మహేష్ తర్వాత నాగచైతన్యతో తప్పకుండా...
on Apr 10, 2020
సూపర్స్టార్ మహేష్బాబుతో పరశురామ్ సినిమా పక్కా. అందులో నో డౌట్. లాక్ చేసేశారు కూడా! మరి, ఈ సినిమా అవకాశం పరశురామ్కి రావడానికి ముందు, అక్కినేని నాగచైతన్యతో పరశురామ్ ఒక సినిమా అనౌన్స్ చేశాడు. మహేష్తో సినిమా చేసే అవకాశం వచ్చిన తర్వాత, చైతూ సినిమాను పక్కన పెట్టేశాడని గుసగుసలు వినిపించాయి. అయితే... అసలు మేటర్ వేరే ఉందట. మహేష్ సినిమా పూర్తయిన తర్వాత మీతో తప్పకుండా సినిమా చేస్తానని నాగచైతన్యకు దర్శకుడు మాట ఇచ్చాడట.
నిజం చెప్పాలంటే... 'గీత గోవిందం' విజయం తర్వాత మహేష్తో సినిమా చేయాలని పరశురామ్ కథ చెప్పారు. హీరోకి నచ్చింది. అయితే... మధ్యలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా వచ్చింది. ఆ తర్వాత చేస్తారని అనుకుంటే వంశీ పైడిపల్లికి మహేష్ అవకాశం ఇచ్చారు. 'గీత గోవిందం' తర్వాత గ్యాప్ ఎక్కువ అవుతుందని నాగచైతన్యతో సినిమా అనౌన్స్ చేశారు. ఈలోపు మహేష్ నుండి పరశురామ్కి పిలుపు వచ్చింది. అప్పటికి చైతూతో సినిమా అంగీకరించారు కనుక... వెంటనే అక్కినేని హీరో ఇంటికి వెళ్లారట. తన పరిస్థితి వివరించి, చైతూ నుండి అనుమతి తీసుకుని మహేష్ సినిమా స్క్రిప్ట్ ఫైన్ ట్యూన్ చేయడం స్టార్ట్ చేశారట.
మహేష్ సినిమా కోసం నాగచైతన్య సినిమా పక్కన పెట్టలేదని పరశురామ్ సన్నిహితుల వద్ద చెప్పారట. చైతన్యతో అనుకున్న 'నాగేశ్వరరావు' కథ తన మనసుకు దగ్గరైనది అనీ, మహేష్ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాను తప్పకుండా చేస్తానని చెప్పారట. అదీ సంగతి!