ప్రభాస్ నాకెంత ఫుడ్ పంపాడో తెలుసా?
on Mar 31, 2020
'సాహో' షూటింగ్ సమయంలో ప్రభాస్ పంపిన ఫుడ్ ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి శ్రద్ధా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. మురళీ శర్మ అయితే ప్రభాస్ ఇంటి నుండి వచ్చే గుత్తి వంకాయ సూపరో సూపర్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. 'బాహుబలి' సమయంలో ప్రభాస్ ఫామ్ హౌస్కి వెళితే... రకరకాల బిర్యానీలు, 50 రకాల వంటలు ఉన్నాయని రాజమౌళి చెప్పారు. ప్రభాస్ ఇంటి భోజనం, ఆతిథ్యం గురించి చెప్పి ఆశ్చర్యపోయిన సెలబ్రిటీల జాబితాలో పూజా హెగ్డే కూడా చేరారు. ప్రభాస్ కథానాయకుడిగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రేమకథా సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షూటింగులో ప్రభాస్ పంపిన ఫుడ్ గురించి ఆమె ఏం చెప్పారంటే...
"ప్రభాస్ ఒకసారి ఫుడ్ పంపిస్తా అన్నారు. 'కొంచెం పంపండి' అన్నాను. అప్పుడు ఆయన నాకెంత ఫుడ్ పంపాడో తెలుసా? ఆల్మోస్ట్ 50 మందికి సరిపడా ఫుడ్ పంపారు. బోల్డన్ని వెరైటీలు ఉన్నాయి. తర్వాత ఒకరోజు 'మీరు పంపిన ఫుడ్ తింటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఫ్యాటీ అయిపోతా' అన్నాను. 'ఏం పర్లేదు. గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చేస్తాం' అన్నారు. నేను నవ్వేశాను" అని పూజా హెగ్డే వివరించారు. లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉన్న పూజా హెగ్డే, ఈ ఖాళీ సమయంలో గిటార్ నేర్చుకుంటున్నారు.
Also Read