మరోసారి మెస్మరైజ్ చేసిన నిత్యా మీనన్!
on Mar 2, 2021
అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలకే ఓటేసే ఈ తరం కథానాయికల్లో నిత్యా మీనన్ ఒకరు. తెలుగునాట పదేళ్ళుగా రాణిస్తున్న ఈ కేరళకుట్టి.. `అలా మొదలైంది`, `ఇష్క్`, `గుండె జారి గల్లంతయ్యిందే`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` చిత్రాలతో నటిగా చెరగని ముద్ర వేశారు. అడపాదడపా స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తున్న నిత్య.. పాత్ర పరిధి ఎంతైనా యాక్ట్రస్ గా ఫెయిల్ అయిన సందర్భాలు తక్కువనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమ్ అయింది. అందులోనూ తనదైన అభినయంతో మెస్మరైజ్ చేశారు నిత్య. ఆ వివరాల్లోకి వెళితే.. `నిన్నిలా నిన్నిలా` పేరుతో అని శశి దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా ఇటీవల `జీ ప్లెక్స్`లో స్ట్రీమ్ అయింది. అశోక్ సెల్వన్, రీతూ వర్మ, నిత్యా మీనన్ ఇందులో ముఖ్య భూమికలు పోషించారు. ముగ్గురు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అయితే ద్వితీయార్ధంలో నిత్య పాత్ర ఎంటర్ అయ్యాకే సినిమా మరో స్థాయికి చేరుకుంది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. మొత్తమ్మీద.. `నిన్నిలా నిన్నిలా` చిత్రంతో మరోసారి తన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు నిత్య.