనివ్వండి.. ఏడిచే వాళ్లని ఏడవనివ్వండి.. నేనెవర్ని దోచుకోలేదు.. కష్టపడే సంపాదించుకున్నా.. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన దర్శకనిర్మాతలకు, హీరోలకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు.