పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నాడా?
on Jan 13, 2018
కొన్ని సంఘటనలు మన జీవితంలో పెను మార్పులు తీసుకు వస్తాయి. అలాగే అజ్ఞాతవాసి రిజల్ట్ పవన్ కళ్యాణ్ మనసు మార్చేలా చేసింది అంటున్నారు ఆయనకీ దగ్గరగా ఉన్న వాళ్ళు. రెండు సినిమాలు తీసి తర్వాత ఇండస్ట్రీ కి గుడ్ బై చెబుదాం అనుకున్న పవర్ స్టార్, తన ఆలోచన విరమించుకున్నారట. కొన్ని హిట్లు తీసి ఘనంగా వీడ్కోలు చెబితే బాగుంటుందని, లేదంటే తన పొలిటికల్ కెరీర్ కి కూడా పెద్ద దెబ్బ అని భావిస్తున్నాడట. స్టోరీ, డైరెక్టర్స్ విషయంలో బెస్ట్ కేర్ తీసుకొని ఫాన్స్ మెచ్చేలా కొన్ని సినిమాలు చేద్దాం అని నిర్ణయించుకున్నాడట. ఫ్లాప్ ఇచ్చినా కూడా త్రివిక్రమ్ ని ఒక మంచి కథ సిద్ధం చేయమని చెప్పాడట. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత తమ సినిమా పట్టాల పైకి తీసుకెళదామని తన నిర్ణయం చెప్పాడట. త్రివిక్రమ్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసాడట. సో, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందన్న మాట. అయితే, అజ్ఞాతవాసి దెబ్బకి త్రివిక్రమ్ కూడా కథ విషయంలో అన్ని జాగర్తలు తీసుకుంటాడు అనడంలో సందేహం అక్కర్లేదు.