ప్రభాస్... తెలుగు కంటే హిందీ ఎక్కువైందా?
on Sep 21, 2019
ప్రభాస్ కొత్త సినిమాపై 'సాహో' ఎఫెక్ట్ పడింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. ఆల్రెడీ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఎప్పుడో స్క్రిప్ట్ లాక్ చేశారు. చేయడానికి ముందు ఏడాదికి పైగా స్క్రిప్ట్ వర్కులు, మళ్లీ మార్పులు జరిగాయి. 'సాహో' రిజల్ట్ చూసి... స్క్రిప్ట్ లో మార్పులు చేయమని దర్శకుడికి ప్రభాస్ సూహించాడట. తెలుగు ప్రేక్షకులను 'సాహో' అంతగా ఆకట్టుకోలేదు. కానీ, హిందీలో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. రూ. 150 కోట్లు క్రాస్ చేసింది. ఇంకా కొన్ని ఏరియాల్లో ఆడుతుంది. అందుకని, దర్శకుడు రాధాకృష్ణకు హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథలో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ చెప్పాడని టాక్. దీనిపై ఇండస్ట్రీలో, ప్రభాస్ హార్డ్ కొర్ తెలుగు అభిమానుల్లో భిన్నమైన స్పందన వ్యక్తమవుతుంది. 'సాహో'లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు తక్కువ అవ్వడం వల్లే సరైన వసూళ్లు రాలేదని, మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారో అని అభిమానులు అనుకుంటున్నారు. తెలుగు కంటే హిందీకి ప్రభాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కొందరికి నచ్చలేదు. మరికొందరు అభిమానులు హిందీలో తమ హీరో మార్కెట్ పెరుగుతుంది కాబట్టి తప్పు లేదని అంటున్నారు.
Also Read